మొక్కలు
ఆదిలాబాద్టౌన్: మహిళా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పాల్ యాక్షన్ యాక్ట్ ప్రోగ్రాం అధికారి వందన అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో రిమ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెడికోలు, నర్సింగ్ విద్యార్థులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విధులు నిర్వహించే చోట వేధింపులు, ఇబ్బందులకు గురైతే రిమ్స్ డైరెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పురుష ఉద్యోగులు మహిళలపై మర్యాదపూర్వకంగా మెదలాలని, స్నేహపూర్వకంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఇబ్బందులకు గురిచేస్తే నమోదు చేసే చట్టాలు, కే సుల వివరాలను వివరించారు. ఇందులో రి మ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ చైర్ ప ర్సన్ బండారి అనూష, వైస్ ప్రిన్సిపాల్ సరోజ, విద్యావిల్సన్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
మండలాల వారీగా లక్ష్యం వివరాలిలా...
మండలం జీపీలు నాటాల్సిన నర్సరీలు
ఆదిలాబాద్ రూరల్ 34 55,000 16
బజార్హత్నూర్ 30 52,000 15
బేల 37 50,000 28
భీంపూర్ 26 86,000 26
భోరజ్ 17 21,000 07
బోథ్ 33 50,000 06
ఇచ్చోడ 32 52,000 17
గాదిగూడ 25 57,500 25
గుడిహత్నూర్ 26 50,000 22
ఇంద్రవెల్లి 28 75,000 06
జైనథ్ 42 25,200 05
మావల 03 25,000 02
నార్నూర్ 23 56,000 08
నేరడిగొండ 32 50,000 10
సాత్నాల 17 25,000 05
సిరికొండ 19 26,300 06
సొనాల 11 27,000 04
తలమడుగు 28 50,000 11
తాంసి 14 50,000 13
ఉట్నూర్ 38 1,00,000 05


