-
ఇన్చార్జ్లతో డిశ్చార్జ్
సాక్షి, తాండూరు: తాండూరు పురపాలక సంఘంలో పాలన స్తంభించింది. మున్సిపల్ కార్యాలయంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా మారాయి. అధికారులు లేకపోవడంతో ఇన్చార్జిల పెత్తనమే కొనసాగుతోంది. దీంతో పౌరసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుధ్యం క్షీణించి జనం రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత మున్సిపాలిటీని వేధిస్తోంది. తాండూరు మున్సిపల్ను ఆదర్శంగా నిలబెడతామని అధికారులు, ప్రజా ప్రతినిధుల అంటున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో సిబ్బంది అవినీతికి తెరలేపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయ నిర్వహణ పూర్తిగా స్తంభించింది. అందుకు కారణం కార్యాలయంలో కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మేనేజర్, రెవెన్యూ అ«ధికారుల వంటి కీలక పొస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయం పరిధిలో 160 మంది సిబ్బంది టౌన్ప్లానింగ్, శానిటరీ, రెవెన్యూ, ఇంజినీరింగ్, అడ్మిస్ట్రేషన్ సెక్షన్లతోపాటు పలు విభాగాలలో విధులను నిర్వహించేందుకు సిబ్బంది అవసరం కాగా కేవలం 60 మంది మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 100 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాండూరు ప్రజలకు మున్సిపల్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలన మున్సిపల్ కార్యాలయంలో 5 నెలలుగా ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్లు కొనసాగుతున్నారు. గతంలో పరిగి కమిషనర్ తేజిరెడ్డికి తాండూరు మున్సిపల్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పక్షం రోజుల క్రితం తేజిరెడ్డి స్థానంలో తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావుకు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. వేణుమాధవరావుకు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కార్యాలయంలో గడిపిన సందర్భాలు కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డిప్యూటేషన్పై వెళ్లిన పారిశుధ్య అధికారి తాండూరు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రంసింహారెడ్డి ఏడాదిన్నర క్రితం జహీరాబాద్కు డిప్యూటేషన్పై వెళ్లారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో నిత్యం పారిశుధ్య పనులను పర్యవేక్షించే శానిటరీ ఇన్స్పెక్టర్ లేక పోవడంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. ఎక్కడపడితే అక్కడ మురుగుమయంగా మారడంతో పాటు తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు. మురుగుతో కూడిన కలుషిత నీరు సరఫరా కావడంలో పట్టణ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షం రోజులుగా పట్టణంలోని ఆసుపత్రులలో జనాలు బారులు తీరుతున్నారు. తాండూరు డీఈఈకి 4 మున్సిపాలిటీల బాధ్యతలు తాండూరు మున్సిపల్ డీఈఈకి మూడు జిల్లాల్లోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్చార్జ్ బా ధ్యతలు అప్పగించారు. నాటి నుంచి తాండూరు మున్సిపల్కు ఉన్నతాధికారులు వచ్చిన సమ యంలో తప్ప మిగతా సమయంలో కనిపించిన దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇన్నాళ్లూ ఏం చేశారో?
చేతినిండా నిధులున్నా.. మురికి కూపాలుగా మారిన రోడ్లు కళ్లముందున్నా ఇన్నాళ్లూ వారికి పట్టలేదు.. ఏ అభివృద్ధి పనీ చేపట్టాలన్న ఆలోచనా రాలేదు.. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా కళ్లు తెరిచారు. మంత్రిగారి సూచనో, నిధులు వెనక్కి పోతాయన్న భయమో కానీ పనులు ప్రారంభించేయాలని నిర్ణయించారు. అవి పూర్తయినా, కాకపోయినా తర్వాత సంగతి.. ముందు అమాత్యుడితో కొబ్బరికాయ కొట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ తాండూరు మున్సిపాలిటీ అధికారుల తీరు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ప్రారంభింపజేసేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. నిధులున్నా ఇన్నాళ్లూ మిన్నకున్న అధికారులు తీరా నెల రోజుల గడువే ఉండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వివిధ పథకాల కింద మంజూరైన నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసిన అధికారులు పనుల శంకుస్థాపనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులకు కొబ్బరికాయలు కొట్టించేస్తే.. పనులు ఎప్పటికైనా పూర్తి చేయవచ్చనే ధోరణి వారిలో కన్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే జిల్లా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపనలు చేయించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల్లో మంత్రిని కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపనల తేదీలను ఖరారు చేయనున్నారు. బీఆర్జీఎఫ్, స్టేట్ఫైనాన్స్ కమీషన్(ఎస్ఎఫ్సీ), నాన్ప్లాన్గ్రాంట్ కింద గత ఏడాది నవంబర్లోనే సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. బీఆర్జీఎఫ్ కింద సుమారు రూ.36.6లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో తొమ్మిది పనులకుగాను మూడే మొదలయ్యాయి. ఇంకా ఆరు పనులు పెండింగ్లో ఉన్నాయి. రూ.1.74కోట్ల ఎస్ఎఫ్సీ నిధులతో 70 పనులు చేయాలి. ఇందులో రూ.34లక్షలతో 26 పనులు జరిగాయి. ఇంకా రూ.1.40కోట్లతో 40 పనులు చేయాల్సి ఉంది. రూ.30లక్షల నాన్ప్లాన్గ్రాంట్ కింద చేపట్టాల్సిన ఐదు పనులు మిగిలి ఉన్నాయి. ఆయా పనులకు మంత్రి ప్రసాద్కుమార్ చేతుల మీదుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే శంకుస్థాపనలు చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement