-
మావాడు క్లాస్ టాపర్.. ఉగ్రవాది అయ్యాడా?
ఢాకా: గత వారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన భారతీయ యువతి తరుషి జైన్ (19) తల్లిదండ్రులకు ఓ ఉగ్రవాది తండ్రి క్షమాపణ చెప్పారు. రోహన్ ఇంతియాజ్ అనే యువకుడు ఆ ఉగ్ర ఘటనలో అనుమానితుడు. అయితే ఆ నిందితుడి తండ్రి, బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ నేత అయిన ఇంతియాజ్ ఖాన్ బాబుల్ ఈ ఘటనపై క్షమాపణ కోరారు. తరుషి జైన్ కుటుంబానికి తాను మాత్రమే క్షమాపణ చెప్పగలనని, తానే చెప్పాలని, ఎందుకంటే మంచి తండ్రిని కాలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే క్షమాపణ చెప్పడానికి తనవద్ద మాటలు కరవయ్యాయని, ఏం చెప్పినా ఆ తల్లిదండ్రులకు తక్కువే అవుతుందని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు ఐఎస్ ఉగ్రవాది అని తెలిసి షాక్ కు గురయ్యానని చెప్పారు. గతేడాది డిసెంబర్ లో రోహన్ ఇంటినుంచి వెళ్లిపోయాక మళ్లీ తనకు కనిపించలేదని వెల్లడించారు. క్లాస్ టాపర్.. ఇలా దాడులు చేశాడా? మ్యాథ్స్ లో మాత్రమే కాదు క్లాస్ ఓవరాల్ టాపర్ తన కుమారుడని అయితే ఎందుకు ఇలా మారాడో తెలియదని చెప్పుకొచ్చారు. రోహన్ అదృశ్యంపై ఈ జనవరి 2న ఫిర్యాదు చేశాను. మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడని వివరించారు. రోహన్ జిహాదీ సాహత్యం చదవడం తాను ఎప్పుడూ చూడలేదని, తమ ఇద్దరికీ ఒక్కటే కంప్యూటర్ ఉండేదని మీడియాకు వెల్లడించారు. గత వారం ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదులు దాడిచేసి 20 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. -
'ప్రాణాలతో రానేమో.. అందరినీ చంపేస్తున్నారు'
ఆగ్రా/ఫిరోజాబాద్: ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలుకోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19) ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కుందో ఆఖరి ఘడియల్లో తన తండ్రికి వివరించింది. తన ఇద్దరు స్నేహితులతోపాటు రెస్టారెంటులోని వాష్ రూమ్ లో దాక్కున్న ఆమె తండ్రికి ఫోన్ చేసి ఉగ్రవాదులు ఇక్కడ రెస్టారెంటులోకి చొరబడ్డారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ప్రాణాలతో భయటకు వస్తానో లేదో కచ్చితంగా మాత్రం చెప్పలేను. ఇక్కడ అందరినీ వాళ్లు చంపేస్తున్నారు. నేను నా స్నేహితులతో కలిసి టాయిలెట్ లో దాచుకున్నాను. మేము కూడా ఒకరి తర్వాత ఒకరం హత్యకు గురవుతామనిపిస్తుంది' అని ఆమె తండ్రి సంజీవ్ జైన్ మీడియాతో చెప్పారు. అదే ఆమె నుంచి చివరి మాటలని వివరించాడు. తన కూతురు నుంచి ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి తెల్లవార్లు గుర్షాన్ కేఫ్ వద్ద ఎంతో కంగారుగా ఎదురుచూశాడు. తెల్లవారు జామున ఆమె ఫోన్ డెడ్ అయినా బలగాలు సైనిక చర్యలు జరుపుతున్నారని, బంధీలకు విముక్తి లభిస్తుందని చెప్తుండగా ఆశగా ఎదురుచూశాడు. 13మంది బందీలకు విముక్తి అని చెప్పాక అందులో తమ కూతురు ఉండకపోతుందా అని భావించాడు. కానీ ఉగ్రవాదులు కర్కశంగా గొంతు కోసిన 20మందిలో తమ కూతురు కూడా ఉందని తెలిసి నిశ్ఛేష్టుడయ్యాడు. కాగా, తమ సోదరిని ఒక హిందువుగా భావించి దారుణంగా చేసిన ఆ ప్రాంతంలో మేం అంత్యక్రియలు నిర్వహించబోమని, ఇండియాకు తీసుకొచ్చుకుంటామని ఆమె సోదరుడు చెప్పాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement