-
రెండ్రోజుల్లో ప్రకటిస్తా: ఉద్ధవ్
ముంబై: వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన–బీజేపీ కలిసే పోటీ చేస్తాయని శివసేన చీఫ్ ఉద్ధవ్ఠాక్రే స్పష్టం చేశారు. ఎవరికెన్ని సీట్లనేది రెండ్రోజులు ప్రకటిస్తామని శుక్రవారం ఆయన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల ముందే సీట్ల పంపకాలపై నిర్ణయించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఎవరికెన్ని సీట్లనేది ప్రకటిస్తామని చెప్పారు. ‘రెండు పార్టీలు చెరో 135 సీట్లలో పోటీచేస్తాయనేది మీడియానే ప్రచారం చేస్తోంది..’అని వ్యాఖ్యానించారు. అనంతరం శివసేన కార్యదర్శి అనిల్ దేశాయి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న బీజేపీ చీఫ్ అమిత్ షా ముంబై పర్యటన ఉన్న నేపథ్యంలో ఆలోపే సీట్ల పంపకాల గురించి ప్రకటిస్తామని చెప్పారు. శివసేన–126, బీజేపీ–162 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరి యాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు నేడు లేదా రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నా యని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే దీపావళి(అక్టోబర్ 27వ తేదీ)కి ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణాలతో పాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీల కు కూడా ఎన్నికలు జరిపే యోచనలోనూ ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. -
నేల వీడి సాము వద్దు
ముంబై: ఉప ఎన్నికల ఫలితాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని శివసేన తన భాగస్వామ్యపక్షమైన బీజేపీకి హితవు చెప్పింది. ఉప ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బలను చూసైనా కాళ్లు నేలపై మోపాలని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పలితాలు ఎదురైన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో తన సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. దీనిపై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడింది. ఈ ఫలితాలు ఆశ్చర్యకరం, ఊహించని షాక్ అని పేర్కొంది.‘ప్రజలను తేలికగా తీసుకోవద్దు. ఈ ఫలితాలు అందరికీ ఓ గుణపాఠం కావాలి. ఓటర్ల మనస్సు చంచలమైనది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం. లోక్సభ ఎన్నికల్లో లభించిన విజయంతో గాలిలో ఎగరకండి. నేల విడిచి సాము చేస్తే.. ఫలితాలు ఇలాగే ఉంటాయి.. ఇకనైనా కాళ్లు నేలపై మోపండి లేదా ప్రజలు చమ్డాలు వలిచేస్తా రు’ అంటూ ఘాటుగా విమర్శించింది. ఈ గుణపాఠం నేర్చుకున్న వారే మహారాష్ట్రలో గెలుపొందుతారని, లేదా ప్రజలే ఆ గుణపాఠం నేర్పుతారని హితవు పలికింది. బీజేపీకి గట్టి పట్టున్న ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలోనే ఆ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 23 సీట్లలో బీజేపీ 13 స్థానాలను తన ప్రత్యర్థులకు కోల్పోయింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఆశ్చర్యకరమైన విజయాలను నమోదు చేసింది. ఉప ఎన్నికల ఫలితాలను మోడీ హవాతో ముడిపెట్టకూడదని సామ్నా పేర్కొంది. సార్వత్రిక, రాష్ట్రస్థాయి ఎన్నికలకు తేడా ఉంటుందని తెలిపింది. స్వామీ ఆదిత్యనాథ్ ‘లవ్ జీహాద్’ అంశాన్ని లేవనెత్తారని, కానీ ఆ ప్రభావం ఉప ఎన్నికలపై పడలేదని సామ్నా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ సాధించిన విజయాలకు సోనియా లేదా రాహుల్ గాంధీలను ఎవరూ బాధ్యులు చేయడం లేదని, అలాగే ఇది మోడీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని కూడా నిర్ధారించకూడదని పేర్కొంది. వచ్చేనెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను డిమాండ్ చేస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకే శివసేన తన అధికార పత్రికలో ఈ విధంగా విరుచుకుపడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. త్వరగా తేల్చండి: ఎస్సెస్సెస్ ముంబై : ప్రతిపక్ష కూటమి ‘మహాయుతి’లో సీట్ల పంపకాలపై ఒక ఒప్పందం కుదరకపోవడం పట్ల స్వాభిమానీ షేట్కారీ సంఘటన్ అసహనం వ్యక్తం చేసింది. సీట్ల పంపకంపై శివసేన, బీజేపీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలని సంఘటన్ నాయకుడు రాజుశెట్టి కోరారు. ఒప్పందం ఖరారులో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను బీజేపీ విరమరించాలని ఆయనసూచించారు. సీట్ల పంపకంపై సేన, బీజేపీల మధ్య చర్చలు వేగవంతం చేయాలని ఆర్పీ నాయకుడు రాందాస్ ఆఠవలే కోరారు. ఆయన బుధవారం సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకుని తమకు 13 సీట్లు కావాలని కోరారు. రాష్ట్ర ప్రజలు మహాయుతి వైపు చూస్తున్నారని ఆఠవలే పేర్కొన్నారు. అందువల్ల త్వరగా సీట్ల పంపకాన్ని పూర్తి చేసుకొని ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సీట్ల సంఖ్యపై బీజేపీ మొండి పట్టుదలకు పోతూ పొత్తుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆఠవలె ఆరోపించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement