breaking news
utlapalli
-
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ఊట్లపల్లి(పెద్దవూర): కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ రావుల మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఊట్లపల్లి పుష్కరఘాట్ను పరిశీలించి మాట్లాడారు. పుష్కరఘాట్లలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చాలని సూచించారు. ఇప్పటి వరకు 95 శాతం పనులు పూరై్తనట్లు మరో రెండు రోజుల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రఫిఖున్నీసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సీసీ శివశంకర్, కార్యదర్శి విజయ్కుమార్, గుత్తేదారులు మేరెడ్డి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
పుష్కరఘాట్ను పరిశీలించిన కలెక్టర్
ఊట్లపల్లి(పెద్దవూర): మండలంలోని ఊట్లపల్లి పుష్కరఘాట్ను బుధవారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. పుష్కరఘాట్ నిర్మాణ పనులను జూలై 25 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా పూర్తి చేయకపోవడం పట్ల గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా పనుల వారిగా విభజించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఘాట్కు వచ్చే భక్తులకు బావి నుంచి కాకుండా 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న నది బ్యాక్ వాటర్ నుంచి పైపుల ద్వారా నీటిని తీసుకువచ్చి షవర్ బాత్కు అనుసందానించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేవిధంగా చూడాలని సంబంధిత ఎస్ఈని ఫోన్లో ఆదేశించారు. విద్యుత్ దీపాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. నాగార్జునసాగర్కు రద్దీ ఎక్కువైతే ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఊట్లపల్లి పుష్కరఘాట్కు పంపించే యోచనలో ఉన్నట్లు దీనికి అనుగుణంగా పార్కింగ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఘాట్ల వద్దనే ఉండి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరిత గతిన పూర్తి చేయటానికి కృషి చేయాలని అన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రావుల మహేందర్రెడ్డి, డిండి రిజర్వాయక్ డిప్యూటీ కలెక్టర్, ఘాట్ ప్రత్యేక అధికారి ప్రభాకర శ్రీనివాసన్, ఐబీ ఎస్ఈ ధర్మానాయక్, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ రఫిఖున్నీసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏపీఓ గోపాల్రెడ్డి, మేరెడ్డి జైపాల్రెడ్డి, గడ్డంపల్లి వినయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.