● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

● అదన

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్

కైలాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్‌ శ్యా మలాదేవి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆ మె అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ఉపాధి చూపాలని కొందరు, వసతి గృహాల్లో సీట్లు కల్పించాలని ఇంకొందరు, ఇంది రమ్మ ఇళ్లు కేటాయించాలని మరికొందరు అర్జీలు అందజేశారు. వాటిని స్వీకరించిన ఆమె అధికారులకు అందజేస్తూ సత్వ రం పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్‌ లేకపోవడంతో పలువురు జిల్లా అధికారులు గైర్హాజరు కాగా మరికొంతమంది మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..

వినతి స్వీకరించి సమస్య అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి

మాకు న్యాయం చేయండి

మేమంతా ఎస్సీ కులానికి చెందిన నిరుపేదలం. సొంత ఇండ్లు కాని వ్యవసాయ భూములు కాని లేవు. కూలీనాలీ చేసుకుని పొట్టగడుపుతున్నాం. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లకు అన్ని విధాలా అర్హులైనప్పటికీ అధికారులు మంజూరు చేయలేదు. ఇండ్లు ఉన్నవారికే మంజూరు చేసి మాకు అన్యాయం చేశారు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం.

– కుమారి గ్రామస్తులు, నేరడిగొండ

రోడ్డును కబ్జా చేశారు

మా గ్రామంలోని రోడ్డును అల్లూరి రవీందర్‌రెడ్డి, గంగారెడ్డిలు తమ చేనులోని స్థలమంటూ కబ్జా చేశారు. మా తాతల కాలం నుంచి ఆ రో డ్డు గుండానే రాకపోకలు సాగిస్తున్నాం. బస్సులు,ఆటోలు సైతం ఆ మార్గం గుండానే వెళుతుంటాయి. అలాంటి రోడ్డును ఆక్రమించిన సదరు వ్యక్తులు మీ గ్రామానికి రోడ్డు లేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారణ జరి పించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

–దిమ్మ గ్రామస్తులు, ఆదిలాబాద్‌ రూరల్‌

వేధింపులకు గురి చేస్తున్నారు..

నేను మాజీ మావోయిస్టును. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలువడంతో ప్రభుత్వం నాకు రాంనగర్‌లోని సర్వే నంబర్‌ 19/1లో భూమిని కేటాయించింది. ఆటో నడుపుకుంటూ 35 ఏండ్లుగా అందులోనే నివసిస్తున్న. ఇంటి పన్నుతోపాటు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, కరెంట్‌ బిల్లు వంటి స్థలం డాక్యుమెంట్లన్నీ నా పేరిటే ఉన్నాయి. అయితే ఆ స్థలం నాదంటూ ఆదిల్‌ అనే ఆర్‌ఎంపీ నన్ను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాను. విచారణ జరిపించి వేధింపుల నుంచి కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

– మావురపు నర్సయ్య, రాంనగర్‌

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్1
1/3

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్2
2/3

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్3
3/3

● అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ● గ్రీవెన్స్‌లో వినతుల స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement