breaking news
Space Research Institute
-
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
సూర్యచంద్రులపై పరిశోధనలు...
అంతర్జాతీయంగా భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సత్తా చాటుతోంది.. గ్రహాంతర ప్రయోగాల్లో దేశప్రతిష్టను ఇనుమడింపజేస్తోంది.. ఇప్పటికే చంద్రయాన్.. మంగళయాన్ పేరుతో చంద్రుడు.. అంగారకుడిపై పరిశోధనలు చేపట్టింది. అదే స్ఫూర్తితో మరో పర్యాయం చంద్రమండలం స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. అలాగే సూర్యునిపై వాతావరణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.. ఎల్వీఎం–3.. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ల ద్వారా విశిష్ట ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు సన్నద్ధమవుతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తిపతాకను అప్రతిహతంగా ఎగురవేసేందుకు అడుగులు వేస్తోంది. సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ మరోసారి ప్రత్యేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. సూర్యచంద్రులపై పరిశోధనలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టులోనే రెండు గ్రహాంతర ప్రయోగాలు విజయవంతం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. జులై 12న ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా 3,900 కిలోల బరువు కలిగిన చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శ్రీహరికోట షార్లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో ఎల్వీఎం–3 రాకెట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మే 28వ తేదీన చంద్రయాన్–3 మిషన్ కూడా బెంగళూరు నుంచి చేరుకుంది. షార్లోని క్లీన్రూంలో దీనికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రయాన్–2 మిషన్లో భాగంగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ను పంపించారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత రోవర్ను విడుదల చేసే విధంగా డిజైన్ చేశారు. చంద్రయాన్–3 ప్రయోగంలో ప్రపొల్సన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్ను చంద్రుడి వైపునకు పంపించబోతున్నారు. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేసేలా రూపకల్పన చేశారు. చంద్రుడి దక్షిణధ్రువంలో మెత్తగా వుండే స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ దించాలని నిర్ణయించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రయాన్–3 ప్రాజెక్టుకి సుమారు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు. పీఎస్ఎల్వీ ద్వారా ఆదిత్య ఎల్–1 సూర్యడిపై పరిశోధనలను చేసేందుకు 1,412 కిలోల ఆదిత్య ఎల్–1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్లోని మొదటి ప్రయోగవేదికకు సంబంఽధించి పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ భవనంలో రాకెట్ అనుసంధానం పనులు చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని జులై ఆఖరుకి కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిత్య ఎల్–1 దా్వారా సౌరగోళంలో గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలు చేయనున్నారు.. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు ఏర్పడే అవరోధాలు, కాంతి మండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. సౌర వాతావరణాన్ని పరిశోధించేందుకు కరోనాగ్రఫీ ప్రయోగమని కూడా అంటారు. భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్లు దూరంలో వున్న సూర్య వ్యవస్థ లాంగ్రేజ్ పాయింట్–1 (ఎల్–1) కక్ష్యలోకి ఆదిత్య ఎల్–1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి పరిశోధనలు చేపట్టనున్నారు. విద్యుదయస్కాంత, కణ, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్లను ఉపయోగించి ఫొటోస్పియర్, క్రోమో స్పియర్ సూర్యుని బయట పొరలను పరిశీలించేందుకు ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ను అమరుస్తున్నారు.సూర్యుడిపై పరిశోధనల్లో ఇది చారిత్రక ప్రయోగమవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.378 కోట్లు వెచ్చిస్తున్నారు. సత్తా చాటిన ఇస్రో గ్రహాంతర ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే సత్తా చాటింది. గతంలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 2008లో చంద్రయాన్–1, 2019లో చంద్రయాన్–2, 2013లో మంగళ్యాన్–1 పేరుతో విశేష పరిశోధనలు చేపట్టింది. మూడు గ్రహాంతర ప్రయోగాలు చేసిన ఇస్రో ఇప్పుడు ఏకంగా సూర్యు డిపైకి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని, చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి చంద్రయాన్–3 అనే రెండు ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్–1 ప్రయోగంతో లూనార్ ఆర్బిట్లో చంద్రుడి చుట్టూ ఉపగ్రహాన్ని తిప్పి చంద్రుడికి రెండోవైపు ఏముందో పరిశోధనలు చేసింది. అప్పుడే చంద్రుడిపై నీరు ఉన్నట్లు కనిపెట్టింది. చంద్రయాన్–2 పేరుతో మరో అడుగు ముందుకేసి చంద్రుడిపై ల్యాండర్, రోవర్ను దించేందుకు యత్నించింది. అయితే చివరి రెండు నిముషాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనడంతో ప్రయోగం విఫలమైంది. ఈ పర్యాయం విజయం సాధించేందుకు చంద్రయాన్–3లో భాగంగా మరోమారు ల్యాండర్, రోవర్ను చంద్రుడిపై దించేందుకు సంకల్పించింది. ఈ రెండు ప్రయోగాలు సక్సెస్ అయితే ఇస్రో ఖ్యాతి అంతర్జాతీయంగా మరింత ఇనుమడిస్తుందనడంతో సందేహం లేదు. -
అంతరిక్ష యుద్ధ తంత్రం
న్యూఢిల్లీ: అంతరిక్షయానంలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న భారత్, అంతరిక్ష యుద్ధతంత్రంలోనూ పైచేయి సాధించే దిశగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో యుద్ధాలు సాగించేందుకు అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్ఏ)ను ఏర్పాటు చేయనుంది. డీఎస్ఏకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఎస్ఆర్వో)ను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) అంతరిక్ష యుద్ధతంత్రానికి అవసరమైన అధునాతన యుద్ధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి డీఎస్ఆర్వో అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. డీఎస్ఏలో ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందంతోపాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. బెంగళూరు కేంద్రంగా ఎయిర్ వైస్ మార్షల్ అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇటీవల భారత్ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్ఆర్వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం. -
అంగారకుడిపైకి వన్ వే టికెట్!
శాస్త్రవేత్తల అంచనాలే తప్ప సాధారణ మనిషి ఊహకందని వాతావరణ పరిస్థితులు! గ్రహాంతరవాసులే ఉంటారో, బతుకు గమనమే మారిపోతుందో తెలీదు. అసలు అక్కడ అడుగుపెట్టడమైనా సాధ్యమవుతుందా అనేదే అతిపెద్ద అనుమానం! అయినా సరే, ‘అంగారకుడి పైకి వస్తారా?’ అని అడిగింది ఆలస్యం... ‘మేము రెడీ’ అంటూ... ఏకంగా రెండు లక్షల మంది ఉత్సాహవంతులు అప్లికేషన్లు వేశారు. తాము భూమిని విడిచి అరుణగ్ర హం రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని పేర్కొంటూ హామీ పత్రాలు రాసిచ్చారు. అంగారకుడి పైకి వన్ వే టికెట్ కొనుక్కోవడానికి అమితాసక్తి చూపించారు. సంగతేమంటే... డచ్కు చెందిన ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ 2016 కల్లా అంగారకుడి పైకి మనిషిని పంపడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందుకు సంబంధించి అంతరిక్ష నౌకలను సిద్ధం చేస్తున్న ఈ సంస్థ అందులో ప్రయాణించడానికి, భూమిని శాశ్వతంగా వదిలి అంగారకుడిపై సెటిలవ్వడానికి 24 మందిని సెలక్ట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం దర ఖాస్తులను ఆహ్వానిస్తే ఏకంగా రెండు లక్షలమంది నుంచి అవి వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ దరఖాస్తు దారుల్లో 165 దేశాలకు చెందినవారు ఉన్నారు. వీరిలోంచి అనేక దశలుగా, అనేక షరతులతో 24 మందిని సెలక్ట్ చేయడానికి ఆ సంస్థ రెడీ అవుతోంది. ఈ ‘మార్స్ మిషన్’ దరఖాస్తుదారులకు ఎలాంటి మిలటరీ ట్రైనింగ్ ఉండదని, వారికి ఫ్లయింగ్ విషయంలో ఎటువంటి అనుభవం లేకపోయినా పర్వాలేదని, కనీసం సైన్స్ డిగ్రీ కూడా అవసరం లేదని ఆ అంతరిక్ష సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే అభ్యర్థికి కనీసం వయసు 18 సంవత్సరాలని, అతడు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉండాలని తెలిపారు. క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఇంతకుమించి ప్రత్యేక నైపుణ్యాలేవీ కూడా అవసరం లేదన్నారు. భూమి తర్వాత మానవ ఆవాసానికి అరుణగ్రహం మీదే అంతో ఇంతో అనుకూలమైన పరిస్థితులున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి ఈ అరుణగ్రహ యాత్ర ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందనేది వేచి చూడవలసిన విషయం.