● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌ సమస్య ● మూతపడుతున్న చౌక దుకాణాలు ● గంటల తరబడి కార్డుదారుల నిరీక్షణ ● పట్టించుకోని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌ సమస్య ● మూతపడుతున్న చౌక దుకాణాలు ● గంటల తరబడి కార్డుదారుల నిరీక్షణ ● పట్టించుకోని అధికారులు

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

● మూడ

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌

ఇది బేల మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలో గల డీఆర్‌ డిపో. ఉదయం 9 గంటలకు తెరువగా అప్పటికే 20 మంది వరకు కార్డుదారులు వచ్చి ఉన్నారు. ఒక్కో కార్డుదారుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టడంతో వారికి మధ్యాహ్నం వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి.

బియ్యం నిల్వలు నిండుకోవడంతో మూసి ఉంచిన ఈ రేషన్‌షాపు పట్టణంలోని కై లాస్‌నగర్‌లోనిది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో బియ్యం కోసం వచ్చిన కార్డుదారులు గంటల తరబడి నీరిక్షిస్తూ చేసేది లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

వీరంతా ఆదిలాబాద్‌లోని దస్నాపూర్‌ రేషన్‌ షాపు వద్ద బియ్యం కోసం నిరీక్షిస్తున్న కార్డుదారులు. దుకాణం తెరువక ముందే చేరుకుని నిరీక్షిస్తున్నారిలా. వీరంతా బియ్యం తీసుకునేందుకు మధ్యాహ్నం 2గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది.

డీలర్లకు అవగాహన లేకపోవడంతోనే..

జిల్లాలోని రేషన్‌ కార్డుదారుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వస్తూనే ఉన్నాయి. ఈ నెల 8న 15లారీలు రాగా, 9న 14 లారీల బియ్యం వచ్చాయి. రేషన్‌ షాపుల్లో బియ్యం అయిపోయిన వెంటనే డీలర్లు సంబంధిత యాప్‌లో బియ్యం కోసం విజ్ఞప్తి పంపాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా వారికి సరఫరా చేస్తాం. కొత్తగా వచ్చిన యాప్‌ విధానంపై డీలర్లకు సరైన అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. బియ్యం కొరత లేదు. డీలర్లు షయాన్ని గమనించి తమకు అవసరమైన కోటా తీసుకెళ్లాలి.

– వాజిద్‌ అలీ, డీఎస్‌వో

కై లాస్‌నగర్‌: జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడం సమస్యకు దారి తీసింది. రేషన్‌షాపులకు వెళ్లిన కార్డుదారులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. సర్వర్‌ సమస్య ఇబ్బందికి గురి చేస్తోంది. సకాలంలో బియ్యం చేరకపోవడంతో కొన్నిచోట్ల దుకాణాలు మూతపడుతున్నాయి. ఈ నెలాఖరులోపు కార్డుదారులందరికీ బియ్యం అందించాలనే లక్ష్యం చేరుకోవడం కష్టతరంగా కనిపిస్తోంది.

ఇదీ పరిస్థితి..

వర్షాకాలం నేపథ్యంలో రేషన్‌ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్డుదారులకు అవసరమైన కోటా బియ్యం విడుదల చేసింది. ఈ నెల 1నుంచి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చౌక దుకాణాల ద్వారా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరువరకు పూర్తి చేయాలని ఆదేశించింది. రేషన్‌ ద్వారా సన్నబియ్యం అందిస్తుండటంతో వాటిని పొందేందుకు కార్డుదారులు ఉదయాన్నే దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్కో కార్డుదారు ఈ–పీవోఎస్‌ యంత్రంపై ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడంతో పంపిణీలో తీవ్ర జాప్యం అవుతోంది. సర్వర్‌ సమస్య సైతం తోడవడంతో ఒక్కో కార్డుదారుకు బియ్యం ఇచ్చేందుకు సుమారు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందని డీలర్లు చెబుతున్నారు. దీంతో కార్డుదారులు గంటల తరబడి షాపుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రేషన్‌ షాపుల్లో స్థలం కొరత కారణంగా డీలర్లు విడతల వారీగా బియ్యం బస్తాలు తీసుకువస్తున్నారు. తెచ్చిన బియ్యం త్వరగా నిండుకుంటున్నాయి. మళ్లీ స్టాక్‌ వచ్చే వరకు షాపులను మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో చేసేదేమిలేక కార్డుదారులు వెనుదిరుగాల్సి వస్తోంది. బియ్యం కోసం రెండు, మూడు సార్లు రావాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

పూర్తిస్థాయిలో చేరని బియ్యం ..

మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని నిర్ణయించినప్పటికీ బియ్యం పూర్తిస్థాయిలో రేషన్‌షాపులకు చేరలేదు. ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి ఒక నెల కోటా మాత్రమే పంపిణీ జరిగినట్లుగా తె లుస్తోంది. జిల్లాకు అవసరమైన కోటా నిజామాబా ద్‌, జగిత్యాల జిల్లాల నుంచి ఆదిలాబాద్‌, బోథ్‌, ఉ ట్నూర్‌, జైనథ్‌, ఇచ్చోడ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరుతుంది. ఇక్కడి నుంచి వాటి పరిధిలోని చౌక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మూడు నెలల కోటా ఏఒక్క షాపునకు చేరలేదని డీలర్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చిన స్టాక్‌ వచ్చినట్లుగా కార్డుదారులకు అందజేస్తుండటంతో షాపుల్లో బియ్యం నిల్వలు నిండుకుంటున్నా యి. ఫలితంగా కొన్నిచోట్ల దుకాణాలు మూతపడి దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పటికై నా తగు చర్యలు చేపట్టాలని కార్డుదారులు కోరుతున్నారు.

1.35 లక్షల మంది దూరంగానే...

సన్నబియ్యం బియ్యం పంపిణీ ప్రారంభమైన తొమ్మిది రోజుల్లో జిల్లావ్యాప్తంగా కేవలం 57,519 మంది కార్డుదారులు మాత్రమే బియ్యం తీసుకున్నారు. ఇంకా 1,35,238 మంది తీసుకోవాల్సి ఉంది. 12వేల మెట్రిక్‌ టన్నులకు గాను ఇప్పటి వరకు కేవలం 2,620 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ జరిగింది. ఇంకా 9,380 మెట్రిక్‌ టన్నుల బియ్యంను కార్డుదారులు పొందాల్సి ఉంది. అయితే ఇందులో సగం కూడా ఇంకా జిల్లాకు చేరనట్లుగా అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో..

మండలాలు :21

చౌక ధరల దుకాణలు: 356

రేషన్‌ కార్డులు :1,92,757

ఇప్పటి వరకు బియ్యం పొందిన కార్డుదారులు : 57,519

సన్నబియ్యం కోసం నిరీక్షిస్తున్న వీరంతా జైనథ్‌ మండల కేంద్రంలోని రెండో నంబర్‌ రేషన్‌ దుకాణ పరిధిలోని కార్డుదారులు. ఇక్కడ 765 కార్డులుండగా ఇప్పటి వరకు కేవలం 298 మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. సర్వర్‌ సమస్యతో పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది.

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌1
1/5

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌2
2/5

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌3
3/5

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌4
4/5

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌5
5/5

● మూడు నెలల కోటా బియ్యం పంపిణీలో జాప్యం ● తోడైన సర్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement