breaking news
ullinda konda
-
కర్నూలు జిల్లాలో అగ్నిప్రమాదం
కర్నూలు: కర్నూలు జిల్లా ఉల్లిందకొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయిబాబా టైరోటెక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఫైరింజన్లు ఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పాయి. -
మందులులేని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
కల్లూరు (కర్నూలు జిల్లా): ఆ ప్రాథమిక కేంద్రంలో మందులులేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 20 రోజులగా మందులు లేని ఈ ప్రాథమిక కేంద్రం కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామంలో ఉంది. 20 రోజులుగా ఆస్పత్రిలో మందులు లేకపోవడం విశేషం. మందుల కోసం వచ్చిన రోగులకు ఆస్పత్రి వర్గాలు మొండి చెయ్యే చూపుతున్నాయి. 20 రోజులుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు లేకున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.