హస్తం.. ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

హస్తం.. ఫోకస్‌

Jun 11 2025 8:43 AM | Updated on Jun 11 2025 8:43 AM

హస్తం

హస్తం.. ఫోకస్‌

● ఇక కాంగ్రెస్‌ జిల్లా కమిటీలు ● నెలాఖరులో డీసీసీ అధ్యక్షుడి ఖరారు ● ఉమ్మడి జిల్లా ఆధారంగా సామాజిక సమీకరణాలు ● అంతకుముందే మండల, బ్లాక్‌ కమిటీలు

సాక్షి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ జిల్లా కమిటీ, డీసీసీ అధ్యక్షుడి ఖరారు ఈ నెల చివరిలోగా పూర్తి చేయనున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల లోనే అన్ని మండలాలతో పాటు పట్టణంలో సమావేశాలు పూర్తి చేసిన హస్తం పార్టీ ఆ నెల చివరిలోనే కమిటీలు ఖరారు పూర్తి చేస్తామని తొలుత వెల్లడించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ సమావేశాలు పూర్తి కాకపోవడం, ఇతర అంశాల కారణంగా ఆలస్యమైనట్లు ముఖ్య నేతలు పే ర్కొంటున్నారు. ఈ నెల మూడో వారం వరకు మండల, పట్టణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలు మొద ట ఖరారు కానున్నాయి. చివరిలో జిల్లా అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ పూర్తి కావడంతో పార్టీ అధిష్టానం ఇక జిల్లా కమిటీలపై దృష్టి సారించింది.

సామాజిక న్యాయానికి పెద్దపీట..

రాష్ట్ర కమిటీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ అధిష్టానం జిల్లా కమిటీల ఎంపికలో నూ అదే విధానం అవలంభించనున్నట్లు ముఖ్య నే తలు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకం ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఎస్టీ,బీసీ, వెల్మ, రెడ్డి సామాజిక వర్గాల వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ నుంచి ఈనెల చివరిలో పరి శీలకులు జిల్లాకు రానున్నారు. వారే ఉమ్మడి జిల్లాలో అధ్యక్షుల నియామకాన్ని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రసు తం ఆదిలాబాద్‌లో డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. నిర్మల్‌లో శ్రీహరిరావు, కుమురంభీంలో విశ్వప్రసాద్‌, మంచిర్యాలలో సురేఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు ఒకే సామాజిక వ ర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మా త్రం ఉమ్మడి జిల్లాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు..

టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి సామాజిక సమీకరణాల ఆధారంగా ఏడుగురికి చోటు కల్పించారు. గతపార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చోటు దక్కింది. అలాగే ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు, సీని యర్‌ నాయకుడు నరేశ్‌జాదవ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చోటు లభించింది.

హస్తం.. ఫోకస్‌1
1/3

హస్తం.. ఫోకస్‌

హస్తం.. ఫోకస్‌2
2/3

హస్తం.. ఫోకస్‌

హస్తం.. ఫోకస్‌3
3/3

హస్తం.. ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement