-
ముంగిసతో ఫోటోకి ఫోజులు.. నటిపై కేసు నమోదు
Bengali actress Srabanti Chatterjee: బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. గొలుసుతో కట్టేసి ఉన్న ముంగిసతో ఫోటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో చేయడంతో ఆమెపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 9, 11, 39, 48ఏ, 49, 49ఏ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి జంతువులను అక్రమంగా పట్టుకోవడం, రవాణా చేయడం, స్వాధీనం చేసుకున్నందుకు ఛటర్జీపై కేసులు నమోదు చేయబడ్డాయి. కోల్కతాలోని సాల్ట్ లేక్లోని వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రబంతికి నోటీసులు పంపారు. అయితే వ్యన్య ప్రాణుల సంరక్షణ చట్టం గురించి తనకు అంతగా తెలియదని ఆమె అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె అధికారుల ముందు హాజరుకాలేదు. ఈ విషయంపై స్రబంతిని మీడియా ప్రశ్నించగా..‘ఈ కేసు విచారణలో ఉది. అందుల్ల నేను ఏమి మాట్లాడలేను’అని బదులిచ్చారు. ఇక స్రబంతి ఛటర్జీ వ్యక్తిగత న్యాయవాది ఎస్కే హబీబ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. ‘స్రబంతి ఇంకా అధికారులను కలవలేదు. వారిని కలిసిన తర్వాత మాత్రమే స్పష్టమైన వివరణ ఇవ్వగలం.కచ్చితమైన ఆరోపణలను తెలుసుకోవడానికి మేము త్వరలో అధికారులను కలుస్తాం’అని చెప్పారు. ఈ కేసు గురించి ఓ సీనియర్ అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణులను బంధించడం ఒక్కటే నేరం కాదు, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇతరులు తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే స్రబంతిపై కేసు నమోదైంది. దర్యాప్తుకు ఆమె సహకరించి, వన్యప్రాణుల సంరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్తతుగా నిలవావాలని కోరారు. -
‘నిందితుడు మంత్రికాన్వాయ్లో తిరుగుతుంటే...’
హైదరాబాద్: మహాదేవ పురం జింకల వేట కేసులో అధికారపార్టీకి చెందిన నేతలు ఉన్నారని, రెండేళ్ళుగా జింకల వేట సాగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి కాన్వాయ్లో నిందితుడు అక్బర్ ఖాన్ తిరుగుతున్నా ఎందుకు ఇంతవరకూ పట్టుకోలేదని అడిగారు. తుపాకులు చూపి దాడులు చేస్తే ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. తెలంగాణలో వన్య ప్రాణి చట్టం అమలు కావటం లేదని.. సీఎంకు చిత్త శుద్ధి ఉంటే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు దోషులను పక్కన పెట్టి.. కిరాయి దోషులను పట్టుకున్నారని, ప్రభుత్వం న్యాయ విచారణ జరపక పోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
భూపాలపల్లి కలెక్టర్పై చర్యలు: జోగురామన్న
శాసనమండలిలో మంత్రి ప్రకటన సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల చట్టం ప్రకారం భూపాలపల్లి కలెక్టర్ మురళిపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు రామచందర్రావు మాట్లాడుతూ.. అడవి పందులను పట్టుకొని తినమంటూ స్థానిక ప్రజలకు కలెక్టర్ మురళి పిలుపునివ్వడాన్ని ప్రస్తావించారు. దీనికి జోగురామన్న స్పందిస్తూ.. వన్యప్రాణుల చట్టం ప్రకారం మురళిపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ను ఆదేశించినట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలోనూ మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.1,954 కోట్లు కేటాయించగా రూ.1,579 కోట్లు విడుదల చేశామని, నెలాఖరులోగా మొత్తం విడుదల చేస్తామన్నారు. 4 బీసీ స్టడీ సర్కిళ్లకు భవనాలు నిర్మిస్తున్నామని తెలి పారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దళితు లకు ఈ ఏడాది 10 వేల ఎకరాలు భూమి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీలు, స్టేట్హోంలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. కాగా,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 2016–17 బడ్జెట్ నిధుల్లో 70 శాతమే ఖర్చు చేశారని మండలిలో కా>ంగ్రెస్పక్ష నేత షబ్బీర్అలీ విమర్శించారు. గిరిజన సంక్షేమానికి రూ. 2,273 కోట్లు కేటాయించి రూ.935 కోట్లే విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి తీసుకురావడం మంచిదేనని చెప్పారు. భూపాలపల్లి కలెక్టర్పై చర్యలు తీసుకోవాలి వన్యప్రాణులను చంపి తినమనడం నేరం: రాంచంద్రరావు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు బ్రాహ్మణ కులాల్లోని పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుండగా, మరోవైపు భూపాలపల్లి కలెక్టర్ బ్రాహ్మణ సమాజాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి పందులను చంపి తినండంటూ.. వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించిన కలెక్టర్ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శాసన మండలిలో బలహీన వర్గాల సంక్షేమంపై జరిగిన చర్చలో రాంచంద్రరావు మాట్లాడుతూ.. షాదీ ముబారక్ పథకాన్ని వినియోగించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదని, ఫలి™ èlంగా ప్రభుత్వం కేటాయించిన నిధులు నిరుపయోగం అవుతున్నాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్ టీచర్లను నియమిం చ డంతో గురుకులాల్లో నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఉస్మా నియా వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన మౌలికవసతులను కల్పించడం లేదన్నారు. అడవి పంది, గొడ్డు మాంసం తినండి
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement