breaking news
Sunil Gaikwad
-
ఆ ఇంటి పేరుంటే నేరమా?
న్యూఢిల్లీ: విమానాశ్రయంలో తనను పదేపదే అడ్డుకుంటున్నారని బీజేపీ ఎంపీ సునీల్ గైక్వాడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పేరు కారణంగానే ఎయిర్ పోర్టుల్లోని సెక్యురిటీ పాయింట్ల వద్ద తనను అడ్డుకుంటున్నారని వాపోయారు. తానొక ఎంపీనన్న సంగతి కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. గైక్వాడ్ అనే ఇంటిపేరు కలిగివుండడం నేరమా అని ప్రశ్నించారు. ఎయిరిండియా ఉద్యోగిపై శివసేన రవీంద్ర ఎంపీ గైక్వాడ్ దాడి చేయడంతో విమానయాన సంస్థలు ఆయన పేరును బ్లాక్ లిస్టులో పెట్టాయి. విమానాల్లో ప్రయాణించకుండా ఆయనపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో గైక్వాడ్ ఇంటిపేరు కలిగిన ఎంపీ సునీల్ కు తిప్పలు తప్పడం లేదు. -
పుణేలో నీటి కోతలు
పింప్రి, న్యూస్లైన్: రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో పుణే నగరానికి సరఫరా చేసే నీటిలో కోత విధించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. శనివారం నుంచి ఒక్కపూట మాత్రమే నీటిని సరఫరా చేయాలని సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. దీంతో అధికారికంగానే 12 శాతం కోత విధించనున్నారు. మేయర్ చ ంచలా కోద్రే అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో నీటి పొదుపుపై చర్చించారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో 1.93 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, భాష్పీభవనం తర్వాత 1.08 టీఎంసీలు మాత్రమే మిగిలే అవకాశముందని సంబంధిత అధికారులు తెలపడంతో వెంటనే నీటి కోతలను అమలు చేయాలని నిర్ణయించారు. గత సంవత్సరం ఇదే సమయంనాటికి 5.13 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీంతో ప్రజలకు సరిపడా నీటిని సరఫరా చేశారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ శుక్రవారం వరకు రోజుకు 1,250 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా నేటి నుంచి 1,100 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించడంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం 76 విభాగాల్లో 34 విభాగాలకు రోజుకు రెండు పూటలా నీటిని సరఫరా చేస్తుండగా నేటి నుంచి మాత్రం ఒకపూట మాత్రమే సరఫరా చేయనున్నారు. ఖడక్ వాస్లా, పాన్శేత్, వదస్గావ్, టేమ్ఘర్ ఈ నాలుగు రిజర్వాయర్ల నుండి జూలై 1వ తేదీ వరకు 17 టీఎంసీల నీరు వ్యవసాయ అవసరాలకు, 7 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు నీటిని నగర ప్రజలు పొదుపుగా వాడుకోవాలని, నీటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలను శుభ్రపరిచేందుకు మంచినీటిని వాడరాదని, నీటి దుర్వినియోగంపై కార్పొరేషన్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలోడిప్యూటీ మేయర్ సునీల్ గైక్వాడ్, స్థాయీసమితి అధ్యక్షులు బాపురావు కర్ణే, గురూజీ, సభాగృహనేత సుభాష్ జగతాప్, ప్రతిపక్షనేత అరవింద్ షిండే సభ్యులు వసంత్ మోరే, గణేష్ బోడ్కర్, లశోక్ హరణావాలా, నీటి సరఫరా విభాగ అధికారి వి.జి.కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.