breaking news
women head constable
-
అవును.. వారిద్దరూ ఒకరినే ఇష్టపడ్డారు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: వాళ్లిద్దరూ పోలీసుశాఖలో మహిళా హెడ్కానిస్టేబుళ్లు. వీరిలో ఒకరు వివాహిత. అయితే వీరిద్దరూ ఒకే యువకుడిని ఇష్టపడ్డారు. కలియబడి కొట్టుకున్నారు. ఆఖరకు వీరిలో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్రమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తంజావూరు ఆర్మ్డ్ రిజర్వు పోలీసు విభాగంలో (27), (25) ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు యువతులు హెడ్కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 27 ఏళ్ల యువతికి పెళ్లికాగా కుటుంబసభ్యులు పుదుకోట్టైలో ఉన్నారు. ఇద్దరు యువతులు తంజావూరులోని పోలీసు క్వార్టర్స్లో ఒకే పోర్షన్లో ఉంటున్నారు. వీరిలో ఓ యువతి ప్రేమలోపడి ప్రియుడితో రాత్రివేళల్లో ఫోన్లో గంటల తరబడి మాట్లాడేది. ఈ ప్రేమ వ్యవహారం వివాహితకు తెలుసు. ఇదిలాఉండగా యువతి బాత్రూముకు వెళ్లిన సమయంలో ప్రియుడి నుంచి ఫోన్ రావడంతో వివాహిత ఫోన్తీసుకుని అతడితో మాట కలిపింది. క్రమేణా వీరిద్దరి మధ్య ఫోన్లో సాన్నిహిత్యం పెరిగిపోగా గంటలకొద్ది మాట్లాడుకునే వారు. తన సమీప బంధువు, తమ్ముని వరస అని వివాహిత తోటి యువతికి అబద్ధం చెప్పింది. ఇదిలాఉండగా ప్రియుడు తనకు ఫోన్ చేయకపోవడం, తాను చేసినా తీయకపోవడంతో యువతి ఆలోచనలో పడిపోయింది. ప్రియుడిలో ఎందుకంత మార్పు వచ్చిందో తెలియక అల్లాడిపోయింది. వివాహిత యువతి లేని సమయంలో ఆమె సెల్ఫోన్కు వచ్చిన మెసేజ్ను యథాలాపంగా చూసిన యువతి అది తన ప్రియుడి నంబరు నుంచి వచ్చినట్టు గ్రహించింది. తరువాత అతని కాల్డేటాను పరిశీలించగా వారం పది రోజులుగా వీరిద్దరే మాట్లాడుకుంటున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయింది. పెళ్లయి భర్త ఉన్న నీకు ఇదేంపని అంటూ గురువారం రాత్రి వివాహితను నిలదీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోగా కలియబడి కొట్టుకున్నారు. ఈ శబ్దాలు విని ఇతర క్వార్టర్లలోని పోలీసు కుటుంబాలు వచ్చి వారిని అడ్డుకున్నారు. వివాహిత దాడిలో యువతి గాయపడింది. నీ చేష్టలపై పోలీసు ఉన్నతాధికారులకు, భర్తకు చెబుతానని యువతి బెదిరించడంతో భయపడిన వివాహిత పురుగుల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇరుగుపొరుగు వారు ఆమెను ప్రాణాపాయస్థితిలో తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయకుండా విచారణ జరుపుతున్నారు. -
షాకింగ్ : మహిళా పోలీసుపై నాలుగేళ్లుగా..
చండీగఢ్ : హరియాణకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్పై స్వయంగా ఓ హెడ్ కానిస్టేబుల్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని పోలీసులు తెలిపారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నిందితులు బ్లాక్మెయిల్కు గురిచేస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. పల్వాల్ మహిళా పోలీస స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పల్వాల్ ఎస్పీ వసీం అక్రం తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్లోనే మహిళా హెడ్ కానిస్టేబుల్పై లైంగిక దాడి జరిగిందన్న మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రధాన నిందితుడు జోగీందర్ అలియాస్ మింటూతో పల్వాల్ జిల్లా అల్వార్పూర్లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు వెల్లడించారు.ఫరీదాబాద్, జింద్, పల్వాల్లో పనిచేస్తుండగా జోగీందర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. జూన్ 2017లో నిందితుడు తన సోదరుడు ఫరీదాబాద్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన సోదరుడిని పరిచయం చేయగా అతడు కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ జోగీందర్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు డబ్బు కోసం వేధించాడని ఆరోపించారు. కాగా విచారణలో నిందితుడు జోగీందర్కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. మరోవైపు బాధితురాలు కూడా వివాహితని పోలీసులు చెప్పారు. -
మహిళా హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా సుబేదారి మహిళ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ జమున ఆత్మహత్యకు యత్నించారు. గురువారం ఉదయం ఆమె ఇంట్లోనే చేతి మణికట్టు కోసుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావటంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి యత్నించి ఉంటుందని తోటి సిబ్బంది అంటున్నారు.