
పంచాయతీ కార్యదర్శుల నిరసన
కై లాస్నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఏవో వర్ణ, డీపీవో కార్యాలయ ఉద్యోగి కల్పనకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ట్రెజరీలో పెండింగ్లో ఉన్న చెక్కులు వెంటనే క్లియర్ చేయాలన్నారు. అలాగే కార్యదర్శుల ఆన్లైన్ హాజరు నమోదు కోసం తెచ్చిన ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దీని పై ప్రభుత్వం స్పందించకుంటే సామూహిక సెలవుపై వెళతామని స్పష్టం చేశారు.