దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలి

Mar 25 2026 7:10 AM | Updated on Mar 25 2026 7:10 AM

● బీజేఎల్పీ ఉపనేత పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌: దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నెలవారీ పెన్షన్‌ను పెంచాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు, నిజామాబాద్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముస్తాపూర్‌ అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement