అర్జీల వెల్లువ
కై లాస్నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చి కలెక్టర్ రాజర్షి షా ఎదుట తమ గోడు వినిపించారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. కాగా, ఈ వారం ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, స్వయం ఉపాధి కల్పన వంటి అంశాలపై మొత్తం 110 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..


