breaking news
Telugu pandit
-
కైఫియత్తులే ఇంటిపేరుగా...
బలమైన చారిత్రక ఆధారాలైన కైఫియత్తులను ఇంటి పేరుగా మార్చు కొన్న గొప్ప భాషావేత్త, పరిశోధకులు... విద్వాన్ కట్టా నరసింహులు. వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట సమీపంలోని కొత్తపల్లి వాసి. తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించారు. బ్రౌన్ గ్రంథాలయ ఆవిర్భావం తర్వాత దాని వ్యవస్థాపక సెక్రెటరీ డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రితో పరిచయం... కట్టా పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ గ్రంథాలయానికి చేర్చింది. బ్రౌన్ గ్రంథాలయ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని పటిష్టం చేసేందుకు కట్టా పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన వ్యక్తిత్వం, శక్తియుక్తిలకు తృప్తిచెందిన జానమద్ది ఆయనకు మెకంజీ రాసిన ‘కడప కైఫియత్తు’ల పరిష్కార బాధ్యతను అప్పగించారు. ఫలితంగా 3,000 పైచిలుకు పేజీలతో, 8 సంపుటాల కడప కైఫియత్తులు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి. ఆయన కేవలం కడప కైఫియత్తుల ఆధా రంగా ఇంతవరకు వెలుగు చూడని చారిత్రకాంశాలతో ‘కైఫియత్ కతలు’ పేరిట పుస్తకం వెలువరించారు. రాయలసీమలో శ్రీకృష్ణ దేవరాయల పాలన వలె ఆయన బంధువులైన ‘మట్లి’ రాజుల పాలన సాగిందని కట్టా నిరూపించారు. తన జన్మస్థలి ఒంటిమిట్ట గురించి పూర్తి చారిత్రక ఆధారాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు వెలువరించి, అక్కడ ఉన్న రామాలయ చరిత్రను లోకానికి తెలిపారు. (చదవండి: నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి) ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి ప్రభుత్వ లాంఛనాల హోదా కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ కృషి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ‘పోతన భాగవతం’ ప్రాజెక్టులో సేవలందించే అవకాశాన్ని కల్పించింది. అక్కడ పని చేస్తూనే ఆయన 2021 మే 15న కరోనాతో కన్నుమూశారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా కడపలోని బ్రౌన్ కేంద్రంలో సదస్సు జరగనుంది. – పవన్కుమార్ పంతుల, జర్నలిస్ట్ (మే 15న విద్వాన్ కట్టా నరసింహులు తొలి వర్ధంతి) -
విశాఖలో మహిళా టీచర్ వీరంగం
-
విశాఖలో మహిళా టీచర్ వీరంగం
విశాఖ: విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం కొండకొప్పాక హైస్కూల్లో మంగళవారం ఓ మహిళా టీచర్ వీరంగం సృష్టించింది. హైస్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్న విజయలక్ష్మి.. సహా ఉపాధ్యాయులపై విరుచకపడింది. స్కూల్లో బెంచీలు, కుర్చీలను తన్నుతూ టీచర్లను కొట్టింది. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విజయలక్ష్మి ఇలా ప్రవర్తిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. -
‘ఇంతింతై..
నేడు మహిళా దినోత్సవం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.. తమదైన ముద్ర వేస్తున్నారు.. ఆకాశంలో సగం అంటూ సాగు నుంచి పైలట్ వరకు.. వంటింటి నుంచి సమాజ సేవ వరకు రాణిస్తున్నారు.. విధివంచితులకు అమ్మగా.. విద్యార్థులకు గైడ్గా.. చదువుల్లో.. ఆటల్లో.. పాటల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు సమన్వయం.. ఇది మహిళకే సాధ్యమైన పనికావొచ్చు! ఇల్లూ.. పిల్లలు.. ఉద్యోగం.. సామాజిక సేవ ఇలా ఎన్నెన్నో బాధ్యతలను నేర్పుగా.. ఓర్పుగా నెరవేర్చుతున్నారు కొందరు సాధారణ మహిళలు. వీరి శ్రద్ధాసక్తులకు చిత్తశుద్ధి తోడై పది మందితో శెభాష్ అన్పించుకుంటున్నారు. లాభాపేక్ష లేకుండా వీరు చేస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. కష్టాల్లోనూ వీరు కనబరిచిన ధృడ చిత్తం అబ్బురపరుస్తోంది. ఏటికి ఎదురీదిన వారు కొందరైతే.. జీవితమనే సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని అక్కున చేర్చుకుని ఆదరించిన వారు మరికొందరు.. దైనందిన, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ సమర్థంగా ముందుకెళ్తున్న పలువురు మహిళల పరిచయం.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం బోధిస్తూ.. ప్రోత్సహిస్తూ.. కట్కూరు(బచ్చన్నపేట) : ఉద్యోగినిగా తన బాధ్యల నిర్వహణతోనే ఆమె సరిపుచ్చడం లేదు. విద్యార్థులకు తల్లిగానూ మార్గనిర్దేశం చేస్తున్నారు లంకా శివకుమారి. మండలంలోని కట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఆమె బాటలు వేస్తున్నారు. భాషానైపుణ్యాలు, ఆటపాటల్లో విద్యార్థులను నిత్యం ప్రోత్సహిస్తుంటారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో జరిగే వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠనం పోటీలకు విద్యార్థులను తీసుకెళ్లి ఎన్నో బహుమతులను వచ్చేలా చేశారు. కృత్యాల ఆధారంగా తెలుగును ఆసక్తికరంగా బోధిస్తారు. ఎస్సెస్సీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. పేద పిల్లలకు అవసరయమ్యే పరికరాలు, వస్తువులను బహూకరించి అమ్మ ప్రేమను పంచుతుంటారు. శివకుమారి పనిచేసిన పాఠశాలల్లో ఉత్తమ అవార్డుతో పాటు ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. ‘నా పిల్లలు చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలూ ఉన్నత స్థారుుకి ఎదగాలనేది నా కోరిక. అందుకే ఎప్పుడూ వాళ్లను ప్రోత్సహిస్తా. మహిళా సాధికారతను వ్యక్తిగతంగా అందరూ గౌరవించాలి. మహిళలను తక్కువగా అంచనా వేయొద్దు.’ అంటున్నారు శివకుమారి. సామాజిక సేవకురాలు సులోచన మహబూబాబాద్ : సామాజిక సేవలో ముందుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు మానుకోటకు చెందిన గుండు సులోచన. 21 ఏళ్లుగా ఈమె అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ శివారులోని బీసీ కాలనీలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు వదిలించుకున్న శిశువులను ఆస్పత్రికి తరలించడం లేదా శిశువిహార్కు చేర్చడంలో ఈమె ముందుంటారు. అనాథ పిల్లలకు దుస్తులు, ఇతర సామగ్రి అందిస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 23 మంది పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించారు. 16 మంది శిశువులను శిశువిహార్కు చేర్చారు. వీరందరి బాగోగులు తరచూ తెలుసుకుంటారు. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా 26 మందికి ఆదర్శ వివాహం చేసి ఇంటి స్థలాలు ఇప్పించారు కూడా. 