అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Jan 6 2026 1:58 PM | Updated on Jan 6 2026 1:58 PM

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

● ప్రజావాణికి 103 వినతులు ● దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు

కై లాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్లు ఎస్‌.రాజేశ్వర్‌. కె.శ్యామలాదేవి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి హామీ, స్వయం ఉపాధి, ఆర్థిక చేయూత వంటి తదితర అంశాలపై ఈ వారం మొత్తం 103 అర్జీలు అందినట్లు అధికారులు వెల్ల డించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌. రాజు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement