● రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం ● అవార్డు అందుకున్న డీఎంహెచ్వో
ఆదిలాబాద్టౌన్: క్షయ నియంత్రణలో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణలో ముందు వరుసలో నిలిచింది. 2025 సంవత్సరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ను పకడ్బందీగా అమలు చేశారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రజుమంలో వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ చేతుల మీదుగా డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఫ్యామిలీ అవార్డు అందుకున్నారు. వైద్యాధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.


