-
షేక్స్పియర్ నోట అన్నమయ్య పాట
తెలుగునాట తాళ్లపాక గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించిన అన్నమాచార్యులు సంస్కృతాంధ్ర భాషల్లో రచించిన వేల పదకవితలు పండితులను, పామరులను రంజింపజేశాయి. తత్త్వసంకీర్తనలు గానం చేస్తూ, తంబురమీటుతూ పురవీధులలో, తిరువీధులలో నాట్యం చేశాడు అన్నమయ్య. ఆనాటి వేద వాఙ్మయం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు అన్ని ప్రక్రియల్లో కనిపించే మానవతాధర్మాలు అన్నమయ్య పదాలలో గమనించవచ్చు. ‘నానాటి బతుకు నాటకము/ కానక కన్నది కైవల్యము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్టనడిమి పని నాటకము/ యెట్ట నెదుట గల దీ ప్రపంచము/ కట్ట గడపటిది కైవల్యము/ కుడిచే దన్నము కోక చుట్టెడిది/ నడ మంత్రపు పని నాటకము/ వొడి గట్టుకొనిన వుభయ కర్మములు/ గడి దాటినపుడె కైవల్యము/ తెగదు పాపము తీరదు పుణ్యము/ నగి నగి కాలము నాటకము/ యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక/ గగనము మీదిది కైవల్యము’ అన్నాడు అన్నమయ్య. ఎదుట కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలం, దానిపై మానవుల అశాశ్వతమైన బతుకు నాటకమేనని ఉద్బోధించాడు. మనిషి పుట్టడం నిజం, మరణించడం నిజం, ఈ మధ్య జరుగుతున్న బతుకు కేవలం నాటకం; ఈ జనన మరణచక్రం ఎక్కడ ఆగుతుందో అదే కైవల్యము అన్నాడు. అన్నమయ్య తదనంతరం 16వ శతాబ్దిలో బ్రిటన్లో జన్మించిన షేక్స్పియర్ నటుడిగా, నాటకకర్తగా, కవిగా ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచాడు. ఆయన నాటకాల్లో ‘యాజ్ యు లైక్ ఇట్’ ఒకటి. ఇందులో ప్రేమకథను సుఖాంతంగా చిత్రించాడు. మానవ జీవితాంకాలు దశలుగా విభజించి నాటక రంగంలోని పాత్రలవలె మనిషి ఎలా జీవిస్తాడో షేక్స్పియర్ ఇందులో చెబుతాడు. The whole world is a stage, and all the men and women merely actors. They have their exits and their entrances, and in his lifetime a man will play many parts... ప్రపంచమంతా ఒక నాటక రంగం. స్త్రీ పురుషులందరూ అందులో కేవలం పాత్రధారులు. వారి వారి ప్రవేశాలు, నిష్క్రమణలు వారికుంటాయి. ఒక మనిషి తన జీవితకాలంలో అనేక పాత్రల్ని పోషిస్తాడు’ అంటాడు షేక్స్పియర్. భగవంతుడు ఈ అఖండ విశ్వాన్ని రంగస్థలముగా చేసి, అందులో మానవులకు వారి కర్మలనుబట్టి పాత్రలను కల్పించి, పావులుగా కదుపుతూ వారి జీవితాలతో ఆడుతున్న వింత నాటకమే ఈ జగన్నాటకం అని ఇద్దరు మహాకవులూ విశదపరిచారు. విభిన్న దేశాలలో, విభిన్న కాలాలలో జీవించినప్పటికీ, వారి భాషలు వేరైనప్పటికీ వారి భావమొక్కటే. వీరిద్దరి పద, పద్య పాదాలను పరిశీలిస్తే అన్నమయ్య తెలుగుపాటే షేక్స్పియర్ కవితగా మారిందా అనిపిస్తుంది. -యానాద్రి 97018 57260 -
‘షేక్’ చేస్తోన్న శశి థరూర్
ఫేస్యాప్లు వచ్చాక సెలబ్రెటీల ఫోటోలు మార్ఫింగ్ చేయడం ఫ్యాషన్ అయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫోటోను ప్రసిద్ధ ఇంగ్లీష్ నాటక రచయిత షేక్స్పియర్లా గుర్తుతెలియని వ్యక్తి మార్ఫింగ్ చేశారు. ఇది వాట్సాప్లో చక్కర్లు కొడుతూ శశిథరూర్కు చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే శశిథరూర్ ఆ ఫోటోను తాజాగా ట్విటర్లో షేర్ చేసి దానిపై ఓ ఫన్నీ కామెంట్ పెట్టారు. ‘ఈ రోజు వాట్సాప్లో చాలా ప్రశంసనీయమైన చిత్రం చూశాను. నన్ను షేక్స్పియర్లా మార్చాలని చూడటంపై ఆశ్చర్యపోయాను. అయితే అలా మార్చడానికి కాస్త ఇబ్బంది పడినట్లున్నారు. నేను ఆ గౌరవానికి అర్హుడిని కానప్పటికీ.. ఎవరైతే మార్ఫింగ్ చేశారో వారికి ధన్యవాదాలు..’ అని ట్వీట్ చేశారు. శశిథరూర్ ట్వీట్తో ఈ ఫోటో మరింత వైరల్ అయి నెటిజన్ల కామెంట్లకు వేదిక అయింది. శశిథరూర్ అంటేనే చెలరేగే కొందరు ఈ ఫోటోపై ఓ రేంజ్లో విజృంభిస్తున్నారు. మరికొందరు శశిథరూర్ను సమర్థిస్తూ ఆ ఫోటోకు పూర్తి అర్హత ఉందంటున్నారు. ఓ నెటిజన్ ‘మీసాలు లేని షేక్స్పియర్ అనుకుంటున్నావా? అంతలేదు నువ్వు షేక్స్పియరుద్దీన్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ‘మీరు షేక్స్పియర్ కన్నా విలువైన వారు, గొప్ప రచయిత, రాజకీయవేత్త, మంచి మార్గ నిర్దేశకులు, మీ ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ కామెంట్లతో శశి థరూర్ని ఆకాశానికి ఎత్తేశాడు. -
జూలియస్ సీజర్
ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం షేక్స్పియర్ రాసిన చారిత్రక విషాదాంత నాటకం ‘జూలియస్ సీజర్’ నేటికీ ప్రదర్శితమవుతోంది. పాత్రల స్వరూప స్వభావాలను లోతుగా అధ్యయనం చేసి బరువైన సంభాషణలతో ఈ నాటకం రాశారు షేక్స్పియర్. సీజర్ గొప్ప వీరుడు. రోమ్ సైన్యాధిపతిగా ఉన్న సీజర్ ఓసారి ఆఫ్రికా నుంచి రోమ్ నగరానికి విజయగర్వంతో వస్తాడు. మార్గమధ్యంలో ఓ జ్యోతిష్కుడు ఎదురై ‘మార్చి 15వ తేదీ వస్తోంది, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు. మూఢనమ్మకాలంటే గిట్టని సీజర్ ఆ మాటల్ని కొట్టేస్తాడు. సీజర్ బలపడుతున్నాడనీ, నియంతగా మారతాడనీ, గణతంత్రానికి గండి పడుతుందనీ భయపడిన వాళ్లలో బ్రూటస్ ఒకడు. రోమ్ నగర పెద్దలలో ఒకడైన కేషియస్... బ్రూటస్ను కలిసి సీజర్ను హతమార్చడమే తక్షణ కర్తవ్యమని బ్రూటస్ను సన్నద్ధం చేస్తాడు. మానవ స్వభావాన్ని అవపోసన పట్టిన సీజర్ ఓసారి బ్రూటస్ పక్కనే వున్న కేషియస్ను చూస్తాడు. తనకు ఆప్తుడైన ఆంటోనీతో ‘ఆ కేషియస్ను చూశావా? బక్కపలుచని శరీరం ఉన్నవాళ్లు, ఆకలిచూపుల వాళ్లు, ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుండేవాళ్లు, నవ్వలేనివాళ్లు, సంగీతాన్ని మెచ్చుకోలేనివాళ్లు ఎంతో ప్రమాదకరమైనవాళ్లు’ అంటాడు.సీజర్ హత్య జరగబోయే ముందురోజు రాత్రి అతని భార్య కాల్ఫూర్నియా ఓ పీడకల కంటుంది. సీజర్ను హత్య చేస్తున్నారు అని మూడుసార్లు బిగ్గరగా అరుస్తుంది. సెనేట్ సమావేశానికి గైర్హాజరు కమ్మని విన్నవిస్తుంది. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారే చవిచూస్తారు. ప్రమాదం కంటే సీజర్ ప్రమాదకారి’ అంటూ సీజర్ జవాబిస్తాడు. సీజర్ సెనేట్ మందిరానికి వెళ్తాడు. కుట్రదారులు కత్తితో పొడుస్తారు. బ్రూటస్ది చివరి కత్తిపోటు. ‘బ్రూటస్ నువ్వు కూడానా’ అంటూ సీజర్ ప్రాణాలు విడుస్తాడు. సీజర్ అంత్యక్రియలకు ముందు ఓ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బ్రూటస్, సీజర్పై నాకు ద్వేషం లేదు, అతనికి అధికార కాంక్ష పెరిగింది, ఆయన బతికివుంటే నియంతగా మారతాడు, మీరంతా బానిసలు అవుతారని వివరిస్తాడు. ఇంతలో ఆంటోనీ, సీజర్ పార్థివదేహాన్ని తీసుకొని వస్తాడు. ‘సీజర్కు మూడు సార్లు కిరీటం ఇచ్చినా తిరస్కరించాడు. ఇదేనా సీజర్ అధికార దాహం’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. నేను బ్రూటస్వంటి మాటకారినైతే సీజర్ గాయాలతో మాట్లాడించగలను, రోమ్ రాళ్లతో ప్రతిఘటించగలను అంటాడు. మేం తిరగబడతాం, అంటూ మృతదేహం వద్ద గుమికూడిన ప్రజలు గర్జిస్తారు. ఇదిలావుండగా ఆంటోనీ బలపరాయణుడని గుర్తించిన బ్రూటస్ భార్య పోర్షియా నిప్పులు మింగి చనిపోతుంది. తర్వాత ఆంటోనీ, బ్రూటస్ వర్గాల మధ్య పోరు సాగుతుంది. సీజర్ను పొడిచిన కత్తితోనే నౌకరు చేత పొడిపించుకుని కేషియస్ చనిపోతాడు. బ్రూటస్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోతాడు. అంతిమ విజయం ఆంటోనీ, అతని మిత్రుడు ఆక్టేవియస్ సీజర్ను వరిస్తుంది. ఆక్టేవియస్ రోమన్ సామ్రాజ్యాధిపతి అవుతాడు. గగుర్పాటు కలిగించే విధంగా అన్ని పాత్రలనూ తన శైలీ సంభాషణలతో షేక్స్పియర్ తీర్చిదిద్దిన నాటకం ఇది. వాండ్రంగి కొండలరావు -
