breaking news
Trams
-
‘చెక్క బెంచీలపై ప్రయాణం ఎన్నటికీ మరువలేం’
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1873 నుంచి అంటే గత 150 ఏళ్లుగా నడుస్తున్న ట్రామ్ సేవలకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్ల పరిష్కారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే కేవలం ఒక ట్రామ్ సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోల్కతాలో చారిత్రాత్మక రవాణా సర్వీసులను నిలిపివేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులలో తాము సాగించిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ట్రామ్ బస్సుల శకం ముగిసిందని, అయితే ప్రయాణికులు ఎప్పటికీ చెక్క బెంచీలపై కూర్చుని ప్రయాణించడాన్ని మరచిపోరని పలువురు అంటున్నారు.తెలుపు, నీలి రంగుల ట్రామ్లు బెంగాలీల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కోల్కతా నగరాన్నికున్న గుర్తింపులో ట్రామ్ బస్సులకు ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో ఒక యూజర్ భావోద్వేగానికి గురవుతూ ‘ఒక శకం ముగిసింది. కోల్కతాలో 150 ఏళ్ల ట్రామ్ వారసత్వం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక అధ్యాయం ముగింపుతో, చరిత్రలోని ఒక ఘనమైన అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నాం. రాబోయే తరాలు ట్రామ్ల గురించి ఫోటోలు, వీడియోలను చూసి మాత్రమే తెలుసుకోగలుగుతాయి’ అని రాశారు. మరొక యూజర్ ‘కోల్కతాలో 150 ఏళ్ల వారసత్వ రవాణా వ్యవస్థ ట్రామ్ బంద్ అవుతోంది. కోల్కతా వీధుల్లో దీనిని మిస్ అవుతున్నాం’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘కోల్కతాలోని పురాతన ట్రామ్ వ్యవస్థను నిలిపివేస్తున్నందుకు అభినందనలు. దానిని ఆధునీకరించడానికి బదులుగా, నిలిపివేస్తున్నారు. చరిత్రను చెరిపివేయగలిగినప్పుడు, దానిని ఇంకా ఎందుకు భద్రపరచాలి?" అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు పర్యావరణ అనుకూల రవాణా అవసరమా?’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం -
పాత ఢిల్లీలో మళ్లీ ట్రామ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీ వీధుల్లో మళ్లీ ట్రామ్లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాజ హానాబాద్ వీధులలో మళ్లీ ట్రామ్లు నడపాలని పీడబ్ల్యూడీ యోచిస్తోంది. ఈ పథకానికి యూటీప్యాక్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఫతేపురీ మసీదు నుంచి జైన్మందిర్ వరకు ట్రామ్ నడపాలనుకుంటున్నారు. ఈ రూటు పొడవు 1.3 కిలోమీటర్లు. ట్రామ్ రూటు మెట్రో స్షేషన్ వరకు ఉంటుం ది. ట్రామ్ కోసం రూటు ప్రణాళిక తయారుచేసే బాధ్యత డీఎంఆర్సీకి అప్పగించారు. చాందినీచౌక్ సుందరీకరణ పథకం పాత ఢిల్లీ రోడ్లపైకి ట్రామ్లను తెచ్చేందుకు దోహదపడుతోంది. ఢిల్లీలో అరవయ్యో దశకం వరకు ట్రామ్లు నడిచాయి. 1908 లో లార్డ్ హార్డింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన ట్రామ్ సేవలను 1921లో విస్తరించారు. అప్పట్లో 15 కి.మీల ట్రామ్ ట్రాక్ ఉండేది.. ట్రాక్పై 24 కార్ల తో కూడిన ట్రామ్ నడిచేదని అంటారు. అప్పట్లో చాందినీచౌక్, జామా మసీదు, సదర్బజార్ తదితర ప్రాంతాలలో ట్రామ్ సేవ అందుబాటులో ఉండేది. 1963లో ట్రామ్ సేవ రద్దయింది. ఢిల్లీచరిత్రలో భాగమైన ట్రామ్లను మళ్లీ పాత ఢిల్లీలో ప్రవేశపెట్టాలని లెఫ్టినె ంట్ గవర్నర్ న జీబ్జంగ్ భావించారు. పాత ఢిల్లీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ట్రామ్ సేవను ప్రవేశపెట్టాలన్న జంగ్ సూచనమేరకు పీడబ్ల్యూడీ విభాగం ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. దీనిని యూటీప్యాక్ ఆమోదం కోసం పంపగా ఆ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. ట్రామ్ సేవ కోసం 7.5 మీటర్ల వెడల్పు క్యారేజ్వే రూపొందించవలసి ఉం టుంది. చాందినీచౌక్ను అందంగా తీర్చిదిద్దే పథకానికి సంబంధిం చిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యి, పీడబ్ల్యూడీ విభాగం ఈ పథకం పనులు ప్రారంభించింది. షాజహనాబాద్ పునరాభివృద్ధి బోర్డు కూడా జామామసీదు పథకానికి సంబంధించి పను లు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. అయితే కేవలం ట్రామ్ మార్గాన్ని మెట్రోస్టేషన్తో అనుసంధానించడంతో సరిపోదని మొత్తం షాజ హానాబాద్ అంతటా ఈ సేవను అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. చాందినీచౌక్, రైల్వే స్టేషన్, జామా మసీదు వాటి పరిసర ప్రాంతాలను కలుపు తూ ప్రజారవాణా వ్యవస్థను రూపొందించడం వల్ల షాజహానాబాద్ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్కు వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం లభిస్తుందని భావిస్తున్నా రు. ఇరుకు రోడ్లు, వీధులతో కూడిన పాత ఢిల్లీలో వాహనాల రాకపోకలు అటుంచి కాలినడకన సంచరించడం కూడా కష్టతరమే.