breaking news
Women Wrestlers
-
బ్రిజ్ భూషణ్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: మహిళ రెజ్లర్లపై లైంగిక ఆరోపణలకు పాల్పడ్డారన్న ఆరోపణల నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్భూషణ శరణ్ సింగ్కు సోమవారం భారీ ఊరట లభించింది. సాక్ష్యాలు లేని కారణంగా ప్రపంచ ఛాంపియన్ వినేశ్ ఫొగాట్సహా ఆరుగురు రెజ్లర్లు బ్రిజ్భూషణ్పై వేసిన కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి అశ్విని పన్వర్ తీర్పునిచ్చారు బ్రిజ్భూషణ్ సింగ్తోపాటు రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్నూ నిర్దోషిగా ప్రకటించారు. ఈ తీర్పును సవాలు చేయాల్సిందిగా రెజర్లు తమ న్యాయవాదులకు ఇప్పటికే తెలియజేశారని, త్వరలోనే అప్పీల్ దాఖలవుతుందని వినేశ్ ఫొగాట్ ప్రకటించారు. ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేవని, సాక్షుల వాంగ్మూలాల్లోనూ స్థిరత్వం కొరవడింది. కొందరు పరస్పర విరుద్ధమైన సాక్ష్యాలు ఇచ్చారని తాము చేసిన వాదనన న్యాయమూర్తి అంగీకరించినట్లు బ్రిజ్భూషణ్, వినోద్ తోమర్ల తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ తెలిపారు. అయితే తీర్పు కాపీ అందక ముందే ఈ అంశాల ఆధారంగానే న్యాయమూర్తి తీర్పు ఇచి్చనట్లు ఆయనెలా చెబుతారని రెజ్లర్ల తరఫున వాదించిన న్యాయవాది రెబెకా జాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆనాడే చెప్పా: బ్రిజ్ భూషణ్: ‘‘లైంగిక ఆరోపణలు నిజమైతే ఉరి వేసుకుంటానని మొదటి రోజు నుంచే చెప్పాను. నేడు నేను నిర్దోషిగా నిరూపితమవడం శుభవార్త’’అని బ్రిజ్భూషణ్ సింగ్ వ్యాఖ్యానించారు. పోరాటం కొనసాగుతుంది: బ్రిజ్భూషణ్ను నిర్దోషిగా విడుదల చేయడంపై రెజ ర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియలు ఎక్స్పై స్పందించారు. రెజర్లు తమ విశ్వాసాన్ని కోల్పోలేదని, పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. ఫెడరేషన్ పాలకపక్షం, ప్రభుత్వం, వ్యవస్థలన్నీ మొదటి నుంచి కూడా బ్రిజ్భూషణ్ను రక్షించేందుకు పనిచేస్తూనే ఉన్నాయన్నారు. ఇదీ నేపథ్యం... రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ తమపై లైంగిక దాడులకు పాల్పడినట్లు, 2023 ఏప్రిల్–మేలో మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజులపాటు నిరసన చేపట్టారు. రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియాలు ఈ నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత ఢిల్లీ పోలీసులు ఈ అంశంపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ తోమర్లపై జూన్ నెలలో ఛార్జ్ïÙట్ నమోదైంది. 2024 మేలో కోర్టు లైంగిక వేధింపులు, బెదిరింపులపై కేసు నమోదు చేసింది. మైనర్ రెజ్లర్ కేసులో 2025 మేలో పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును కోర్టు అంగీకరించింది. 2026 జూలై 2న తుది వాదనలు ముగిశాయి. -
వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో అతడికి క్లీన్చిట్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్రిజ్భూషణ్తో పాటు సహ నిందితుడిగా ఉన్న రెజ్లింగ్ సమాఖ్య మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా నిర్దోషిగా తేల్చింది.ఈ నేపథ్యంలో భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ ఘాటుగా స్పందించింది. మొదటి నుంచీ వ్యవస్థ బ్రిజ్భూషణ్ సింగ్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు.. ‘‘బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు మేము ఢిల్లీ వీధుల్లో పోరాడాల్సి వచ్చింది.అతడు తన అధికారం, పలుకుబడిని ఉపయోగించి కొంత మంది అమ్మాయిలను ఈ కేసు నుంచి ఉపసంహరించుకునేలా బలవంతం చేశాడు. అయితే, మరికొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్పై న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు.కానీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో కోర్టు బ్రిజ్భూషణ్ను నిర్దోషిగా ప్రకటించడం అత్యంత విచారకరం. మొదటి నుంచి అతడిని కాపాడేందుకు వ్యవస్థ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో హైకోర్టుకు అప్పీలు చేసేలా ఇప్పటికే చాలా మంది మహిళా రెజ్లర్లు తమ న్యాయవాదులకు సందేశం ఇచ్చారు.ఇప్పటికీ మేము ఆశను కోల్పోలేదు. బ్రిజ్భూషణ్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతుంది’’ అని వినేశ్ ఫొగాట్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. కాగా బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ ఆరుగురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు.అయితే, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని రాజధానిలో రెజ్లర్లు నిరసనకు దిగారు. సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వారికి మద్దతుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.ఆరోపణలు చేసిన ఆరుమంది రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉండటంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఆ తర్వాత ఆమె కేసును ఉపసంహరించుకోవడంతో బ్రిజ్భూషణ్కు భారీ ఊరట దక్కింది. తాజాగా.. మిగిలిన కేసుల్లోనూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడం గమనార్హం. అయితే, రెజ్లర్లు హైకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమైనట్లు వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. -