ఆ హక్కును కోల్పోయిన బిగ్ బీ
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్కు రీల్ లైఫ్లోనే కాదు నిజ జీవితంలోనూ కోపం వచ్చింది. ట్విటర్ను వేదికగా చేసుకుని ఆ కోపాన్ని ప్రదర్శించారు. ఇంతకు బిగ్ బీకి అంత కోపం తెప్పించిన అంశం ఏంటంటే ఆయన తండ్రి ప్రముఖ రచయిత హరివంశరాయ్ బచ్చన్ రచనల మీద 1957 కాపీ హక్కుల చట్టం మేరకు అమితాబ్కు ఉన్న హక్కులను కోల్పోనున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన అనంతరం ఆ వ్యక్తి రచనల మీద అతని వారసులకు కేవలం 60 ఏళ్ల వరకే హక్కులు ఉంటాయి. తర్వాత ఆ రచనలను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో అమితాబ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 60 ఏళ్లే వారసులకు హక్కులు ఉంటాయని ఎవరూ నిర్ణయించారు. అయినా 60 ఏళ్లే ఎందుకు ఉండాలి, 61 ఏళ్లనో, శాశ్వతంగానో ఎందుకు ఉండకూడదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ‘కాపీ హక్కు చట్టాలను చెత్తగా వర్ణిస్తూ అసలూ ఈ మేథోపరమైన హక్కులను ఎవరూ నిర్ణయించారు. నా తండ్రికి నేను వారసున్ని, ఆయన రచనల మీద కూడా నాకే పూర్తి హక్కు ఉంటుంది. నా తండ్రి మరణించి 60 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి ఇంక నాకు హక్కు లేదంటే ఎలా కుదురుతుంది. ఇప్పుడు ఎవరైనా వారి అవసరాలకోసం నా తండ్రి సాహిత్యాన్ని వారి ఇష్టారీతిగా ఉపయోగించుకోవచ్చా? అలా ఎప్పటికి జరగదు. విలియం షేక్స్పియర్, మిస్టర్ బీథోవెన్, మెస్సర్స్ చోపిన్, చైకోవ్స్కీ మన దేశానికి వస్తే గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్... వీళ్లేవరికి ఈ కాపీరైట్ హక్కు గురించి తెలియదు. వారి రచనలకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవు. అందువల్ల వారి రచనలను అందరూ వాడుకుంటున్నారు. దానివల్ల వారి నిజమైన వారసులకు నష్టం కలుగుతోంది. నేను మాత్రం ఈ విషయం మీద పోరాడతాను’ అంటూ ముగించారు. హరివంశరాయ్ బచ్చన్ రచనల్లో మధుశాల, అగ్నిపత్, రుకే నా తు, హిమ్మత్ కర్నే వాలోంకి హర్ నహీ హోతి వంటివి కొన్ని ప్రముఖమైనవి. -
షేక్స్పియర్ రచనల్లో మహిళల పాత్ర
భీమవరం: షేక్స్పియర్ రచనల్లో మహిళల పాత్రలు ఎంతో ప్రభావవంతమైనవి అందువల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ షేక్స్పియర్ రచనలు తప్పనిసరిగా చదవాలని శాతివాహన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ భాస్కరరావు అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన షేక్స్పియర్ రచనలపై జాతీయస్థాయిలో సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా సావనీర్ను విడుదల చేశారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సనత్కుమార్ అధ్యక్షత వహించగా పాలకొల్లు దాసరి నారాయణరావు‡ కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, గుంటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకురాలు డాక్టర్ వరలక్ష్మి, అక్కిరాజు, రవిశంకర్, స్వరూప, శ్రీలక్ష్మి, పార్వతి, మోజేస్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement