breaking news
sannidhanam
-
తిరుమల సన్నిదానం క్యాంటీన్ అక్రమాలపై భూమన సంచలన నిజాలు
-
సన్నిధానం క్యాంటీన్ పట్ల TTDకి ఎందుకంత ప్రేమ?: భూమన
కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి, వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాయల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.సాక్షి, తిరుపతి: తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి తరిస్తోంది. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుందని అన్నారాయన. ● అద్దె బకాయిలు - అయినా అడ్డగోలు ఉత్తర్వులునిబంధనల ప్రకారం అద్దె చెల్లించక పోవడంతో టీటీడీ రెవెన్యూ అధికారులు సన్నిధానం క్యాంటీన్ ను 21-12-2024న మూసివేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని 30-12-2024 నాడు సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలని ఉత్తర్యులు జారీ చేసింది. వాస్తవానికి టీటీడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు 26-05-2025 నాటికి రూ.2,85,7,106 నగదు చెల్లించాలి. అందులో నిర్వాహకులు నాలుగు దఫాలుగా కేవలం రూ.1,00,24,400 మాత్రమే చెల్లించారు. అయినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీటీడీ వారికి తలుపులు బార్లా తెరిచి సేవ చేసింది. మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారు. దీనిపై అధికారులు తనిఖీ చేసి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 16-09-2024 నాడు టీటీడీ ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కూడా వీళ్ల ఆక్రమణపై లేఖ రాస్తూ... క్యాంటీన్ నిర్వాహకులు ఆక్రమించిన స్ధలంలో కట్టడాలు చేపట్టిన మాట వాస్తవమే, మేం తనిఖీలు చేసినప్పుడు నిర్మాణం ఆపి మరలా ప్రారంభించారు అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. టీటీడీ లైసెన్స్ నిబంధనలు ప్రకారం రెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆఖరు నెల రెంట్ కట్టకపోతే క్యాంటీన్ మూసివేయాలి. ఈ నిబంధన టీటీడీ ప్రొసీడింగ్స్ లో ఉన్న సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకింత ప్రేమ ?● ప్రభుత్వ పెద్దల ఒత్తిడి- తప్పుడు నివేదిక.. నిబంధనలు పాటించని క్యాంటీన్ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. ఒకవైపు దేవస్థానం భూమి ఆక్రమణలు చేయడమే కాకుండా ఆ స్ధలంలో 15 పెద్ద చెట్లను కూడా తొలగించారు. సన్నిధానం క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ కేవలం నాలుగు అకేషియా చెట్లను మాత్రమే తొలగించారని తప్పుడు నివేదిక ఇచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ రాగానే జనవరిలోనే క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించగా.. టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1, 2025న రీఓపెన్ చేసినట్లు రాసుకున్నారు. ఆ మూడు నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేస్తే వాస్తవాలు కచ్చితంగా బయటపడతాయి. మరోవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులకు కేవలం నెలకు రూ.50వేలు ఫీజు నిర్ణయించింది. అంటే టీటీడీ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే... ఇలా ఫైన్లు వేసి వదిలేస్తే తిరుమలలో ఇంచు స్థలం కూడా మిగలదు. ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. అక్కడితో ఆగకుండా... టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు దాదాపు రూ.2 కోట్ల అద్దె కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు క్యాంటీన్ జనవరి నుంచి నడిచినా కూడా రన్ చేయలేదని చూపిస్తూ... 3 నెలల అద్దెను మినహాయించడం దారుణం. భక్తులకు సేవ చేయాల్సిన చైర్మన్, టీటీడీ బోర్డు ఇలా క్యాంటీన్ నిర్వాహకుల సేవలో మునిగిపోవడం దుర్మార్గం. దీనిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి అక్రమాలపై కచ్చితంగా పోరాటం చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. -
అది ఒక మహాఫల ప్రదానం
తీయని ఫలాల్ని దర్శిస్తాం, చవిచూస్తాం. కానీ ఫలాలుగా మారడానికి ముందు చెట్ల కళ్లు కాయలుగా కాస్తాయి. అంతకు ముందు పిందెల అందాలు చూస్తాం. నేల బిలాలు, జలాలు రసపుష్టి కలిగించ డంలో ఎంతో కృషి ఉంది. ఎంతో భూమిక ఉంది. ఇంతకు ముందే గౌరవ సమ్మాన ఫలాల్ని దర్శించి, రుచి చూసిన గరికిపాటి నరసింహారావును ఇప్పుడు భారత ప్రభుత్వం వారి ‘పద్మశ్రీ’ వరించడం ఆయన నిరంతర సాహిత్య కృషికి ఒక మహాఫల ప్రదానం. గరికిపాటిలో– నిరంతర విద్యార్థి, బోధకుడు, పరిశోధకుడు, మహాసహస్రావధాని, అసాధారణ ధారణా ధురీణుడు ఉన్నారు. ‘భాష్పగుచ్ఛం, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం’ వంటి కావ్యాల కర్త. కవితా ప్రయోగ శీలి, ఆధ్యాత్మిక ప్రసంగ ప్రవచనకర్త. ఇందరు బహుముఖ ప్రతిభా రూపాలుగా ఉండటం చాలా తక్కువమందిలో ఉంటుంది. ఆయన ప్రాచీన ఛందో రూపాలైన పద్యాలను ఆధునిక అంశాలతో చెప్పినా, ఉపన్యాసాలలో రొడ్డ కొట్టుడు మూఢ భావాలను చెండాడుతూ సంస్కార భావాలు వెదజల్లినా అందుకు గణనీయ నేపథ్యాలున్నాయి. ఇవి వీరేశలింగం నడయాడిన రాజమహేంద్ర వరంలో ఏర్పడ్డాయి. ఆయన రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పరిశోధన చేశారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ‘మౌఖిక సాహిత్యం’పై పరిశోధన చేసి రెండు స్వర్ణ పతకాలు పొందారు. ఆ పరిశోధన గ్రంథానికి ‘మౌఖిక సాహిత్యంపై మౌలిక పరిశోధన’ శీర్షికతో అపూర్వ పరిశోధనాంశాలతో ఒక పీఠిక సంతరించారు తిరుమల రావు. నరసింహారావు ఈ గ్రంథం తెలుగులో ఈ విష యమై మొదటి గ్రంథం అని ప్రామాణికతతో చెప్పా రంటే పరిశోధనా పాటవం తెలుస్తుంది. తిరు మల రావుగారితో చర్చలు, ఆయన ఆధునిక శాస్త్రీయ భావాలు గరికిపాటిపై ప్రభావాన్ని చూపాయి. నరసింహారావు రాసిన భౌతిక మానసిక పర్యా వరణ మహాకావ్యం ‘సాగరఘోష’. ఈ కావ్యానికి ‘తరంగం అంతరంగం’ శీర్షికతో బేతవోలు రామబ్రహ్మం పీఠిక రాశారు. అందులో రాజశేఖరుని ఉటం కిస్తూన్న సందర్భంలో ‘అవధానాలతో ఆగిపోకుండా, అవే మహాకావ్యాలని ఆత్మవంచన చేసుకోకుండా గరికి పాటి ఈ కావ్యరచన చేశారు’ అని మెచ్చుకున్నారు. గరికిపాటి పద్య రచనా శక్తికి ‘సాగరఘోష’ ప్రతి బింబం. ‘ఇది విశ్వకార్యం. భూమి చరిత్రే ఈ కావ్య ఇతివృత్తం’ అన్నారు. ఒక తరంగ బాలిక ఒక కవి వద్ద సేద తీరుతుంది. కవి కవిత్వంతో లాలిస్తాడు. ఆ కెరటం మేలుకుని అది తిరిగి వచ్చిన సముద్ర తీరాల విశేషాలను చెబుతుంది. మానవుని జీవిత కథ అంతా స్థూలంగా చెబుతుంది. అదే ‘సాగర ఘోష’.గరికిపాటి కవితాశక్తి, భావుకత, సరళ పద్య నిర్మాణ పటుత్వం, ప్రాపంచిక జ్ఞానాంశాలూ ఈ కావ్యంలో ప్రస్ఫుటమవుతాయి.‘సాగర ఘోష’ పర్యావరణ కావ్యం. ఓ పద్యంలో ఓల్గా, టైగ్రిస్, థేమ్స్ మొదలైన నదులు... తమ తీరాలపై పెరిగే కాలుష్యాలను తొలగించేవారే లేరా అని బాధపడుతాయట. ప్రవాహాలకే తమ మౌన వ్యధలు వినిపిస్తాయంటారాయన. ఓ చిన్న పద్యంలో మనం సముద్రం ‘ఉప్పు’ తిని దానికే ముప్పు చేరుస్తామంటారు. వన్యప్రాణి రక్షణ చేయాలని చెబుతూ లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, కృష్ణ జింకలు వంటి అరుదైన జంతువులు మన మింగుళ్లకు బలి అయిపోతున్నాయని ఆవేదన చెందుతారు.అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర పెట్టే నేర్పు ఉన్న నేత పనులవారి చేతులు తెగకోసిన ఆంగ్లేయుల్ని గరికిపాటి అధములైన ఆంగ్ల వీరులు అని ఎద్దేవా చేస్తారు. మార్పుకోసం, మంచి కోసం, మనిషి కోసం ‘సాగర ఘోష’ రాశానన్నారు గరికిపాటి. ఈ మానవ మార్గం విస్తరిస్తూనే ఉండాలి. గరికిపాటిలోని గుప్త జానపదుడు రచనల ద్వారా దర్శనమిస్తూనే ఉండాలి. - సన్నిధానం నరసింహశర్మ వ్యాసకర్త మాజీ గ్రంథాలయ పాలకులు, శ్రీగౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి మొబైల్ : 92920 55531 -
నిరసనల శబరిమల
పంబా: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున మహిళా భక్తుల అడ్డగింపుల పర్వం ఐదో రోజూ కొనసాగింది. ఆదివారం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆరుగురు తెలుగు మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాలమ్మ(47) అనే మహిళ కుటుంబంతో కలసి శబరిమల కొండ ఎక్కుతుండగా సన్నిధానం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే 4 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి వచ్చిన ఆమెను చుట్టుముట్టి వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపాల్సిందిగా కోరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలమ్మ స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్లో పంబాలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బంధువులతో వచ్చిన 40 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు మహిళా భక్తులను కూడా కొండపైకి రానివ్వకుండా ఆందోళనకారులు నిలువరించారు. దీంతో పోలీసులు వారిరువురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం నిలక్కల్ బేస్ క్యాంప్నకు వచ్చిన ఆ ఇద్దరు ఆలయ సాంప్రదాయాన్ని అతిక్రమించటానికి తాము ఇక్కడికి రాలేదని రాతపూర్వకంగా తెలిపారు. వారిరువురిని ఆంధ్రప్రదేశ్కు చెందిన వాసంతి (41), ఆదిశేషి (42)గా గుర్తించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రెహానా ఫాతిమాను ఇస్లాం నుంచి బహిష్కరించినట్లు కేరళ ముస్లిం జమాత్ మండలి వెల్లడించింది. -
అయ్యప్ప దర్శనానికి మహిళల ప్రయత్నం
సాక్షి, శబరిమల : ఈ ఏడు అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ నెల 26న మండల పూజలు పూర్తయిన నేపథ్యంలో.. అయ్యప్ప ఆలయ ఆదాయాన్ని దేవస్థానం బోర్డు గురువారం ప్రకటించింది. మండల పూజల నాటికి 168.84 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం బోర్డు, కేరళ దేవాదాయ శాఖామంత్రి సురేంద్రన్ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకూ ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 20 కోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. మండల - మకర విళక్కును పురస్కరించుకుని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకూ తెరచి ఉంచారు. మకరవిళక్కును పురస్కరించుకుని డిసెంబర్ 30 నుంచి జనవరి 14 వరకూ ఆలయాన్ని తెరచి ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకూ అయ్యప్ప ఆలయానికి వచ్చిన సొమ్మును.. శబరిమలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికే వినియోగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శబరిమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని..ఆయన దేవస్థానం బోర్డుకు సూచించారు. మహిళల ప్రయత్నాలు.. అడ్డుకున్న అధికారులు ఈ ఏడాది కూడా అయ్యప్పను 10 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించే ప్రయత్నం చేసినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్ ప్రకటించారు. మండల పూజల సందర్భంగా 260 మంది స్త్రీలు.. అయ్యప్ప దర్శనం కోసం సన్నిధానంకు వచ్చారని ఆయన చెప్పారు. శబరిమల పవిత్రతను అందరు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే వీరిని గుర్తించి వెంటనే వెనక్కు తిప్పి పంపినట్లు ఆయన తెలిపారు. శబరిమలలో ఆచార ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రికార్డు స్థాయిలో అయ్యప్ప ఆదాయం
సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే అప్పయ్య ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అదనంగా.. రూ. 15 కోట్లు వచ్చినట్లు టీడీబీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా కూడా వారు చెబుతున్నారు. మండల పూజలు పూర్తయ్యే నాటికి ఆదాయం మరింత పెరుగుతుందని వారు అంటున్నారు.గత ఏడాది ఇదే సమయానికి ఆలయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయంరాగా..ఈ ఏడాది అదనంగా మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీపీ పేర్కొంది. మొత్తం రెవెన్యూ వివరాలు శబరిమల అప్పయ్య మొత్తం రెవన్యూ : 101, 08,80,925 అరవణ, అప్పం ప్రసాదం అమ్మకల ద్వారా : 52,63,02,745 హుండీ ఆదాయం : 35,89,26,885 భారీగా భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. నెయ్యాభిషేకం కోసం అయ్యప్ప భక్తులు ఇరుముడి నెయ్యి కోసం మాళికాపురం ఆలయం దగ్గరి ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇరుముడి, నెయ్యిని ఇక్కడే విప్పుకోవచ్చని తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయానికి ఉత్తరాన భండారం పేరుతో మరో కాంప్లెక్స్ ఉందని.. అక్కడ కూడా నెయ్యాభిషేకం చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం
రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రాణహిత కవి, బ్రౌనుమందిరం వ్యవస్థాపకుడు సన్నిధానం నరసింహశర్మ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సాహితీ, గ్రంథాలయ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నవీన్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్టణంలోని ద్వారకా గ్రంథాలయంలో ఈ పురస్కారం అందించారు. నగర ప్రముఖుడు గణపతిరాజు వెంకటపతిరాజు తన తండ్రి దివంగత గణపతిరాజు అచ్యుత రామరాజు పేరిట ఈæపురస్కారాన్ని సన్నిధానంకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు.