
రిమ్స్లో మెరుగైన వైద్యసేవలు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ను పరిశీలించారు. కేంద్రం రూ.23 కోట్ల నిధులతో ఈ పనులు చేపడుతుందని పే ర్కొన్నారు. జిల్లాకు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి, క్రిటికిల్ కేర్ యూనిట్ను ప్రధాని మోదీ అందించారని తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి సహకరిస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ఆహ్వానిస్తామన్నారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులున్నారు.