breaking news
war words
-
గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్ ల మధ్య మాటల యుద్ధం
-
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
బండి సంజయ్ ఆరోపణలకు సీపీ రంగనాథ్ కౌంటర్
-
నువ్వెంత.. నువ్వెంత?
సాక్షి, నల్లగొండ : మంత్రి జగదీశ్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురూ వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఆదివారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన వానాకాలం పంటల వ్యవసాయ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. జగదీశ్రెడ్డి రుణమాఫీపై మాట్లాడినప్పుడు ఉత్తమ్ అడ్డుతగిలారు. రుణమాఫీ ఎక్కడిచ్చారంటూ ప్రశ్నించారు. ఇలా మధ్యలో మాట్లాడటం సభామర్యాద కాదని, గౌరవాన్ని కాపాడుకోవాలని మంత్రి సూచించారు. అయినా ఉత్తమ్ తగ్గకుండా రుణమాఫీ కాలేదని మరోసారి చెప్పారు. ‘సీనియర్ నాయకుడివి మధ్యలో మాట్లాడడం సరికాదు. నీవు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు నువ్వుకూడా వినాలి’అని జగదీశ్రెడ్డి సూచించారు. దీంతో ఉత్తమ్ స్పందిస్తూ.. ‘రుణమాఫీ కాలేదు, మీరు అబద్ధం చెబుతున్నారు’ అని అనడంతో మంత్రి కాస్త సీరియస్ అయ్యారు. ‘తెలివిలేని మాటలు మాట్లాడొద్దు. ఇది డిబేట్ కాదు. కూర్చోవాలి. ఇది అసెంబ్లీ, పార్లమెంట్ కాదు.. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి.. ఇది రైతుల కోసం పంటల సాగు విషయంలో వారిని బాగుచేసేందుకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం’ అని గట్టిగా చెప్పారు. మీడియా కోసం డ్రామాలు.. ‘మీడియా కోసం ఉత్తమ్ డ్రామాలు ఆడుతున్నారు.. మంత్రిగా నేను మాట్లాడుతున్నా.. ఇది నా హక్కు.. నీవు మధ్యలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులను మీరు పట్టించుకోలేదు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ లెక్కలతో సహా చెబుతుంటే.. నేను ప్రిపేర్ కాలేదంటూ పారిపోయావు’అని ఉత్తమ్పై మంత్రి జగదీశ్రెడ్డి విరుచుకుపడ్డారు. నేను పోలేదని ఉత్తమ్ స్పందించగా.. ‘నేను సభలోనే ఉన్నా. నువ్వు మాట్లాడటం చేతకాక పారిపోయి రైతులకు మంచి చేస్తున్న మాపై విమర్శలు చేస్తున్నావు. దేశంలో ఎక్కడా రుణమాఫీ అమలు కాలేదు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదు. తెలంగాణలో జరిగింది’అని మంత్రి పేర్కొన్నారు. దీంతో ‘మర్యాదగా మాట్లాడు’అని ఉత్తమ్ అనగా.. ‘నీవు ఎలా మాట్లాడుతున్నావో, నేను ఎలా మాట్లాడుతున్నానో ప్రజలు, మీడియా గమనిస్తున్నారు. అయినా, ఇది డిబేట్ కాదు’అని మంత్రి అనడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. దీంతో ఓ దశలో ఆఫ్ట్రాల్ నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ ఇరువురూ వాగ్వాదానికి దిగారు. నిన్ను ఎంపీగా ఎన్నుకోవడం జిల్లా ప్రజలకు దరిద్రమని మంత్రి అనగా.. నిన్ను మంత్రిగా ఎన్నుకోవడం కూడా ప్రజలకు దరిద్రం అంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు. ఎక్కడైనా చర్చకు సిద్ధం.. ఈ క్రమంలో మంత్రి మరింత ఆవేశంతో మాట్లాడారు. రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని స్పష్టంచేశారు. ‘దీనిపై ఎక్కడైనా వేదిక పెట్టండి.. నేను సిద్ధం. విత్తనాలు, ఎరువులు తదితర వాటిపై కూడా చర్చకు సిద్ధం’అని సవాల్ చేశారు. 2014 ముందు లాఠీచార్జ్ లేని రోజు లేదని విమర్శించారు. ఎరువుల కోసం లైన్లు, విద్యుత్ కోసం ధర్నాలు నిత్యం జరిగేవని.. ఇప్పుడు కేసీఆర్ అడగకుండానే రైతులకు అన్నీ చేస్తున్నారనే సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి రైతులకు మాట్లాడే అవకాశం లేదా అంటూ ప్రశ్నించగా.. ‘లేదు. నీకు అసలే లేదు. వచ్చినోడివి కూర్చోవాలి తప్ప తెలివిలేని మాటలు మాట్లాడొద్దు’అని మంత్రి బదులిచ్చారు. అలాంటప్పుడు ఈ మీటింగ్ ఎందుకని దుబ్బాక ప్రశ్నించగా.. నీకు ఇష్టం లేకపోతే వెళ్లిపో అని మంత్రి సూచించారు. ‘హీ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ద మీటింగ్. అతడిని బయటికి పంపించండి’అని జగదీశ్రెడ్డి పేర్కొనడంతో పోలీసులు దుబ్బాకను బయటికి పంపించారు. -
కమల్కు కోపం 'రిసార్ట్స్ ఎమ్మెల్యేల సంగతేంది?'
సాక్షి, చెన్నై : త్వరలో రాజకీయ పార్టీని పెడతారని భావిస్తున్న ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్కు తీవ్ర ఆగ్రహం వచ్చింది. మరోసారి ఆయన అన్నాడీఎంకే పార్టీపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులపైనే మీ ప్రతాపం చూపిస్తారా? శాసన సభలకు, విధులకు హాజరుకాని ఎమ్మెల్యేలను ఏమీ అనరా అంటూ నిలదీశారు. తమ జీతభత్యాలు పెంచాలంటూ కొద్ది రోజులుగా తమిళనాడులోని 33వేలమంది ఉపాధ్యాయులు రోడ్లెక్కి నిరసనలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని పాఠశాలలకు హాజరుకావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇదే అదనుగా చేసుకొని విధుల్లోకి చేరని వారికి జీతభత్యాలు చెల్లించేది లేదని 'నో వర్క్ నో పే' అంటూ తమిళనాడు పళనీస్వామి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన కమల్ హాసన్ 'నో వర్క్ నో పే అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా? డబ్బుకు అమ్ముడుపోయి విధులకు హాజరుకాకుండా రిసార్టుల్లో ఉంటున్న నాయకుల సంగతేమిటి? గౌరవనీయ న్యాయస్థానం నిరసనల్లో ఉన్న ఉపాధ్యాయులను హెచ్చరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఒక విషయం విన్నవించుకుంటున్నాను. అలాంటి హెచ్చరికనే పనులకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న చట్టప్రతినిధులకు ఇవ్వాలి' అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీలోనే ఉంటూ దినకరన్వైపు ఉన్న 19మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు వివిధ రిసార్టుల్లో ఉన్న విషయం తెలిసిందే. వీరి ఆధారంగానే పళనీ స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అన్నాడీఎంకేని లక్ష్యంగా కమల్ హాసన్ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే.