-
కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు స్టే
-
వందల టీఎంసీల పంపింగ్లో కాళేశ్వరం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఆనతి కాలంలోనే నీటి పంపింగ్లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది. లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది. దశాబ్దాలుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే? భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. లక్ష్మీ పంప్ హౌస్ను పార్వతి పంప్ హౌస్కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1,347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండో మిషన్ 1,076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది. అతి కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ను ఆగస్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా ఆనతికాలంలోనే 100 టీఎంసీలు ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలించింది. ఈ పంప్ హౌస్లో రెండో మిషన్ అత్యధికంగా 1,703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1,367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్లలో ఒక్కొక్క మిషన్ నుంచి 3,150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్ల కింద మొత్తం 104 మెషీన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది. ఎంఈఐఎల్ కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 5,159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరం కాగా అందులో ఎంఈఐఎల్ 4,439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్తో పాటు విద్యుత్ సరఫరా చేసే 6 సబ్ స్టేషన్లు, వాటి లైన్లు నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. ఒక్క మేడిగడ్డలోనే మొట్ట మొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్--1లోని ఈ మూడు పంపుహౌస్ల కిందే 1,720 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపులు, మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్ యూనిట్లు, సుందిళ్ల పార్వతి పంపింగ్ కేంద్రంలో 14 యూనిట్లు ఆనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి. అన్నిటికన్నా ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 రోజులకు 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపిగ్ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్హౌస్ల నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. -
రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతల పనుల్లో కీలక ముందడుగు పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఎల్లంపల్లి దిగువన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. ఏకంగా రూ.21,458 కోట్లతో ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించేలా పంప్హౌస్లు, కాల్వలు, రిజర్వాయర్లకు టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరం భించి పనులు కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఎప్పుడో పరిపాలనా అనుమతులు ఇవ్వ డంతో పాటు బ్యాంకు రుణాలకు సైతం ఆమోదం ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు రూ.9,747.30 కోట్లకు గాను.. ఎల్లంపల్లి నుంచి 1.10 టీఎంసీ నీటిని దేవికొండ రిజర్వాయర్ తరలించేందుకు వీలుగా అవసరమైన అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్, ఫోర్బే, వెలగటూరు వద్ద మొదటి పంప్హౌస్ నిర్మాణానికి రూ.6,167.31 కోట్లు, దేవికొండ రిజర్వాయర్ నుంచి వరద కాల్వ 95.27వ కిలోమీటర్ వరకు నీటిని తరలించేందుకు రెండో పంప్హౌస్, ఇతర నిర్మాణాలకు రూ.3,144.11కోట్లు, ఇక 109వ కిలోమీటర్ వరకు వరద కాల్వ సామర్థ్య పంపునకు వీలుగా 222.59 కోట్లు, 122వ కిలోమీటర్ వరకు వరద కాల్వ పనులకు రూ.213.29 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీ పనులకు ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 18 వరకు టెండర్లు వేసుకునే అవకాశమిచ్చారు. 20న సాంకేతిక బిడ్లు తెరవ నున్నారు. నిజానికి ఈ మొత్తం పనులను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా కసరత్తు చేసినప్పటికీ తిరిగి వాటిని నాలుగు ప్యాకేజీలకు కుదించారు. ఇక మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే పనులను సైతం నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.11,710.70 కోట్లు కేటాయించారు. దీనిలో మొదటి ప్యాకేజీని రూ.3,286.77 కోట్లు, 2వ ప్యాకేజీని రూ.6,148.48 కోట్లు, 3వ ప్యాకేజీని రూ.680.90కోట్లు, 4వ ప్యాకేజీని రూ.1,594.55 కోట్లుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీలకు ఏప్రిల్ 17 వరకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించగా, 18న టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. -
సోమశిలలో నీరు దుర్వినియోగం కాలేదు
నెల్లూరు(పొగతోట): సోమశిల ప్రాజెక్ట్లో నీరు దుర్వినియోగం కాలేదని కలెక్టర్ జానకి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్లో 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితమయ్యాయని వివరించారు. రైతు సంఘాల నాయకులు సేకరించిన సమయంలో నీటి గణాంకాలు పూర్తి స్థాయిలో లేవన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు, విడుదల, వస్తున్న నీటి గణాంకాలను పూర్తిగా పరిశీలించారని చెప్పారు. 26 టీఎంసీల నీరు దుర్వినియోగం కాలేదని, ప్రాజెక్ట్లోనే నిల్వ ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 12న ఐఏబీ సమావేశం జరిగిందని, అప్పటికి జిల్లాలో 68.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారన్నారు. ఐఏబీ నాటికి 67.862 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గత నెల 20 నాటికి 18 టీఎంసీల నీరు ఇన్ఫ్లో ఉందని తెలిపారన్నారు. 3.918 టీఎంసీల నీరు మాత్రమే ఇన్ఫ్లో వచ్చిందని, కండలేరు రిజర్వాయర్కు 7.348 టీఎంసీల నీటిని విడుదల చేస్తే, మూడు టీఎంసీలనే విడుదల చేశారని నాయకులు తెలిపారన్నారు. ఇలాంటి తేడాల వల్ల 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే సోమశిల ప్రాజెక్ట్లో 33 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు. నాయకులు చెప్పిన దానికి రికార్డులను పరిశీలిస్తే ఒక టీఎంసీ నీరు మాత్రమే తేడా వస్తోందని, ఇది ఆవిరి, వృథా కిందపోయి ఉంటుందని తెలిపారు. నాయకులు ఫిర్యాదు చేసిన వెంటనే రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు. 4.32 లక్షల ఎకరాలకు 43.7 టీఎంసీల సాగునీటిని విడుదల చేయాలని ఐఏబీలో తీర్మానించి నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతితో నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్ట్లో ఈఈ 3.2 టీఎంసీల నీటిని గణాంకాల్లో తక్కువగా నమోదు చేశారని చెప్పా రు. -
ఏపీకు 10, తెలంగాణకు 20 టీఎంసీలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement