breaking news
yarragunta
-
యర్రగుంటలో ఉద్రిక్తత
సాక్షి, యర్రగుంట(కణేకల్లు): కణేకల్లు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన యర్రగుంటలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగాయి. స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలిం గ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడికి చేరు కొన్న టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు కూడా వారికి పోటీగా ప్రచారం చేశారు. వైఎస్సార్సీ పీ నాయకులు పోలింగ్ కేంద్రం ఆవరణంలో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు వన్నారెడ్డి, బలరాజు తదితరులు అక్కడున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు ప్రచారం చేసేటప్పుడు మేం ఇక్కడ ప్రచారం చేయడంలో తప్పేంటని వైఎస్సార్సీపీ నాయకులు పాటిల్ వెంకటరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డిలు పోలీసులను ప్రశ్నించారు. ఉద యం నుండి వైఎస్సార్సీపీ నాయకుల తీరు ఎక్కువైందని టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటు చేసుకోంది. వైఎస్సార్సీపీ నాయకులు దూకుడు ఎక్కువైందని వారిని ఇక్కడి నుండి పంపుతారా? లేదా? అంటూ టీడీపీ నాయకులు పోలీసులను నిలదీశారు. ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకొంటుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గ్రామ పోలీస్ అధికారి కమల్బాషా వెంటనే అక్కడున్న వైఎస్సార్సీపీ నాయకులను పాటిల్ వెంకటరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డిలను బయటికి తీసుకెళ్లారు. అప్పటికీ వారిని టీడీపీ నాయకులు వెంబడించారు. పోలింగ్ కేంద్రం దాటి ఊళ్లో వెళ్తున్న సమయంలో మళ్లీ ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో పాటిల్ వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు వెనుక నుండి పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత మళ్లీ అతనిపై దాడి చేసి చొక్కా చించి చేతికి గాయపరిచారు. ఏఎస్ఐ యల్లయ్య, పోలీసులు అక్కడ గుమిగూడిన ప్రజలపై లాఠీచార్జీ చేసి చెల్లాచెదరు చేశారు. అనంతరం రాయదుర్గం రూరల్ సీఐ కె.సాయినాథ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ప్రజలు గుంపులు, గుంపులుగా లేకుండా తరిమికొట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు పాటిల్ వెంకటరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు వన్నారెడ్డి, బలరాజు, బండిఎర్రిస్వామి, బండిప్రకాష్, భాస్కర్రెడ్డిలను సీఐ అదుపులో తీసుకొన్నారు. జరిగిన ఘటనపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. -
వైభవంగా యణ్ణేరంగస్వామి రథోత్సవం
యర్రగుంట (కణేకల్లు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఆరాధ్యదైవమైన యణ్ణేరంగస్వామి వారి రథోత్సవం మండలంలోని యర్రగుంటలో గురువారం అంగరంగవైభవంగా జరిగింది. మండలంలోని యర్రగుంటలో స్వామి ఉత్సవాలు శ్రీరామ నవమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నేటి రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా పల్లకిలో ఉంచి మేళతాళాలు, తపెట్ల నడుమ స్వామి రథోత్సవం జరిగింది. సాయంకాలం 6గంటలకు రథోత్సవం ముగిసింది. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు రాయదుర్గం, బొమ్మనహళ్, బెలుగుప్ప, డి.హీరేహళ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాటిల్ నాగిరెడ్డి, యర్రగుంట సర్పంచు కేశవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాటిల్ రామచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు రథాన్ని లాగారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని దేవున్ని వేడుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ యువరాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.