సమస్యల సత్వర పరిష్కారానికి కృషి● | - | Sakshi
Sakshi News home page

సమస్యల సత్వర పరిష్కారానికి కృషి●

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

సమస్యల సత్వర   పరిష్కారానికి కృషి●

సమస్యల సత్వర పరిష్కారానికి కృషి●

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఫిర్యాదుదారులపై బాధ్యతగా వ్యవహరించి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ అఖిల్‌ మహా జన్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. దాదాపు 40 మంది వరకు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. అనంతరం ఎస్పీ ఫోన్‌ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఇందులో సిసి కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్‌ కవిత, వామన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయి..

పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఎస్పీ అన్నారు. సీఐగా పదోన్నతి పొందిన జె.అంజమ్మ, డి.పద్మకు స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం పదో న్నతి చిహ్నం అలంకరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అధికారులకు ఇద్దరికీ పోలీ సు సేవలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందు కు ప్రభుత్వం గుర్తించి సేవా పథకాలు అందజేసి గౌరవించిందని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

పిల్లలను ఉన్నతంగా చదివించాలి

పోలీసులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చ దివించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఓపెన్‌ కేటగిరీలో ఇచ్చోడ సీఐ బండారి రాజు కుమారుడు రుష్మిత్‌ 77వ ర్యాంక్‌ సాధించాడు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement