breaking news
Skeletal Anatomy
-
పాడుబడ్డ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు అస్థిపంజరాలు
బెంగళూరు: కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదు అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా స్థానిక సమాచారం. కుటుంబం ఒంటరిగా ఉండేదని, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండేవారని బంధువులు పోలీసులకు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు చివరిగా జూలై 2019లో కనిపించారు. అప్పటి నుంచి వారి నివాసం తాళం వేసి ఉంది. ఇంటి ప్రధాన గుమ్మం తలుపు పగిలిపోయి ఉండటాన్ని సుమారు రెండు నెలల క్రితం స్థానికులు గుర్తించారు. అయినప్పటికీ వారు పోలీసులకు సమాచారం అందించలేదు. బాధిత ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు.. ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు (మంచాలపై రెండు, నేలపై రెండు), వేరే గదిలో మరో అస్థిపంజరం కనిపించాయి. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (ఎస్ఓసిఓలు) సాక్ష్యాలను సేకరించారు. ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు. ఇదీ చదవండి: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ -
త్రీడీలో ‘డోడో’
లండన్: అంతరించిపోయిన డోడో అనే పక్షి అస్థిపంజరం నిర్మాణాన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు త్రీడీ అట్లాస్ను ఆవిష్కరించారు. శతాబ్దానికిపై పైగా అధ్యయనం చేయకుండా మిగిలిపోయిన రెండు డోడోల అస్థిపంజరాల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీని కోసం ఐదేళ్ల పాటు శ్రమించగా ఈ అట్లాస్ తయారైంది. మానవ కార్యకలాపాల వల్ల అంతరించి పోయిన జాతులకు డోడో పక్షి మంచి ఉదాహరణ. ఎగరలేని పావురం జాతికి చెందిన ఈ పక్షి ఎముకలపై చాలా వివరాలు అట్లాస్లో ఉన్నాయి. పేలియోబయాలజీలో పరిశోధనలకు ఈ అట్లాస్ పనికొస్తుందని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన జులియన్ హూమ్ చెప్పారు.