-
పాక్ తాలిబన్లతోనూ ఇమ్రాన్ రాజీ!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భద్రతాబలగాలు, పౌరులే లక్ష్యంగా గడిచిన 14 ఏళ్లుగా దాడులకు పాల్పడుతున్న పాకిస్తానీ తాలిబన్ ఉగ్ర సంస్థతో ప్రధాని ఇమ్రాన్ఖాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ ప్రభుత్వం, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం సహకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్ చౌదరి వెల్లడించారు. టీటీపీ ప్రతినిధి మొహమ్మద్ ఖురాసానీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నెల రోజుల్లో రెండు వర్గాల ప్రతినిధులతో ఏర్పడిన కమిటీ చర్చలు కొనసాగిస్తుందని ఆయన వివరించారు. గత నెలలో పాక్ ప్రభుత్వం, టీటీపీ మధ్య మొదలైన చర్చల నేపథ్యంలో తాజాగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ చర్చల్లో పురోగతి కనిపిస్తే కాల్పుల విరమణ కూడా కొనసాగనుందని ఫవాద్ చెప్పారు. చర్చల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, అఫ్గాన్ తాలిబన్ అనుబంధ సంస్థే టీటీపీ. పాకిస్తానీ ఉగ్రవాదులతో 2007లో ఏర్పాటైన ఈ సంస్థ జరిపిన వందలాది దాడుల్లో వేలాదిగా ప్రజలు చనిపోయారు. కాగా, ఉగ్ర సంస్థగా పాక్ అధికారికంగా గుర్తించిన తెహ్రిక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్పీ)పై ఉన్న నిషేధాన్ని ఇమ్రాన్ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. -
'కొంతమందిని చంపేశాం.. మరి కొందరు అరెస్ట్'
ఇస్లామాబాద్: పెషావర్ ఆర్మీ స్కూల్లో నరమేధానికి వ్యూహారచన చేసి ... అమలు చేసిన తీవ్రవాదుల్లో చాలా మందిని అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ ఉన్నతాధికారి అసిమ్ బాజ్వా గురువారం వెల్లడించారు. ఈ నరమేధంలో పాల్గొన్న 9 మంది తీవ్రవాదులు ఇప్పటికే సైన్యం చేతిలో చనిపోయారని తెలిపారు. అలాగే పాక్, ఆఫ్ఘానిస్థాన్లకు చెందిన 12 మంది తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సదరు తీవ్రవాదులను అప్పగించాలని ఇప్పటికే ఆఫ్ఘానిస్థాన్ను కోరినట్లు తెలిపారు. ఈ దారుణ మారణ కాండకు వ్యూహారచన చేసిన తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్లను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని ఉన్నతాధికారి బాజ్వా ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 16న పాకిస్థాన్ పెషావర్లోని ఆర్మీ స్కూల్పై తీవ్రవాదులు విరుచుకు పడి... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తీవ్రవాదుల ఘాతుకంలో మొత్తం 150 మంది మరణించారు. మృతుల్లో 140 మంది విద్యార్థులు ఉన్న సంగతి తెలిసిందే. పెషావర్ స్కూల్పై దాడికి తీవ్రవాదులు పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో వ్యూహారచన చేసినట్లు పాక్ అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ఘటనకు సూత్రధారులు తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్గా పాక్ దర్యాప్తులో తేలింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
హోం ఓటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదివారం రాహుల్ గాంధీ..
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం....
రాహుల్గాంధీ సభను విజయవంతం చేయండి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
సై.. అంటే సై!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement