breaking news
Seshachalam Tirumala forest
-
తిరుమలలో సుందర దృశ్యాలు.. మైమరచిపోతున్న భక్తులు
సాక్షి, తిరుమల: జోరు వర్షాలతో ఏడు కొండలు కొత్త శోభను సంతరించుకున్నాయి. తిరుమలలో సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దేవ దేవుడు కొలువైన శేషాచలం అందాలు కనువిందు చేస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాల డోలికల్లో సప్తగిరులు మునిగి తేలుతున్నాయి. చెక్కిలి గింతలు పెడుతున్న పిల్ల గాలులకు మైమరచి పోతున్నాయి ఏడు కొండలు. తనువంతా పచ్చదనాన్ని నింపుకుని సప్తగిరులు శోభాయమానంగా ప్రకాశిస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాలు శ్వేత వర్ణ సొగసులద్దాయి. వెరసి.. కలియుగ దైవం కొలువైన ఏడుకొండలు సప్త పదుల రాగాలు పాడుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సప్తగిరుల అందాలు కనువిందు చేస్తున్బాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను శేషాచల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలిపిరి, ఘాట్ రోడ్లలో దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. దీంతో ఫోటోలు, సెల్పీలు తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. చదవండి: (సూపర్స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి) -
తిరుమల శేషాచలం దగ్ధం
సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో బూడిదైన వృక్షాలు సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవిని మంగళవారం అగ్నికీలలు చుట్టుముట్టాయి. తిరుమలకు సమీపప్రాంతంలోని పారువేట మండపం, కాకులకొండ, పాపవినాశనం, మొదటి ఘాట్రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని దట్టమైన అడవి అగ్నికి ఆహుతైంది. భారీ వృక్షాలు బూడిదయ్యాయి. నాలుగురోజులుగా పారువేట మండపం ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. వీటిని టీటీడీ అటవీ అధికారులు ఎప్పటికప్పుడు అదుపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శేషాచల అడవిలోని పారువేట మండపం ప్రాంతంలో మంటలు తిరిగి పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అక్కడినుంచి పక్కనే ఉన్న శ్రీగంధం వనం వరకు మంటలు వ్యాపించాయి. పారువేట మండపం తూర్పుదిశలోని కాకుల కొండ వద్దనున్న టీటీడీ పవన విద్యుత్ ప్లాంటుకు కూడా మంటలు విస్తరించాయి. దీనిని ముందే ఊహించిన టీటీడీ అటవీ విభాగం విద్యుత్ ప్లాంట్ల వద్ద ఫైరింజన్ను సిద్ధంగా ఉంచుకుని మంటలు చెలరేగకుండా అడ్డుకున్నారు. అలాగే పారువేట మండపం నుంచి ఉత్తర దిశలోని పాపవినాశనం తీర్థం వరకు, తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలోని 18వ మలుపు నుంచి 4వ మలుపు వరకు మంటలు విస్తరించాయి. ఇదే మార్గంలో వెళ్లే వాహనాలకు మంటలు తాకకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ప్రమాద సమాచారంతో టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాసరావు అధికారులతో కలసి కాకులకొండ వద్ద పవన విద్యుత్ప్లాంట్ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఈవో మాట్లాడుతూ మంగళవారం జరిగిన ప్రమాదం తీవ్రతను నియంత్రించటంలో అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. చిత్తూరు జిల్లాలో విస్తరించిన అడవుల్లో మంగళవారం ఒక్కరోజే 37 ప్రమాదాలు జరిగినట్టు శాటిలైట్ ద్వారా గుర్తించామని టీటీడీ డీఎఫ్వో వెంకటస్వామి తెలిపారు. ఈ ఘటనలో సుమారు 500 ఎకరాల్లో అడవి దగ్ధమెందని చెప్పారు.