
డీఎడ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: డైట్లో ప్రవేశం కోసం ని ర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జిల్లాకేంద్రం లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈనెల 13 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి తెలి పా రు. రోజుకు 850 మంది చొప్పున అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు 4,085 మందిని కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్కు 850 మందికి గాను 580 మంది హాజరైనట్లు వివరించారు.