breaking news
to solve problems
-
అధికారుల్లో గుబులు
పొలంబడి, స్వచ్ఛ భారత్పై అవగాహన కార్డులు, పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ మండలానికి రెండు బందాలు రోజుకో గ్రామంలో సమావేశం గామాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. రోజుకో కొత్త బూటకపు హామీతో రోజులను నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. రేషన్సరుకులు ఇవ్వడం లేదు. దీనికి తోడు ఆధార్కార్డును అన్ని సంక్షేమ పథకాలు లింకు పెట్టి లబ్ధిదారుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్కార్డుల నుంచి రుణమాఫీ వరకు అన్ని పథకాల్లోకు సవాలక్ష ఆంక్షలు పెడుతూ లబ్ధిదారులను కుదిస్తూ వస్తోంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈమేరకు జనం ఎక్కడ నిలదీస్తారోనన్న గుబులు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రైతు, డ్వాక్రా రుణ మాఫీలకు సంబంధించి రైతులు, మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు రుణాలు రద్దు చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాక హామీలను నెరవేర్చకపోవడం, కనీసం కొత్త రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో గ్రామాలకు అధికారులు వెళ్లిన ప్రతీ సందర్భంలోను రుణమాఫీపై రైతులు నిలదీస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఆదర్శరైతు వ్యవస్థ రద్దుతో వారు ఉద్యమ బాట పట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తే రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై నిలదీస్తే ఏమి చెప్పాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
ఆందోళన బాట
చిత్తూరు (సిటీ), న్యూస్లైన్: సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని దస్తావేజు లేఖకులు ఆందోళన ఉద్ధృతం చేయనున్నారు. రాష్ర్ట సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇది కార్యరూపం దాల్చితే చిత్తూరు, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, వాటి పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి. దస్తావేజు రిజిస్ట్రేషన్లు, సొసైటీ రెన్యూవల్స్, ఈసీలు, నకళ్లు, 10-1 అడంగళ్ల మంజూరును రిజిస్ట్రారు కార్యాలయం నుంచి మీ-సేవ కార్యాలయాలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో సంబంధిత రిజిస్ట్రారు కార్యాలయాలను నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుబండి లాగిస్తున్న సుమారు 900 మంది దస్తావేజు లేఖకులు ఉపాధి పోనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ లేఖకులు పలుమార్లు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు గురువారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి! దస్తావేజు లేఖకులు సమ్మెలోకి వెళితే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. చిత్తూ రు, తిరుపతి జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు, వాటి పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రోజుకు దాదాపు * 40 లక్షల వరకు ఆదాయం తగ్గిపోనుంది. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి రాబడి పడిపోయింది. ఈ సమయంలో దస్తావేజు లేఖకుల సమ్మె మొదలైతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేయండి జిల్లాలో గురువారం నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని చిత్తూరు రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకరనారాయణ, రవి విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవ ఆమోదం చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో బుధవారం దస్తావేజు లేఖకుల సమావేశం నిర్వహించారు. నిరవధిక సమ్మెపై ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్యులు, దస్తావేలు లేఖకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె సాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 25 మంది దస్తావేజు లేఖకులు, 20 మంది డీటీపీ ఆపరేటర్లు, 10 మంది ఫొటోగ్రాఫర్లు, 20 మంది సహాయకులు పాల్గొన్నారు.