-
పాండవుల వనవాసంలో కొన్నాళ్ళు ఇక్కడే నివాసం..
-
తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు
విజయనగరం (క్రైమ్): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజనీర్ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్కు ఫోన్చేసి చైల్డ్ లైన్ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది. శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్లైన్ 1098కి కాల్ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్ హోమ్కు తరలించారు. అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ జరిపారు. -
కనుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు. -
అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి
విజయనగరం క్రైమ్: ఎంతో విలువైన మొబైల్ మిస్సయిందా? కంగారు పడకండి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జిల్లా పోలీస్శాఖ నూతనంగా రూపకల్పన చేసి నిరంతర పర్యవేక్షణకు సైబర్ సెల్ను ఏర్పాటుచేసింది. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు ఇటీవలికాలంలో పెరుగుతుండడంతో, బాధితులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకండా, ఫిర్యాదుల స్వీకరణను సులభతరం చేస్తూ ఎస్పీ ఎం.దీపిక చర్యలు చేపట్టారు. మొబైల్ పొగొట్టుకున్న బాధిత ఫిర్యాదు దారు పేరు, చిరునామా, సంప్రదించాల్సిన మొబైల్ నంబర్, మొబైల్ మోడల్, ఐఎంఈఐ నంర్, ఫోన్ పోయిన తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలను పోలీస్ వాట్సాప్ నంబర్ 8977945606కు పంపించాలి. ఫిర్యాదు అందుకున్న వెంటనే సైబర్సెల్ పోలీసులు బాధిత ఫోన్ను ట్రాక్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు చేపడతారు. పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసి తర్వాత తిరిగి బాధితులకు అందజేస్తారు. ఒకవేళ పోయిన ఫోన్లు ట్రాక్ కాకుంటే చట్టపరమైన చర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తారు. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైబర్ సెల్ సిబ్బంది స్వీకరించి, వాటిని రిజిస్టర్లో నమోదుచేసి, పోయిన మొబైల్స్ను కనుగొనేందుకు చర్యలు చేపడతారు. ఆందోళన అవసరం లేదు జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జస్ట్ డయల్ 8977945606కు చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ సెల్ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.దీపిక, ఎస్పి, విజయనగరం -
ప్రేమోన్మాదానికి ముగ్గురి బలి
♦ పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఉన్మాది ♦ అక్కడికక్కడే మృతి చెందిన యువతి ♦ రక్షించేందుకు యత్నించిన తమ్ముడి కన్నుమూత ♦ అనంతరం విజయనగరంలో నిందితుడి ఆత్మహత్య ♦ భీమిలి మండలం టి.నగరప్పాలెంలో సంచలనం రేపిన ఘటన మధురవాడ / భీమునిపట్నం : ప్రేమోన్మాదం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటిలోకి వెళ్లి యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి గడియ పెట్టేయడంతో ఆమె అక్కడికక్కడే అగ్నికి ఆహుతయింది. రక్షించేందుకు యత్నించిన యువతి సోదరుడు తీవ్ర గాయాలపాలై కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మాది కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సంచలనం రేపిన ఈ సంఘటన భీమిలి రూరల్ మండలం టి.నగరప్పాలెంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీమిలి రూరల్ మండలం టి.నగరప్పాలేనికి చెందిన పొట్నూరి రూప(19) తగరపువలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. బతుకు తెరువు కోసం తండ్రి రమణతో విజయనగరం నుంచి తగరపువలస వచ్చిన పతివాడ హరిసంతోష్ ఆరు నెలలుగా రూప వెంటపడుతున్నాడు. ప్రేమించమని వేధిస్తుండడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఆ గ్రామ పెద్దలు తగరపువలస వచ్చి స్థానిక పెద్దల సమక్షంలో హరిసంతోష్ను హెచ్చరించి ఓ లెటర్ కూడా రాయించుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. వేధింపులు ఆగకపోవడంతో మూడు నెలల నుంచి రూప కళాశాలకు వెళ్లడం మానేసింది. ఈ నేపథ్యంలో నేరుగా రూప ఉంటున్న టి.నగరప్పాలెం కొత్తూరులోని ఇంటికి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హరిసంతోష్ చేరుకున్నాడు. తనను ప్రేమించమని వాదనకు దిగాడు. రూప నిరాకరించడంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారిన సంతోష్ అప్పటికే తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను యువతిపై పోసి నిప్పు అంటించాడు. అనంతరం తలుపు గడియ పెట్టి పరారయ్యాడు. పరిస్థితి గమనించి రక్షించేందుకు యత్నించిన రూప సోదరుడు ఉపేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిలో నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో రూప అగ్నికి ఆహుతైపోయింది. ఉపేంద్రను చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న భీమిలి సీఐ బాలసూర్యారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు అనుకోని దుర్ఘటన జరగడంతో టి.నగరప్పాలెంలో విషాదం నెలకొంది. రూపకు ఐదేళ్ల వయసప్పుడు తల్లి వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి పొట్నూరు సూరిబాబు రెండో వివాహం చేసుకున్నాడు. రూప, ఉపేంద్ర మొదటి భార్యకు కలిగిన సంతానం. తండ్రి రెండో వివాహం చేసుకుని పాతూరులో ఉండడంతో రూప, ఉపేంద్ర నాన్నమ్మ అప్పచ్చమ్మ, తాత ఎల్లయ్య, చిన్నాన్న రవి, పిన్ని నీరజల సంరక్షణలో ఉంటున్నారు. ఇంతలో ఇలా జరగడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రిలో ఉపేంద్ర మృతి అక్క మంటల్లో చిక్కుకోవడంతో తాను ఏమైపోయినా ఫర్వాలేదని ప్రాణాలకు తెగించి రూపను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఉపేంద్ర (14) కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించాడు. అంతకుమునుపే ఆస్పత్రికి వచ్చిన న్యాయమూర్తి హరినారాయణ ఆ బాలుడి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. నిందితుడి ఆత్మహత్య విజయనగరం టౌన్ : ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టి చంపేసిన నిందితుడు హరిసంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బతుకుదెరువు కోసం విజయనగరం నుంచి తగరపువలస వెళ్లి అక్కడ బొంతలు కుట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటరమణ, గోపమ్మలకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత హరి సంతోష్ (22) పుట్టాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకూ చదువుకున్న సంతోష్ తర్వాత చదువు ఆపేసి, తండ్రికి సహాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భీమిలి మండలం టి.నగరప్పాలెంలో రూప అనే విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తూ శనివారం నిప్పు అంటించి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి భయంతో బైక్ తీసుకుని పారిపోయాడు. విజయనగరం బీసీ కాలనీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ బంధువులందరూ బీసీ కాలనీలో నివాసముంటున్నారు. రైల్వే జీఆర్పీ ఎస్ఐ చెల్లూరు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement