సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు


నల్లగొండ: నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన మంగళవారం జరిగింది. జిల్లాలోని హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి మేహష్, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు స్నానానికి దిగారు. హఠాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహేష్ గుంటూరు నివాసిగా, దుర్గాప్రసాద్ హాలియా వాసిగా గుర్తించారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top