ఉపాధ్యాయ అర్హత.. ‘గురు’తర బాధ్యత
విడుదలైన టెట్ నోటిఫికేషన్.. మొదలైన ఆన్లైన్ దరఖాస్తులు అర్హత సాధించేందుకు ఇన్సర్వీస్ టీచర్ల మల్లగుల్లాలు సన్నద్ధమవుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు
నిర్మల్ఖిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. టీచర్ నియామకాలకు ఇది తప్పనిసరి. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఎన్సీటీఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని ముద్రించింది. దీంతో బీఈడీ, డీఈడీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీజీహెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారు ఇక టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో గుబులు..
పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9,791 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2012, 2017, 2024 డీఎస్సీ ద్వారా వచ్చినవారు టెట్ అర్హత సాధించి ఉన్నారు. అంతక ముందు నియామకమైన ఉపాధ్యాయులు 5,590 మందికి టెట్ అర్హత లేదు. వీరంతా పరీక్షకు సిద్ధం కావా ల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా ప్రమోషన్లలో వీరంతా టెట్ అర్హత లేకుండానే పదోన్నతి పొందా రు. ఇప్పుడు ఆ అర్హత తప్పక సాధించాలి.
కొత్త మార్గదర్శకాలు..
ఎన్సీటీఈ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఉపాధ్యాయుడికి టెట్ అర్హత ఉండాలి. దీని నుంచి మినహాయించుకోవాలని టీచర్లు చేసిన ప్ర యత్నాలు ఫలించలేదు. దీంతో టెట్ హాజరు తప్పనిసరి అవుతోంది. మరోవైపు డీఈడీ, బీఈడీ పూర్తి చేసి సర్కారు కొలువు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కూడా టెట్కు సిద్ధమవుతున్నారు.
నోటిఫికేషన్ విడుదల..
ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన నిరుద్యోగులు, ఇన్సర్వీసుటీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నా రు. ఈనెల 29వరకు గడువు ఉంది. జనవరి లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
జిల్లాల వారీగా వివరాలు..
జిల్లా ఉపాధ్యాయులు టెట్ అర్హత
లేనివారు
మంచిర్యాల 2,525 1,230
ఆదిలాబాద్ 2,636 1,845
నిర్మల్ 2,600 1,500
ఆసిఫాబాద్ 2,030 1,015


