breaking news
toufiq
-
దొంగ పెళ్లికి బడా దొంగలు.. పోలీసులు షాక్!
థానే: అతడొక చైన్ స్నాచర్.. అయితేనేం కళ్లు చెదిరేలా పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే కన్నుకుట్టేలా టాప్ గజదొంగలంతా అతడి వివాహానికి హాజరయ్యారు. ఈ తంతు మొత్తాన్ని పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయలేకపోయారు. తాము వెతుకుతున్న దొంగలు, పాత కేసులు ఉన్న దొంగలు, పలు నేరాలు చేసినవారు స్పష్టంగా దొరికి తప్పించుకున్నవాళ్లు ఈ పెళ్లికి హాజరవుతున్నారని తెలిసి వారిని పరిశీలించిన పోలీసులు చివరకు ఎలాంటి చర్యకు దిగకుండానే చూస్తూ ఉండిపోయారు. మొత్తం 1000 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకాగా అరెస్టులువంటి చర్యలకు దిగితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని వారంతా వెనుకడుగు తౌఫిక్ అనే వ్యక్తి ఆంబ్విలి ప్రాంతంలో పేరు మోసిన దొంగ, చైన్స్నాచర్. అతడికి సోహ్రా అనే యువతికి ఆదివారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన వారు మాములు వాళ్లు కాదు.. అంతా భారత్లోని టాప్ చైన్ స్నాచర్లు, సీజన్ వారిగా దొంగతనాలకు పాల్పడే వారు, మాస్టర్ దొంగలు. దాదాపు 20 మంది పోలీసులు ఈ వివాహంపై నిఘా వ్యవహరించారు. తౌఫిక్పై దాదాపు 25 కేసులు ఉన్నాయంట. అతడు తన అత్త కూతురు సోహ్రా(15)ను వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా చేతికి దొరక్కుండా తిరుగుతున్న తౌఫిక్ను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై తాజాగా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, కర్ణాటక, ముంబయి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే వారంతా ఈ వివాహానికి హాజరయ్యారు. -
హెరాయిన్ పట్టివేత
అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల విలువచేసే హెరాయిన్ను చెన్నై లో పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, చెన్నై పోలీసుల సంయుక్తంగా పూందమల్లిలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 కిలోల హెరాయిన్తో పాటు ముగ్గుర్ని అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోచాపకింద నీరు లా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో తరచూ పోలీసుల తనిఖీల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కోట్ల విలువచేసే మాదక ద్రవ్యాలతో పాటు విదేశీ ముఠాను చెన్నైలో పోలీసులు అరెస్టు చే శారు. ఇటీవల ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఓ నింధితుడి వద్ద జరిపిన విచారణ మేరకు చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలకు మాద్యద్రవ్యాలు తరలుతున్నట్టు తేలింది. దీంతో ఢిల్లీ, చెన్నైలోని మాదక ద్రవ్యాల నియంత్రన విభాగం పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల క్రితం రవి అనే వ్యక్తి వద్ద జరిపిన విచారణతో పూందమల్లిలో ఓ ఇంట్లోని వ్యక్తి అనుమానాస్పదంగా తరచూ కళాశాలల వద్ద కనిపించినట్టు తేలింది. అతడి పేరు పెరుమాల్. అతడికి రవి అనే వ్యక్తి ఇంటిని అద్దెకు ఇప్పించినట్టు గుర్తించారు. ఆపరేషన్ ఢిల్లీ, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్కు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి పూందమల్లి నరసింహ నగర్లోని ఆ ఇంటి పరిసరాల్లో తిష్టవేశారు. శనివారం అర్థరాత్రి ఆ ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గుర్నీ అరెస్టు చేశారు. అక్కడి సూట్ కేసుల్లో ఉన్న పార్సిళ్లను పరిశీలించి హెరాయిన్గా తేల్చారు. ఆ ముగ్గురిలో ఒక రు తిరునల్వేలికి చెందిన పెరుమాల్గా గుర్తించారు. మరో ఇద్దరు శ్రీలంకకు చెందిన రఫీక్(61), డెఫిక్(41)గా తేల్చారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నిర్ధారణ అయ్యింది. వీరి వద్ద నుంచి పట్టుబడ్డ 18 కిలోల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.వంద కోట్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరి కొందరు వాటి విలువ రూ.యాభై కోట్లు ఉండొచ్చని పేర్కొంటున్నారు. విచారణ వేగవంతం ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రధానంగా రఫీక్, డెఫిక్ల వద్ద విచారణ వేగవంతమైంది. శ్రీలంకకు చెందిన వాళ్లు ఇది వరకు చెన్నైలో పట్టుబడడం, వారంతా ఐఎస్ఐ ఏజెంట్లుగా తేల్చారు. ఈ దృష్ట్యా, తాజాగా పట్టుబడ్డ వీరు ఐఎస్ఐ ఏజెంట్లా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. అలాగే, నగర శివారుల్లో ఇరవై కళాశాలల పరిసరాల్లో తరచూ పెరుమాల్ కనిపిస్తుండడంతో, వీరి వలలో పడ్డ విద్యార్థుల వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ఉరకలు తీస్తున్నారు.