బ్రిజ్ భూషణ్కు భారీ ఊరట
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సహ నిందితుడైన మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది.రౌస్ అవెన్యూ కోర్టులో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వర్ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. కోర్టులో మీడియా ప్రవేశానికి అనుమతి లేకపోవడంతో తీర్పు వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. అయితే బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాదులు దీనిని “గౌరవప్రదమైన నిర్దోషిత్వ తీర్పు”గా అభివర్ణించారు.రెజ్లర్ల ఆరోపణలతో మొదలైన వివాదంబ్రిజ్ భూషణ్పై ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేధించారని ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం 2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెజ్లర్ల ఆందోళన తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2023 జూన్లో పోలీసులు బ్రిజ్ భూషణ్పై అభియోగ పత్రం దాఖలు చేశారు.ఏయే సెక్షన్ల కింద కేసు?ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై ఐపీసీలోని 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలు), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంటాడటం), 506 (బెదిరింపులు) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2024లో ట్రయల్ కోర్టు ఐదుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదులకు సంబంధించి బ్రిజ్ భూషణ్పై అభియోగాలు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా రక్షణ తరఫు న్యాయవాదులు ఆరోపణల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వాదించారు.బ్రిజ్ భూషణ్ వాదన ఏంటి?తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చారు. ఫిర్యాదుల్లో తేదీలు, ఘటనలకు సంబంధించిన వివరాల్లో మార్పులు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ఆరోపణలు జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే లేనని, తనపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వాదించారు. ఫిర్యాదులు చేయడంలో ఆలస్యం కూడా కీలక అంశమని పేర్కొన్నారు.మైనర్ కేసులోనూ ఊరటఈ కేసులో ఓ మైనర్ రెజ్లర్ కూడా ఆరోపణలు చేసింది. అయితే తర్వాత ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో.. పోక్సో చట్టం కింద నమోదైన కేసును పోలీసులు మూసివేయాలని కోరారు. అనంతరం ఆ కేసు కూడా ముగిసింది.రాజకీయంగా కూడా కీలక పరిణామంబ్రిజ్ భూషణ్ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతగా ఉన్నారు. అయితే రెజ్లర్ల వివాదం తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు అవకాశం కల్పించింది. తాజా కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లైంది. -
ఓవరాల్ టీమ్ చాంప్ భారత్
అమ్మాన్ (జోర్డాన్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత మహిళల జట్టు ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. శుక్రవారం భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు చేరాయి. 69 కేజీల విభాగం ఫైనల్లో కాజల్ 9–2తో ఒలెక్సాండ్రా రిబాక్ (ఉక్రెయిన్)పై గెలిచి బంగారు పతకం సాధించింది. 46 కేజీల విభాగం ఫైనల్లో శ్రుతిక శివాజీ పాటిల్ 0–13తో యు కత్సుమె (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. 40 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో రాజ్బాలా 11–5తో మొనాకా ఉమెకావా (జపాన్)పై, 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో ముస్కాన్ 12–2తో ఇసాబెల్లా గొంజాలెస్ (అమెరికా)పై విజయం సాధించారు. 61 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో రజి్నత 2–6తో హినై హర్బనోవా (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మొత్తం 10 వెయిట్ కేటగిరీల్లో పోటీలు జరగ్గా... తొమ్మిది కేటగిరీల్లో భారత రెజ్లర్లు పోటీపడ్డారు. ఐదు స్వర్ణాలు (25 పాయింట్ల చొప్పున), ఒక రజతం (20 పాయింట్లు), రెండు కాంస్యాలు (15 పాయింట్ల చొప్పున) సొంతం చేసుకున్నారు. మరో కేటగిరీలో నాలుగో స్థానం (10 పాయింట్లు) లభించింది. ఓవరాల్గా 185 పాయింట్లతో భారత్ టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. 146 పాయింట్లతో జపాన్ రన్నరప్గా నిలువగా... 79 పాయింట్లతో కజకిస్తాన్ మూడో స్థానం పొందింది. -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్భూషణ్పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది.


