breaking news
	
		
	
  Shooting Tourney
- 
      
                   
                                                     
                   
            ISSF World Cup: ఎట్టకేలకు భారత్ బోణీ.. స్వర్ణం గెలిచిన ఇషా
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISFF) తాజా సీజన్లోని చివరి ప్రపంచకప్లో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సత్తా చాటింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో భారత్కు తొలి మెడల్ అందించింది. కాగా చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో తొలి నాలుగు రోజుల్లో భారత్ కనీసం ఒక్క కాంస్య పతకం కూడా నెగ్గలేకపోయింది.వైఫల్యాల పరంపరషూటింగ్ ఈవెంట్లో ఇన్ని రోజులైనా కూడా భారత్ బోణీ కొట్టలేకపోవడం బహుశా ఇటీవల ఇదే తొలిసారి!.. పురుషులు, మహిళల ఈవెంట్లలో శుక్రవారం వరకు వరుస వైఫల్యాల పరంపర కొనసాగింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మెహులీ ఘోష్, మానిని కౌశిక్ అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. 2023లో బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన మెహులీ క్వాలిఫయింగ్లో 583 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచింది.ఇక మానిని 580 పాయింట్లతో 45వ స్థానానికి పరిమితమైనింది. తెలంగాణకు చెందిన మరో షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ 578 పాయింట్లతో ఏకంగా 52వ స్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ భవేశ్ షెకావత్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు.ఇషాకు ఇదే తొలి స్వర్ణంఈ క్రమంలో భారత్ ఆశలన్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడే రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్, సురభి రావులపై నిలవగా.. 20 ఏళ్ల ఇషా శనివారం పసిడి పతకం గెలిచింది. నింగ్బో స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన పోటీ ఫైనల్లో యావో కియాంగ్జున్ (చైనా)ను 0.1 పాయింట్ తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక ఒలింపిక్ చాంపియన్ ఓ యెజిన్ (సౌత్ కొరియా) కాంస్యం దక్కించుకుంది.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఇషాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక ఈ తెలంగాణ షూటర్ గెలుపుతో.. ఈ ఈవెంట్లో బోణీ కొట్టిన భారత్ పతకాల పట్టికలో ఎట్టకేలకు చోటు సంపాదించింది. ప్రస్తుతానికి ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆతిథ్య దేశం చైనా రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.చదవండి: బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి! - 
      
                   
                               
                   
            అంజుమ్ మౌద్గిల్కి కాంస్య పతకం
కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సంజీవ్ రాజ్పుత్లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 12–16తో చెక్ రిపబ్లిక్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Zouhaier Sghaier wrestling: భారత రెజ్లర్ల పసిడి పట్టు - 
      
                   
                               
                   
            టోక్యో ఒలింపిక్స్కు భారత షూటింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్లు సంపాదించారు. అయితే ఎన్ఆర్ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్ అనేది దేశానికి చెందుతుందికానీ అర్హత సాధించిన షూటర్కు కాదు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత పొందకపోయినా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, తమిళనాడు షూటర్ ఇలవేనిల్ వలారివన్కు టోక్యోలో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఎన్ఆర్ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. ఇక 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో టోక్యో బెర్త్ సాధిం చిన చింకీ యాదవ్ను కాదని మనూ భాకర్కు అవకాశం ఇచ్చారు. చింకీని రిజర్వ్గా ఎంపిక చేశారు. పురుషుల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాంశ్, దీపక్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: సంజీవ్ రాజ్పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరభ్ చౌధరీ, అభిషేక్ వర్మ. స్కీట్ ఈవెంట్: అంగద్వీర్, మేరాజ్ అహ్మద్ఖాన్. మహిళల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వీ, ఇలవేనిల్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: అంజుమ్, తేజస్విని. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశస్విని. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్: రాహీ, మనూ. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్: దివ్యాంశ్, ఇలవేనిల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్: సౌరభ్, మనూ భాకర్. - 
      
                   
                               
                   
            తెలంగాణ రాష్ట్ర షూటింగ్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్షిప్ సోమవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్లో తెలంగాణ రాష్ట్ర రైఫిల్ సంఘం (టీఎస్ఆర్ఏ) అడ్మినిస్ట్రేటర్ అలెగ్జాండర్ ఫ్రాన్సిస్ ఈ పోటీలను ప్రారంభించారు. దాదాపు 700లకు పైగా షూటర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రి–నేషనల్స్ చాంపియన్షిప్కు క్వాలిఫయింగ్ టోర్నీగా నిర్వహిస్తోన్న ఈ పోటీలు శనివారంతో ముగుస్తాయి. సోమవారం 10మీ. ఎయిర్ రైఫిల్, పిస్టల్, 25మీ. పిస్టల్, 50మీ. రైఫిల్, పిస్టల్, షాట్గన్ ఈవెంట్లలో క్రీడాకారులకు ప్రాక్టీస్ సెషన్ జరిగింది. నేటి నుంచి శనివారం వరకు మెయిన్ డ్రా పోటీలను నిర్వహిస్తారు. 


