breaking news
Thiru Onam
-
జాక్పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
ఇడ్లీ ప్రాణం తీసింది
పాలక్కడ్: కేరళ రాష్ట్రంలో జరిగిన ఓనమ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓనమ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన నిర్వహించిన ఇడ్లీ పోటీలలో పాల్గొన్న 55 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. పోటీల్లో పాల్గొన్న కందముతన్ అనే వ్యక్తి గొంతులో ఇడ్లీ ఇరికి ప్రాణం వదిలారు. ఓనం సందర్భంగా స్థానిక క్లబ్ నిర్వహించిన ఇడ్లీ పోటీల్లో కుదముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరికిందని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారని.. అయితే అప్పటికే కుదముతన్ మరణించారని వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు.