breaking news
SP gopinathjetti
-
ఆనందంగా వెళ్తున్నా.. బై బై
తిరుపతి: నూతనంగా ఏర్పడిన రాష్ట్రాల్లో హైటెక్ టెక్నాలజీ వినియోగంలో తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు కేంద్రాన్ని మొదటిస్థానంలో నిలిపినందుకు చాలా సంతోషంగా ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్జెట్టి తెలిపారు. అందుకు సహకరించిన ప్రజలకు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బదిలీపై వెళుతున్న ఎస్పీ గురువారం విలేకరులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించామని గుర్తుచేశారు. ట్రాఫిక్ నియంత్రణలో ‘రెడ్లైట్ వయోలేషన్ డిటెక్షన్’ వంటి ఆధునిక కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. నగరంలో ఏర్పాటుచేసిన పోలీస్ టాస్క్ఫోర్స్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. తాను పనిచేసిన 21 నెలల్లో కేవలం రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నారని, తనతో ఎలాగైతే సహకరించారో వచ్చే అధికారికి కూడా సహ కరించాలని సిబ్బందిని కోరారు. ఎస్పీని మీడియా సిబ్బందితో పాటు పలువురు అధికారులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. -
21 మంది విగ్రహాల దొంగలు అరెస్టు
మూడు వాహనాలు స్వాధీనం సూత్రధారి సస్పెన్షన్లో ఉన్న ఓ కానిస్టేబుల్ తిరుపతి క్రైం : ఈ నెల 21వ తేదీన ఏర్పేడు మండలం కోబాకలోని చెరువు కట్ట వద్ద ఉన్న పురాతన వినాయక విగ్రహాన్ని చోరీచేసేందుకు ప్రయత్నించిన ముఠా ను ఏర్పేడు సీఐ సాయినాథ్ అరెస్టు చేశారని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్జెట్టి తెలి పారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం మేరకు ఏర్పేడు సమీపంలోని ముసలి పేడు అటవీ ప్రాంతంలోని బత్తెనయ్య ఎస్టీకాలనీ వద్ద ముగ్గురు వ్య క్తులు అనుమానాస్పదంగా తిరుగుతుం డగా అదుపులోకి తీసుకున్నామని తెలిపా రు. విచారణలో వారు వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించిన దుండగులని తేలిందన్నారు. వారిచ్చిన సమాచారంతో మిగిలిని 18 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విగ్రహంలో వజ్రాలు ఉన్నాయని.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం హరి జనవాడకు చెందిన కంటేటి రవి హైదరాబాద్లోని యూసఫ్గూడ ఒకటవ బెటాలియన్లో కానిస్టేబుల్ (పీసీనెం.669)గా పనిచేసేవాడు. తన తాత, తండ్రుల ద్వా రా గుప్తనిధుల గురించి సమాచారం తెలుసుకున్నాడు. అలాగే విగ్రహాలను చోరీ చేసేందుకు మంత్రతంత్రాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెం దిన నరసారావు, మంగపట్ల వెంకటేశ్వరరావు, పలుపులాజరు కలిసి రవి వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని సా యం చేయాలని కోరారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రవి వారితో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కోబాకలోని చెరువుకట్ట వద్ద కుడివైపు తొండం కలిగి ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ఉంద న్నాడు. దాని వెనుక తామరపుప్వు ఆకారంలో మూతలాగా ఉంటుందని, అందు లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయని తెలిపాడు. దాన్ని తెస్తే విక్రయించి వచ్చిన మొత్తాన్ని పంచుకుందామని ప్రోత్సహించాడు. మొదటి సారి విఫలం విగ్రహాన్ని చోరీ చేయడానికి నరసింహా రావు, వెంకటేశ్వరరావు, మరికొంతమంది ముఠా సభ్యులతో కలిసి కోబాకలోని వినాయక విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రణాళి క సిద్ధం చేసుకున్నారు. జనవరి 30న గునపాలతో పెళ్లగించి చోరీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తాడు తెగి శబ్దం రావడంతో వెలుగులోకి.. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో అర్దరాత్రి టిప్పర్, టవేరా, క్వాలిస్కారు, మోటార్ సైకిల్పై 22 మంది వచ్చారు. వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రయత్నించారు. విగ్రహానికి తాడు కట్టి టిప్పర్తో లాగేందుకు ప్రయత్నించారు. ఆ తాడు తెగి పెద్దగా శబ్దం రావడంతో గ్రామస్తులు మేల్కొని గుడి వద్దకు వచ్చారు. ముఠాలోని వారు ఇనుపరాడ్లు, పైపులతో గ్రామస్తులను బెదిరించి వాహనంలో పరారయ్యారు. కోబాకకు చెందిన భరత్కుమార్ ఫిర్యాదు మేరకు ఏర్పేడు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని రేణిగుంట రూరల్ సీఐ సాయిరాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. దుండగులను శనివా రం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం, టిప్పర్, టవేరా, నాలుగు సెల్ఫోన్లు, ఇనుపపైపులు, రాడ్లను స్వాధీ నం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రవి పోలీసు కానిస్టేబుల్గా కొన్ని చోరీలు చేశాడని, పోలీసు అధికారులపై దాడిచేసి సస్పెం డ్ అయ్యాడన్నారు. రవి, మరొక నిందితుడు ఏడుకొండలును అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్బీ డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బం దిని ఎస్పీ అభినందించారు. -
లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ
లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ కొట్టే యత్నం అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్తో రూ. కోటి సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యే ఆపై, హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆరా నగదు కోసం వ్యూహరచన చేశారని నిర్ధారణ మాటువేసి నిందితుల్నిపట్టుకున్న పోలీసుల రహస్య ప్రాంతంలో విచారణ తిరుపతి సిటీ : ముఖ్యమంత్రి నారాచంద్రబాబు తనయుడు లోకేష్ పీఏ విజయ్నంటూ ఓ అజ్ఞాన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు మంగళవారం ఫోన్ చేసినట్లు సమాచారం. తనకు చెందిన మనుషులు వస్తారని, వారి చేత కోటి రూపాయలు ఇచ్చి పంపిం చాలని ఎమ్మెల్యేకు ఫోన్లో విజయ్ పేరుతో కోరినట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తి సీఎం సతీమణి భువనేశ్వరి పేరును కూడా వాడుకున్నట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు సంజయ్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయానికి ఫోన్చేసి ఆరా తీశారు. ఆ పేరుగల వ్యక్తి ఎవరూలేరని అక్కడి నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే అర్బన్ ఎస్పీ గోపినాథ్జెట్టికి ఫిర్యాదు చేశారు. ఇంతలోపు మళ్లీ విజయ్ పేరుతో ఫోన్కాల్ రావడంతో డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సుగుణమ్మ అంగీకరించినట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెస్టు పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద మాటు వేసి రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఇంతలోపే శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. నగదు బ్యాగ్లు ఇస్తుండగా వెస్టు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు వినియోగించిన కారును సీజ్ చేసి, నిందితులను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.