18 మంది బాల్య వివాహాలను అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అవగాహన సదస్సులు నిర్వహించారు. అనాథ ఆడపిల్లలు కనిపించగానే పోలీసులు సైతం కౌన్సెలింగ్ చేసి సులోచన ద్వారా అనాథాశ్రమానికి పంపించటం గమనార్హం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మానుకోట ఐసీడీఎస్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ఆరేళ్లుగా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ‘మహిళలు చదువుకోవాలి. ధైర్యంగా ప్రతి విషయాన్ని ఎదుర్కోవాలి. పురుషునితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి. సమాజానికి తగ్గట్టుగా మారాలి. ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేయూలి. సేవా కార్యక్రమంలోను మహిళలు ముందుండాలి. మదర్ థెరిస్సా నాకు ఆదర్శం’ అంటున్నారు సులోచన. అభాగ్యులకు అవ్ము ప్రేవు విధి వక్రించిన అభాగ్యులకు ఆమె అమ్మయ్యూరు. ఆలనాపాలన చూస్తున్నారు. తొమ్మిదేళ్లుగా అనాథ పిల్లలకు సేవ చేస్తూ వారిలో భరోసా నింపుతున్నారు అర్షనపెల్లి వినోద. నర్సంపేటలో ప్రవుుఖ వైద్యుడు అర్షనపుల్లి మోహన్రావు సంజీవని అనాథ ఆశ్రవుం నెలకొల్పారు. ఇందులో 40 వుంది అనాథ చిన్నారులకు వసతి కల్పిస్తున్నారు. మోహన్రావు భార్య వినోద ప్రతీ రోజు సకల సపర్యలు విద్యార్థులకు అందిస్తూ అవ్ములేదనే దిగులు దూరం చేస్తున్నారు. ఆ చిన్నారులు చెందకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకున్నా, భర్త వైద్య వృత్తిలో, అనాథ ఆశ్రవుం నిర్వహణ కార్యక్రవూల్లో బిజీగా ఉంటున్నా ఇల్లాలిగా పనులు చేసుకుంటూనే ఇటు ఆశ్రవుంలోని అనాథలకు అవ్ము ప్రేవును పంచుతూ ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. ‘ఈ అనాథ చిన్నారులకు సేవ చేసే అవకాశం నాకు లభించడం దేవుడిచ్చిన వరం’ అంటుంటారు వినోద. - నర్సంపేట మహిళా చట్టాల అమలులో చిత్తశుద్ధేది? ధనసరి అనసూయ(సీతక్క) వరంగల్ లీగల్ : బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని నమ్మిన సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో తొలి మహిళా అజ్ఞాత నక్సలైట్ దళ నాయకురాలు, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసి కోయ తెగ గిరిజన మహిళా న్యాయవాది, జిల్లాలో తొలి ఆదివాసి మహిళా ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. విభిన్న ప్రస్థానాల్లోని తన అనుభవాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ‘సమానత్వానికి ప్రతీక స్త్రీ. పితృస్వామిక వ్యవస్థలో సామాజి, రాజకీయ ఆర్థిక రంగాల్లో వివక్ష కొనసాగుతోంది. కట్టుబాట్లు ఎదుర్కొని ముందుకొచ్చే మహిళలకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి. స్త్రీ సమానత్వం, సాధికారిత సాధించాలంటే విధాన నిర్ణయాధికార వేదికల్లో, స్త్రీల సమస్యల సబంధిత చట్టసభ కమిటీలు, సంక్షేమ పథకాల్లో వారికి భాగస్వామ్యం కల్పించాలి. రాష్ట్ర క్యాబినెట్లో స్త్రీలకు ప్రాతినిధ్యమే లేదు. ఇది దేనికి సంకేతం? అత్యాచారాలు వేధింపుల కేసుల విచారణై కోసంప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. న్యాయమూర్తులు, ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు గా మహిళలనే నియమించాలి. స్త్రీల సమస్యలు సమాజ సమస్యలుగా పరిగణించాలి. ప్రభుత్వపరంగా ప్రోత్సహిం చాలి’. -
అమ్మ తనములోని అనురాగమును పంచు
"సీ " అమ్మ తనములోని అనురాగమును పంచు పొలుపైన కథలెన్నో తెలుగులోన నాన్నలా రక్షించి నవ్యనీతులు నేర్పు చెలువైన మణులెన్నొ తెలుగులోన అన్నయ్య నీడగా అండగా నిలుచుండు కొలువైన గతులెన్నో తెలుగులోన అత్తయ్య తోడుగా చక్కగా అలరించు విలువైన గనులెన్నో తెలుగులోన "తే" గీ" ఎన్నొ కావ్యాల గేయాల ఇంపు సొంపు ముగ్ధ మొహన భావాల మోహరింపు తెలుగు భాషంటె జగతికే వెలుగు చూడ వాణి వినిపించు తెలుగోడ ! వాడ వాడ - తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా పేరు :- చల్లా శ్రీనివాసరావు తెలుగు పండిట్ నిజాంపేట, హైదరాబాద్