breaking news
scarecity
-
టేబుళ్లు.. కత్తెర్లు కరువు! రోగుల నిరీక్షణ!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ చికిత్సలతో పోలిస్తే స్పైన్, స్పాండలైటిస్, మెదడులో కణుతుల చికిత్సలు కొంత క్లిష్టమైనవి. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే వీటిని చేయగలుగుతారు. నిమ్స్ న్యూరో సర్జరీ విభాగం ఈ చికిత్సలకు ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి రోగులు పోటెత్తుతుంటారు. ఈ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, 60 పడకలతో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున ఆరు నుంచి ఏడు సర్జరీలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైద్యపరికరాలు కొనుగోలు చేయకపోగా, ఏళ్ల క్రితం కొనుగోలు చేసినవి కూడా సాంకేతిక లోపాలు తలెత్తి మూలకు చేరాయి. ఏడాది క్రితం 35 లక్షల రూపాయల ఖరీదు చేసే అనస్థీషియా వర్క్ స్టేషన్, ఓటీ లైట్లు పాడైపోవడంతో అప్పటి నుంచి సర్జరీలకు విఘాతం కలుగుతోంది. డ్రిల్లింగ్ మిషన్ లేక సర్జరీలు వాయిదా.. ఎముకలను కత్తిరించే డ్రిల్లింగ్ మిషన్ (రూ.15 లక్షలు ఖరీదు చేసే) పాడైపోయి ఐదు నెలలైంది. ఇప్పటికీ దీన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్న వారికి మరింతకాలం నిరీక్షణ తప్పడం లేదు. ఇలా ఒక్క స్పైన్ అండ్ స్పాండలైటిస్తో బాధపడుతున్న బాధితులే 60 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. ఇక మెదడులో కణతులు, రక్తంగడ్డకట్టిన బాధితులు మరో వంద మందికి పైగా ఉన్నారు. కింది చిత్రంలో కన్పిస్తున్న ఆయన పేరు కొప్పొజు శేఖరాచారి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం. ఫ్లోరైడ్ కారణంగా మెడ, వెన్నెముక వంగిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. లేచి నడవలేని స్థితిలో ఉన్న ఆయన చికిత్స కోసం ఇటీవల నిమ్స్ వైద్యులను సంప్రదించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఆయన్ను పరీక్షించి... సీసీఎం, సీ4, సీ5, సీ6 సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్ రాసి, ఆ మేరకు సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. నెలరోజులైంది కానీ ఇప్పటికీ సర్జరీ చేయలేదు. అదేమంటే ఆపరేషన్ టేబుల్ ఖాళీ లేదని ఒకసారి..బోన్ కటింగ్ కోసం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ లేదని మరోసారి తిప్పిపంపారు. సర్జరీ ఎప్పుడు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు’..ఇలా ఒక్క శేఖరాచారి మాత్రమే కాదు మెదడులో కణుతులు, మెడ, వెన్నె ముఖ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది చికిత్సల కోసం నాలుగైదు మాసాలు నిరీక్షించాల్సి వస్తోంది. చికిత్సలో జాప్యం వల్ల సమస్య మరింత ముదిరి చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. -
4.12 కోట్ల మంది వధువులు కావలెను!
ఇది ఒక్క అబ్బాయి కోరిక కాదు. భారతదేశంలోని 4.12 కోట్ల మంది యువకుల కంఠశోష! పెళ్లీడుకు వచ్చివుండీ, తగిన వధువు దొరక్క బలవంతపు బ్రహ్మచర్యంతో కాలం వెళ్లదీస్తున్న అబ్బాయిల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. జనగణనలో వెల్లడైన భారతీయలు వైవాహిక స్థితిగతుల ప్రకారం, దేశంలోని చాలామందికి పెళ్లయ్యే దారి కనబడటం లేదు. స్త్రీ, పురుష నిష్పత్తి దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. 1000 మంది పురుషులకు ప్రస్తుతం 908 మంది స్త్రీలున్నారు. 1901లో ఈ సంఖ్య 972. సహజ లింగ నిష్పత్తి 954 కన్నా ఇది మెరుగు. అయితే క్రమంగా ఈ సంఖ్య 1990ల్లో 930కి, 1980ల్లో 934కి, 1990ల్లో 927కి పడిపోతూ వచ్చింది. కొన్ని దశాబ్దాల పాటు బాలికల జననం మీద కొనసాగిన దారుణమైన వివక్షే దీనికి ప్రధాన కారణం. 20ల్లో ఉన్న యువకులు 5.63 కోట్లు 20ల్లో ఉన్న యువతులు 2.07 కోట్లు 30ల్లో ఉన్న యువకులు 70.1 లక్షలు 30ల్లో ఉన్న యువతులు 22.1 లక్షలు 40ల్లో ఉన్న యువకులు 16.92 లక్షలు 40ల్లో ఉన్న యువతులు 8.67 లక్షలు మొత్తం పెళ్లీడు యువకులు 6.50 కోట్లు మొత్తం పెళ్లీడు యువతులు 2.38 కోట్లు భారతదేశ పురుష, స్త్రీ నిష్పత్తి 1000:908 సహజ లింగ నిష్పత్తి 1000:954