-
మేఘన్కు కష్టాలు.. కన్నతండ్రి కన్నీటిపర్యంతం!
వివాహం అయిన తర్వాత ప్రతి మహిళ జీవితంలో కొన్ని సర్దుబాట్లు తప్పవు. అత్తింటి ఆచారాలకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి కాస్తా సమయం పడుతుంది. సాధరణ కుటుంబాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక రాయల్ ఫ్యామిలిలో కోడలిగా అడుగుపెట్టిన వారి పరిస్థితి ఇంకాస్తా కష్టంగానే ఉంటుంది. రాజ కుటుంబం అంటే కట్టుబాట్లు, కష్టమైన నియమాలు తప్పవు. ఏం తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎలా మాట్లాడాలి... ఇలా ప్రతి విషయంలోనూ ఆచారం, వ్యవహారం ఉంటుంది. అవన్ని ఆకళింపు చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైనది వాటన్నింటికి అనుగుణంగా తమని తాము మార్చుకునే క్రమంలో వారిలో చెలరేగే సంఘర్షన. కొందరు దీనిని తట్టుకోగలరు, మరి కొందరు వీటన్నింటిని భరించడం మా వల్ల కాదు అనుకుని ఆ బంధం నుంచి బయటపడతారు. ప్రస్తుతం మేఘన్ మార్కల్ కూడా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారంట. నలుగురిలో చిరునవ్వుతో కనిపించే మేఘన్ తన మనసులో అపారమైన బాధను భరిస్తున్నారంట. ఆమె మోముపై ఉన్న చిరునవ్వు నిజం కాదంట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. స్వయంగా మేఘన్ తండ్రే. ఒకప్పటి ఈ నటి ప్రిన్స్ హారీని వివాహం చేసుకుని రాజకుటుంబంలో అడుగుపెట్టారు. ఇన్నాళ్లు సాధారణ జీవితం గడిపిన మేఘన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రాయల్ ఫ్యామిలీలో ఒదిగిపోవడం అంటే కష్టమే. కొత్త వాతవారణం, కొత్త మనుషులు అన్నింటికి మించి ఇన్నాళ్లు అందరిలానే చేసిన కొన్ని పనులను కూడా ప్రత్యేక పద్దతిలో చేయాల్సి రావడం కాస్తా కష్టమే. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు మేఘన్ మార్కల్. ఇప్పటికే పలు సందర్భాల్లో రాయల్ ఫ్యామిలీ నియమాలను మర్చిపోతూ మీడియా వారికి పని కల్పిస్తున్నారు. దాంతో సామన్యులు కూడా పాపం మేఘన్కు రాజకుటుంబం బరువు బాధ్యతలు మోయడం ఇబ్బందిగా ఉన్నట్లుంది అనుకుంటున్నారు. ఇలా అనుకునే వారిలో మేఘన్ మార్కేల్ తండ్రి కూడా ఉన్నారు. ఈ విషయం గురించి థామస్ ‘ఇప్పుడు నా కూతురు ప్రారంభించిన కొత్త జీవితం ఆమెను భయపెడుతుందనుకుంటున్నాను. ఆమె కళ్లల్లో, మొహంలో, చివరికి ఆమె నవ్వులో కూడా ఆ భయం నాకు స్పష్టంగా తెలుస్తుంది’ అని తెలిపారు. మేఘన్ మార్కల్ బహిరంగ సమావేశాలకు హాజరయిన ప్రతిసారి ఆమె మొము మీద చిరునవ్వు ఉంటుంది. కానీ ఆమె తండ్రి థామస్ మాత్రం అది నిజం చిరునవ్వు కాదంటున్నారు. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. అంతేకాక ‘మేఘన్కు వివాహం అయిన నాటి నుంచి నేటి వరకూ నేము ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసిన తను ఫోన్ ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. -
సోదరులే కాలయుములు
కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో భయానక హత్య ప్రాణం తీసిన పొలం వివాదం సోదరులే కాలయములయ్యారు. పొలం వివాదం నేపథ్యంలో పెదతండ్రి కొడుకునే చంపేశారు. తల నుంచి మొండేన్ని వేరుచేసి భయానకంగా హత్య చేశారు. కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పేటసన్నెగండ్ల (కారంపూడి) : పొలం వివాదం అన్నదమ్ముల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఒకరి హత్యకు దారితీసింది. మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చప్పిడి మల్లయ్య, వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. వారికి భాగపంపకాల్లో భాగంగా కొండ కింద ఉన్న రెండెకరాల పొలంలో చెరో ఎకరం వచ్చింది. గతంలో దాయాది భాగాన్ని కూడా తాను కొన్నానని, రెండెకరాలు తనదేనని వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట నర్సయ్య కోర్టుకు వెళ్లడంతో ఇటీవల కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో వెంకటనర్సయ్య మంగళవారం పొలంలో జూట్ విత్తనాలు వేసేందుకు చెల్లెలు ఆదిలక్ష్మితో కలిÜ పొలం వెళ్లాడు. అంతకుముందే తండ్రి వెంకటేశ్వర్లు బాడుగ అరకతో పొలంలో ఉన్నాడు. ఇంతలో ట్రాక్టర్పై వచ్చిన పెదనాన్న మల్లయ్య కుమారులు విత్తనం వేయడాన్ని అడ్డుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకుందామని వాదులాడుకున్నారు. దీంతో వెంకట నర్సయ్య విత్తనం వేసే పనిని వాయిదా వేసుకుని బైక్పై చెల్లిని ఎక్కించుకుని ఇంటికి వెళ్లాలని యత్నిస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్తో బైక్ను ఢీకొట్టి వెంకటనర్సయ్య కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరికేశారు. తలను మొండెం నుంచి వేరు చేసి దారుణంగా హత్యచేశారు. ఆ వెంటనే అతని చెల్లెలు ఆదిలక్ష్మిపై దాడికి సిద్ధమయ్యారు. దీంతో ఆమె ప్రాణభయంతో తప్పించుకుని పారిపోయింది. అతని తండ్రి వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో ఆయన గాయాలతో తప్పించుకుని పారిపోయాడు. నలుగురు నిందితులు... ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నారని ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. చప్పిడి మల్లయ్య కుమారులు నరసింహారావు, అంజయ్య, అయ్యప్ప, శంకర్ హత్యకు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఘటనాస్థలిని గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు పరిశీలించారు. హతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఆస్తి వద్దన్నా వదల్లేదు... హత్యకు ప్రత్యక్ష సాక్షులైన హతుని తండ్రి వెంకటేశ్వర్లు, సోదరి ఆదిలక్ష్మి సంఘటనను పోలీసులకు వివరించారు. నరసింహారావు తన సోదరుని కళ్లలో కారం చల్లాడని, అంజయ్య వేటకొడవలితో తలపై నరికాడని ఆదిలక్ష్మి వివరించింది. తమ ఇద్దరిపైనా దాడికి దిగగా, తన తండ్రి, తాను తప్పించుకుని పారిపోయామని వివరించింది. ఇంట్లో పిల్లలను స్కూల్లో వదలి పెట్టి సోదరుడు చేనుకు వెళుతుంటే తాను కూడా వస్తానని బండి ఎక్కానని, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా.. మాకీ ఆస్తి వద్దు.. మా తమ్ముడిని వదిలేయండని వేడుకున్నా వారు వినలేదని ఆదిలక్ష్మి బోరున విలపించింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి సైదమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంకటనర్సయ్యకు భార్య సౌజన్య, కుమారుడు తనయ్ ఉన్నారు. సౌజన్య గర్భిణి. ఈ పొలం విషయంలో ఇది రెండో హత్య... ఈ పొలం వివాదం నేపథ్యంలో గతంలోనూ ఒక హత్య జరిగినట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం ఇదే పొలాన్ని చిన్నాన్న వెంకటేశ్వర్లు వద్ద కౌలుకు తీసుకుని మల్లయ్య కుమారుల్లో ఒకరైన చప్పిడి పాలయ్య సేద్యం చేస్తుండగా అప్పట్లో రేగిన వివాదం నేపథ్యంలో అతని కుటుంబ సభ్యుల్లోనే ఒకరు హత్యకు పాల్పడినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement