breaking news
sundar vaddi
-
రాష్ట్రంలోనే అగ్రస్థానం
అనంతపురం సెంట్రల్ : పన్ను వసూలు, రిజిస్ర్టేషన్లలో ‘అనంత’ ఆర్టీఏ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్వద్దీ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... పన్ను వసూలులో గతేడాది కంటే 23.40 శాతం వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. ఏప్రిల్ 15 నుంచి నుంచి డిసెంబర్ 15 వరకూ మూడు త్రైమాసికాల్లో రాష్ర్టంలోనే జిల్లా ముందంజలో ఉందన్నారు. గతేడాది రూ. 85.39 కోట్లు వసూలు చేయగా ఈ ఏడాది రూ. 105.37 కోట్లు వసూలు సాధించినట్లు వివరించారు. వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం ద్వారా పన్నుల వసూలు చేయడం, జరిమానాలు విధించడం, వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలకు వేలం నిర్వహించడం తదితర అంశాలన్నీ వృద్ధి సాధించేందుకు ఆస్కారం కలిగింది. చివరి త్రైమాసికంలో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టి జిల్లాను నెంబర్వన్ స్థానంలో నిలుపుతామని ఆయన వివరించారు. -
రవాణా శాఖలో నేటి నుంచి ఆన్లైన్ సేవలు
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణా శాఖలో శనివారం నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్వద్ది తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు గుత్తిరోడ్డులోని దుర్గా ఆటోమోటివ్స్ నుంచి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు వివరించారు. నూతనంగా వాహనం కొనుగోలు చేసే వ్యక్తులు రిజిస్ట్రేషన్ మొత్తం డీలర్ నుంచి కానీ, నేరుగా ఆన్లైన్లో కానీ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.