breaking news
Valluripalli Ramesh
-
వైభవంగా నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు వివాహం
-
వైభవంగా నిర్మాత కొడుకు వివాహం!
సాక్షి, హైదరాబాద్: నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహం బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని అవాస హోటల్లో జరిగింది. సాంబ శివరావు- శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజను మహర్షి పెళ్లాడారు. ఈ అందమైన జంటను ఆశీర్వదించడానికి పలువురు సినీ ప్రముఖులు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో శ్రీకాంత్, ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, సురేష్ కొండేటి తదితరులు ఈ వేడకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగిందని వల్లూరుపల్లి రమేష్బాబు-గీత దంపతులు వెల్లడించారు. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, కబడ్డీ కబడ్డీ, పందెం లాంటి విజయవంతమైన చిత్రాలను వల్లూరుపల్లి రమేష్ బాబు నిర్మించారు. చదవండి: పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్ -
ప్రొడ్యూసర్స్ సెక్టార్ అధ్యక్షుడిగా రమేశ్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల విభాగానికి (ప్రొడ్యూసర్స్ సెక్టార్) అధ్యక్షునిగా అశోక్, ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, గోపి గోపిక గోదావరి తదితర చిత్రాలు నిర్మించిన వల్లూరిపల్లి రమేశ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పద్మిని–బాబ్జీ, కార్యదర్శులుగా బోడపాటి మురళి–రాజేశ్వరి ఎన్నికయ్యారు.