breaking news
sv university students
-
విద్యార్థినుల జీవితాలతో ఆటలా?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా): ఎస్వీ యూనివర్సిటీ హాస్టళ్లలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని వర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద హాస్టల్ సమస్యలపై పీజీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు.బుధవారం రాత్రి పాచిపోయి వాసన వస్తున్న చికెన్ విద్యార్థినులకు వడ్డించారని మండిపడ్డారు. నాసిరకం కూరగాయలతో ప్రతినిత్యం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, వాష్రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు సరిగాలేకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారన్నారు. ఒక్కోవిద్యార్థినీ నుంచి నెలకు రూ.3వేలకు పైగా మెస్ బిల్లు వసూలు చేస్తూ రోజూ పప్పునీళ్లే వడ్డిస్తున్నారని ఇన్చార్జి రిజిస్ట్రార్ చంద్రయ్యను నిలదీశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ రిజిస్ట్రార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. -
వికేంద్రీకరణకు తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు మద్దతు
-
చంద్రబాబుకు ప్రత్యేక హోదా సెగ
-
రేపు ఎస్వీయూ విద్యార్థులతో వైఎస్ జగన్ భేటీ
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశంకానున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సభకు అధికారులు అనుమతి నిరాకరించడంతో.. ఎయిర్ బైసాప్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ విద్యార్థులతో సమావేశమవుతారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్దిపై విద్యార్థులతో చర్చించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్జూర్ యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. తనపల్లి క్రాస్లోని పీఎల్ఆర్ గార్డెన్స్లో ఈ సదస్సు జరగనుంది.