-
కొట్టుకుపోయిన సాగర్ ఎడమకాలువ ఎస్కేప్ షట్టర్
చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఏర్పాటు చేసిన ఎస్కేప్ షట్టర్ నీటి ప్రవాహానికి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కొట్టుకుపోయింది. దీంతో సుమారు 1,500 క్యూసెక్కుల వరద కాలువ నుంచి బయటికెళ్లి సమీప గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది. నాగార్జున్ సాగర్ ప్రధాన కాలువ 113.14వ కిలోమీటర్ వద్ద కాలువకు అనుబంధంగా 18 ఏళ్ల క్రితం ఎస్కేప్ను నిర్మించి రెండు షట్టర్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ షట్టర్లను తొలగించి, కొత్తగా ఎస్కేప్ ఏర్పాటు చేయా లని నిర్ణయించిన ఎన్ఎస్పీ అధికారులు రూ.62 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సాగర్ ఆయకట్టు పరిధి రెండో జోన్లోని పంటలను కాపాడటంలో భాగంగా అధికారులు పాలేరు రిజర్వాయర్ను నింపేందుకు ఈనెల 16న నాగార్జునసాగర్లో 6,200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలా లు నేరుగా పాలేరుకు వెళ్తున్నాయి. 19.5 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్తుండటంతో శిథిలావస్థకు చేరిన ఎస్కేప్ షట్టర్ కొట్టుకుపోయిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు షట్టర్కు బిగించిన బేరింగ్లను ఇటీవల దుండగులు ఎత్తుకుపోయారు. దీంతోపాటు చిలుకూరు మండలం బేతవోలు చెరువును నింపేందుకు రై తులు జేసీబీతో షట్టర్ను కొద్దిగా పైకి లేపిన ట్లు తెలిసింది. ఈక్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గేటు తట్టుకోలేక కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. కాలువ కింద, పక్కన ఏమైనా సంఘటన జరిగినప్పుడు నీళ్ల తాకిడిని తగ్గించి మళ్లించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన దానిని ఎస్కేప్ షట్టర్ను అంటారు. ఆయకట్టు పరిధిలోని మునగాల, బరాఖత్గూడెం, ముకుందాపురం, చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు 600 ఎకరాల చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సీఈ రమేష్, ఈఈ సత్యనారాయ ణ, డీఈ రఘు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సాగర్, అడవిదేవులపల్లి రిజర్వాయర్ వద్ద నీటిని నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షట్టర్ కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, కొట్టుకుపోయిన గేటు స్థానంలో సోమవారం రాత్రి కొత్త గేటును అమర్చినట్లు ఎన్ఎస్పీ అధికారులు చెప్పారు. -
సాగర్ కాల్వలో కొట్టుకుపోయిన కారు.. వీడిన మిస్టరీ
సాక్షి, మిర్యాలగూడ: నాగార్జున సాగర్ ఎడమకాల్వలోకి గుర్తు తెలియని వ్యక్తులు కారును తోసేసి పరారైన ఘటనలో.. మిస్టరీ దాదాపుగా వీడింది. కారును కాలువలోకి తోసేసింది అన్నాచెల్లెళ్లుగా గుర్తించారు పోలీసులు. కుటుంబ విభేధాలతో పాటు మతిస్థిమితం సరిగా లేనందునే వాళ్లు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిప్పర్తికి చెందిన రామాంజనేయులు రిటైర్డ్ హెచ్ఎమ్. ఆయనకు మల్లికార్జున్, విఘ్నేశ్వరీ ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూడా దివ్యాంగులే. గత కొంతకాలంగా తండ్రితో వాళ్లకు విభేదాలు నడుస్తున్నాయి. తల్లిదండ్రులతో దూరంగా మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంలో ఉంటున్నారు ఆ అన్నాచెల్లెళ్లు. తమను పట్టించుకోవడం లేదంటూ కొంతకాలం క్రితం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో తండ్రి రామాంజనేయులుపై ఫిర్యాదు కూడా చేసింది విఘ్నేశ్వరీ. ఈ క్రమంలో.. హైదరాబాద్ నాగోలులో ఓ కారును కొనుగోలు చేశారు ఆ అన్నాచెల్లెళ్లు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకే వాళ్లు సాగర్ ఎడమకాల్వలోకి కారును తోసేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నిమిత్తం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మిర్యాలగూడ లో పార్కింగ్ చేసిన సమయంలో తమ కారు పోయిందని విఘ్నేశ్వరీ పొంతనలేని సమాధానాలు చెప్తోంది. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. వీడియో ద్వారా.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో హోలీ పండుగ సందర్భంగా.. కొందరు యువకులు కాల్వలో ఈత కొడుతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడితోపాటు, ఓ మహిళ కారులో వచ్చారు. సాగర్ ఎడమ కాల్వ కట్టపైన వారు కారు నిలిపారు. అనంతరం కారును కాల్వలోకి తోసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమీపంలో కాల్వలో ఈత కొడుతున్న యువకుడు సుధాకర్ అక్కడికి చేరుకుని నీటిలో కారు కొట్టుకుపోతుండగా తన సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కారు నీటిలో కొంతదూరం కొట్టుకుపోయి పూర్తిగా మునిగింది. అయితే అందులో ఎవరూ లేరని పోలీసులకు ఆ యువకుడు చెప్తున్నాడు. పోలీసులు కారు ఆచూకీ కోసం కాల్వ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. కారు వెనుక డిక్కీలో ఏమైనా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు
-
సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు
నల్లగొండ: నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన మంగళవారం జరిగింది. జిల్లాలోని హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి మేహష్, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు స్నానానికి దిగారు. హఠాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహేష్ గుంటూరు నివాసిగా, దుర్గాప్రసాద్ హాలియా వాసిగా గుర్తించారు. -
సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: సాగర్ ఎడమ కాలువ కింద సాగ వుతున్న పంటలకు వరుసగా రెండు వారాలపాటు నీరి వ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎడమ కాలువ కింద సాగవుతున్న పొలాలకు వారం విడిచి వారం నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వారం రోజులే నీళ్లిస్తే పొలాలు దున్నుకోవడం, పంటలు సాగుచేయడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాటు పంటలు పోరుు, తీవ్రంగా ఇబ్బందులుపడుతున్న రైతులను ఆదుకోవాలనే సోరుు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవద్దా అని ప్రశ్నించారు. రెండువారాల పాటు వరుసగా నీరిచ్చి, మధ్యలో వారం రోజులు ఆపినా రైతులకు కొంత ఉపయోగం ఉంటుందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement