breaking news
TRS LP meeting
-
కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ!
-
కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో మంగళవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై శాసన సభ్యులకు అవగహన కల్పించుటకు తెలంగాణ శాసనసభపక్షం భేటీ అయ్యింది. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా సభ్యులు ఏలాంటి పొరపాట్లు చేయ్యకుండా వారికి మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం కూడా హాజరైనట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలని పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వారికి సూచనలు చేయనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 19న ఆయన కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి ప్రారంభించన్నట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నేడు!
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడున్నరేళ్లుగా చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించు కోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. రేపటి(శుక్రవారం) నుంచి మొదలు కానున్న వర్షాకాల శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొ నేందుకు వ్యూహ రచన చేస్తోంది. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువా రం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసన సభాపక్షం సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహం పైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్న ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇటీవల కాలంలో వివిధ అంశాలపై చేసిన ఆందోళనల నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేసినా, అసెంబ్లీ వేదికగా మరింత వివరంగా చెప్పేందుకు ఇది అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది. ఇప్పటికే ఆయా సబ్జెక్టులపై అవగాహన ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించారు. విప్ల పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సారి ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే అంశంపై చర్చించి, సీఎం కేసీఆర్ వారికి ఎల్పీ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజుల పాటు సభ జరపాలని, కనీసం 4 వారాలు సమావేశాలు జరపాలన్న ఆలోచన ఉన్నందున, ఆ మేరకు అధికార పార్టీగా వ్యవహరించాల్సిన తీరుపై, సభ్యుల ప్రాతినిధ్యంపై ఈ భేటీలో చర్చిస్తారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవలే ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తొలిసారి వారితో భేటీ కానున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు.. నియోజక వర్గాలు, జిల్లాల ఇన్చార్జి బాధ్యతను కూడా ఈ సమావేశంలో అప్పజెప్పే అవకాశం ఉంది. వీరి బాధ్యతల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరిస్తారు. కార్యవర్గ సమావేశం తర్వాత ఎల్పీ సమావేశం జరగనుంది. అలాగే గురువారం మధ్యాహ్నం అసెంబ్లీలో బీఏసీ భేటీ కానుంది. -
పదవులొస్తున్నాయ్!
* దసరా నాటికల్లా నామినేటెడ్ పదవుల భర్తీ * రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం * టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ కమిటీలు, దేవాలయ కమిటీలను దసరా నాటికల్లా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. మార్కెట్ కమిటీల రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ కమిటీలకు చైర్మన్, ఇతర పాలక వర్గ సభ్యుల పేర్లతో జాబితా తయారు చేయాలని మంత్రులను ఆదేశించారు. పార్టీ కార్యకర్తలకు జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష (ఎల్పీ) సమావేశంలో సీఎం ఈ మేరకు వెల్లడించారు. గంటకు పైగా జరిగిన భేటీలో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సభ్యులతో మాట్లాడారు. శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ నే తి విద్యాసాగర్ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యేల ద్వారా అందిన సమాచారం మేరకు ఎల్పీ సమావేశ వివరాలివీ.. ‘‘2019లోనూ మనదే అధికారం. అధికారంలోకి ఎలా రావాలో నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సింది మీరే. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. సభలో హుందాగా వ్యవహరించండి. ప్రతీ రోజు సమయానికే సభకు హాజరు కావాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా విద్యుత్ ఇచ్చాం. విత్తనాలు, ఎరువులు అందజేశాం. రుణాలు మాఫీ చేశాం. రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాం. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నాం’’ అని వివరించారు. రైతులకు ఏం చేశామో అసెంబ్లీ వేదికగానే చెప్పుకుందామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సహకరిస్తే సరే సరి.. సభను అడ్డుకుంటే మాత్రం ఎత్తి అవతల వేద్దామని, సమావేశాలను సజావుగా జరుపుకొందామని అన్నారు. ‘‘ఎంఐఎం మన కు సహకరిస్తుంది. బీజేపీ కొద్దిగా గొడవ చేసినట్లు కనిపించినా.. వారు సభ నుంచి బయట కుపోవడానికి సిద్ధంగా ఉండరు. వామపక్షాల కు బలమే లేదు. ఇక, టీడీపీ, కాంగ్రెస్లు సాగనీయకుండా చేస్తే.. ఎలా కంటిన్యూ చేయాలో నాకు తెలుసు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. సీపీఎంకు ఏపీలో సమస్యలు కనిపించవు.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం.. కొత్త రాష్ట్రంలోనూ తన పద్ధతి మార్చుకోలేదు. ఆ పార్టీ టీడీపీ అడుగులకు మడుగులు ఒత్తుతోంది. రైతు ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఆ పార్టీకి ఏపీలో ఆశ వర్కర్ల సమస్యలు కనిపించవు. మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా అంతే. ఏపీలో వారి సమస్యలు సీపీఎంకు కనిపించవు. తెలంగాణలో మాత్రం అన్ని సమస్యలు కనిపిస్తాయి. వారిని ఎవరు నడిపిస్తున్నారో బహిరంగ రహస్యమే. సీపీఎంకే కాదు.. ప్రతిపక్ష పార్టీలకు కూడా అసెంబ్లీలోనే సమాధానం చెబుదాం’’ అని కేసీఆర్ అన్నారు. స్పీకర్ అనుమతితో సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైనింగ్, రాష్ట్ర జల విధానం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సభ ద్వారా ప్రజలకు వివరిద్దామని కూడా సీఎం అన్నట్లు తెలిసింది. ప్రతిపక్షాలకు దీటుగా సమాధానాలిచ్చేందుకు ఆరేడు మంది మంత్రులు సమన్వయం చేసుకోవాలని, ఇష్యూలను బట్టి ఎప్పటికప్పుడు చీఫ్ విప్, విప్లు చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. వరంగల్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల బాధ్యత మీదే.. ఏ జిల్లాకు ఆ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టంచేశారు. ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, పనులు పూర్తి చేసుకుంటే వెంట వెంటనే నిధులిస్తామని చెప్పారు. వాటర్గ్రిడ్లో అమలు పరిచిన గ్రీన్చానల్ విధానాన్నే సాగునీటి ప్రాజెక్టుల్లోనూ అమలు చే స్తామని, కాల్వలు, బ్యారేజీల పనులు ఏక కాలంలో జరగాలని సూచించారు. బలహీన వర్గాల గృహ నిర్మాణంలోనూ ఈ ఏడాది ప్రతీ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేస్తామని, వచ్చే ఏడాది నుంచి వెయ్యి ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. పార్టీ క్రియాశీలక సభ్యుల్లో 200 మంది చనిపోగా, 40 మందికి రూ.2 లక్షల చొప్పున బీమా సొమ్ము చెక్కులు అందించినట్లు మంత్రి హరీష్రావు ఎల్పీ సమావేశంలో సభ్యులకు వివరించారు. -
16న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ
హైదరాబాద్: మార్చి 16న సోమవారం సాయంత్రం 6గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. ఈ మేరకు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్లకు ఆహ్వానం పంపనున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామాస్థాయిలో పార్టీ కమిటీలు, జిల్లాస్థాయి పార్టీ ఎన్నికలు, పార్టీ మెంబర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి అంశాలపై టీఆర్ఎస్ ఎల్పీ చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, సంస్థాగత ఎన్నికలపై తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కె. తారక రామరావు దృష్టి సారించారు. టీఆర్ఎస్ పార్టీ మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికలపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగనుంది. అయితే మార్చి 16న జరిగే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలను కేటీఆర్ ప్రకటించున్నట్టు సమాచారం.