-
ఆగని అక్రమ రవాణా
సాక్షి, గోపవరం: గోపవరం మండలం మల్లెంకొండ పరిసరాలలో యథేచ్ఛగా ఎర్రచంనదం చెట్లను నరికి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. స్మగ్లర్లు అటవిశాఖాధికారుల కళ్లు గప్పి చెట్లను నరికి అటవీ ప్రాంతం నుంచి దుంగలను సురక్షిత ప్రాంతానికి చేర్చుకుని అక్కడ నుంచి రవాణా చేస్తున్నారు. మండలంలో సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల కింద దాదాపు 35 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వెనుక జలాలకు ఇరువైపులా అటవీ ప్రాÆతం ఉంది. మల్లెంకొండ పరిసరాలను పెనుశిల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా ఎర్రచందనం, ఇతర అటవీ సంపద ఉంది. సోమశిల వెనుక జలాల ముసుగులో స్మగ్లర్లు , ఎర్ర చందనం నరికి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లెంకొండ మంచినీరు సెల, విశ్వనాథ పురం, సూరేపల్లె కూడలిలో ఎర్రచందనం నరికి దుంగలను తరలించారు. మరికొన్ని దుంగలు అక్కడే ఉన్నాయి. చెట్లు నరికిన మొదళ్లు, దుంగలను చూస్తే నాలుగైదు రోజుల క్రితమే స్మగ్లర్లు చెట్లను నరికినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మండలంలోని పీపీకుంట జాతీయ రహదారిపై అటవిశాఖ చెక్పోస్టు ఉంది. అలాగే ఎస్.రామాపురం వద్ద బేస్క్యాంపు ఏర్పాటు చేశారు. నరికిన ఎర్ర చందనం దుంగలను ఈ రెండు చెక్పోస్టుల ద్వారా సిబ్బంది కళ్లుగప్పి తరలిస్తున్నారా లేక మల్లెంకొండనుంచి తూర్పు భాగానికి వెళితే కాలినడకన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాయుడుపల్లె వద్దకు వెళ్లే అవకాశం ఉంది. అయితే నరికిన దుంగలను కూలీలు కాలినడకన కొండ దిగువ వరకు తీసుకెళ్లిన దాఖలాలు గతంలో ఉన్నాయి. అక్కడి నుంచి అతి దగ్గరగా నెల్లూరు –ముంబయి జాతీయ రహదారి ఉంది. స్మగ్లర్లు ఈ మార్గాన్నే ఎంచుకుని అటవి సంపదను కొల్లగొడుతున్నారనే సమాచారం అధికారుల వద్ద ఉంది. కాగా ఎర్రచందనం నరికి వేత , అక్రమ రవాణా పై అటవిశాఖాధికారులు , పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లర్ల భరితెగింపు ఏ మేరకు ఉందో చెప్పకనే తెలిసిపోతుంది. కాగా ఎర్రచందనం నరికివేతకు తమిళనాడుకు చెందిన కూలీలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారుల అదుపులో తమిళ కూలీలు మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద శనివారం రాత్రి 9 మంది తమిళ కూలీలను చెక్పోస్టు సిబ్బంది పట్టుకుని అధికారులకు అప్పగించారు. బద్వేలు నుంచి¯ð నెల్లూరు వైపు కారులో తమిళ కూలీలు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకుని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మల్లెంకొండలో ఎర్రచందనం చెట్ల నరికివేతపై బద్వేలు అటవీశాఖ రేంజర్ పి.సుభాష్ను సాక్షి వివరణ కోరగా తమకు కూడా సమాచారం అందిందని ఆదివారం ఉదయం సిబ్బందిని మల్లెంకొండ ప్రాంతానికి పంపించామన్నారు. ఇప్పటికే కొంతమంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని విచారిసున్నట్లు తెలిపారు. -
రూ. 10 లక్షల విలువైన కలప పట్టివేత
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్ నగర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలప (టేకు) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మాపూర్ శివారులో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న టేకు కలపను అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేసి కలప ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కలప విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఆదివారం వేకువ జామున అటవీ అధికారులు పట్టుకున్నారు. పోచంపాడు అటవీ ప్రాంతం నుంచి డీసీఎం వాహనంలో దుండగులు కలపను తరలిస్తుండగా కనాపూర్ మండలం బురుజు గ్రామ శివారులో అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ. .5 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (ఖానాపూర్) -
జలమార్గం ద్వారా కలప రవాణా
చెన్నూర్ : కలప రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. నిన్న మొ న్నటి వరకు జీపులు, వాహనాలు వినియోగించి కలపను తరలించిన స్మగ్లరు ఇప్పుడు జలమార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాణహిత నది గుండా పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో టేకు కలప లేకుం డా చేసిన స్మగ్లర్లు మహారాష్ట్ర కలపపై కన్నేశారు. మహారాష్ట్ర, చత్తీష్గఢ్ రాష్ట్రా ల్లో టేకు వనాలు విరివిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి నెలకు రూ.కోటికి పైగా విలువ గల కలప అక్రమంగా రవా ణా అవుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తుపాకులతో సైతం గస్తీలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. స్మగర్లు ఫారెస్ట్ అధికారులపై ఎదురుదాడులకు దిగుతూ కలప రవాణా సాగిస్తున్నారు. రవాణా సాగుతుందిలా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అంకిస, లంకచేను, మొండిగుట్ట, చత్తీష్గఢ్ రాష్ట్రంలోని దమ్మూర్, కొత్తపల్లి, నడికూడ గ్రామాల మీదుగా ప్రాణహిత నది నుంచి జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాలకు, కరీంగనర్ జిల్లాలోని మహాదేవపూర్, మహాముత్తారం మండలాలకు కలప రవాణా అవుతోంది. స్మగ్ల ర్లు కలప దుంగలను తెట్టెలు కట్టి నదిలో వేస్తారు.ప్రవాహం ద్వారా అవి దిగువ ప్రాంతంలో ఉన్న వేమనపల్లి, నీల్వాయి, కోటపల్లి మండలంలోని అన్నారం, కరీం నగర్ జిల్లాలోని మహాదేవపూర్, సంకెపరిమెల, మంథని, పోతారం గ్రామాలకు చేరుతాయి. నది నుంచి వచ్చిన కలపను తీసి వారి అనుచరులు పట్టణ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. రవాణా చేసేది తెలంగాణ స్మగ్లరే.. మహారాష్ట్ర, చత్తీష్గఢ్ల నుంచి కలప రవాణా సాగిస్తున్న వారంతా తెలంగాణ స్మగ్లర్లేనని రెండు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మూడేళ్లుగా ఈ దం దా నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం -ప్రభాకర్రావు, డీఎఫ్వో, మంచిర్యాల మహారాష్ట్ర నుంచి వచ్చే కలపను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement