-
పోలింగ్ ప్రశాంతం
సాక్షి, చెన్నై: చెన్నై మహానగరంలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా సీఎం జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్, స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామితో పాటుగా 28 మంది పోటీలో నిలబడ్డారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. నియోజకవర్గం పరిధిలో 2,40,543 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిమిత్తం 460 ఈవీఎంలను ఉంచారు. 230 చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. 1205 మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించారు. బారులు: ఉదయం ఏడు గంటల కల్లా అనేక పోలింగ్ బూత్ల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ , ఆయన భార్య లావణ్య, కుమార్తెలు శ్రీదేవి, రమ్య స్థానికంగా ఉన్న పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో మధుసూదనన్ కుటుంబానికి మాత్రమే ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఉదయం ఎనిమిది గంటలకు సరిగ్గా ఓటింగ్ ఆరంభమైంది. తొలుత వేగం పుంజుకున్న ఓటింగ్ మధ్యాహ్నానికి మందగించింది. మధ్యాహ్నం రెండు గంటలకు 53 శాతం మేరకు ఓటింగ్ నమోదైంది. నాలుగు గంటల వరకు మరో పది శాతం మేరకు మాత్రమే ఓటింగ్ నమోదైంది. అన్నాడీఎంకే వర్గాలు అత్యధికంగా ఉన్న కొన్ని పోలింగ్ బూత్లలో పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓటర్లను బలవంతంగా తీసుకెళ్లి మరీ ఓట్లు వేయించడం గమనార్హం. తండయార్ పేటలోని ఏఈ ఆలయం వీధిలోని బూత్లో మధ్యాహ్నం రెండు గంటలకు వంద శాతం ఓటింగ్ జరగడం విశేషం. పరిశీలన: ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా ఎన్నికల తీరును కంట్రోల్ రూం నుంచి పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆయన ఆ కంట్రోల్ రూమ్కు పరిమితం అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని వెల్లడించే పనిలో పడ్డారు. ఎన్నికల ఇన్చార్జ్లు, పర్యవేక్షకులు ఆయా పోలింగ్ బూత్లను సందర్శించి, అక్కడి సరళిని స్వయంగా పరిశీలిస్తూ వచ్చారు. పోలింగ్ బూత్ల వద్ద స్థానిక పోలీసుల కన్నా, పారా మిలటరీ బలగాలకు అత్యధికంగా ప్రాధాన్యతను ఇచ్చారు. పారా మిలటరీ వర్గాలకు సర్వాధికారాలను ఈసీ అప్పగించడంతో భద్రతా పరంగా కఠినంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలను విజయవంతం చేసినా, ఓటింగ్ శాతం సరాసరిగా తగ్గింది. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గి ఉండడం బట్టి చూస్తే, డీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం, ఆ పార్టీ వర్గాలు ఓటింగ్కు మొగ్గు చూపక పోవడం కారణంగా చెప్పవచ్చు. సరాసరిగా నియోజకవర్గంలో 74.4 శాతం మేరకు ఓటింగ్ జరిగి ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో కొత్త చాకలి పేట, తిరువొత్తియూరు రోడ్డులోని పోలింగ్ బూత్లో ఉదయాన్నే ఈవీఎం మొరాయించింది. తక్షణం దానిని ఎన్నికల అధికారులు మార్చేశారు. దీంతో అర గంట ఆలస్యంగా ఓటింగ్ ఆరంభమైంది. ట్రాఫిక్పై దాడికి యత్నం: ఎన్నికలు జరిగే అన్ని బూత్లలో స్వతంత్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని చోట్ల అధికారుల తీరును తన కెమెరాలో బంధించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును, ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం, ఓటర్లతో మాట్లాడుతున్న వివరాలను తన కెమెరాల్లో బంధిస్తూ ట్రాఫిక్ ముందుకు సాగారు. ఆ దిశగా ఓ కేంద్రం వద్ద అన్నాడీఎంకే వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడాన్ని తన కెమెరాలో బంధించడం వివాదానికి దారి తీసింది. అక్కడి అన్నాడీఎంకే వర్గాలు ఆయనపై దాడికి యత్నించాయి. పోలీసులు మాత్రం చోద్యం చూశారని చెప్పవచ్చు. పారా మిలటరీ జోక్యంతో అక్కడి నుంచి ట్రాఫిక్ రామస్వామి వెళ్లిపోయారు.తన మీద దాడికి దిగడంతో పాటుగా, తన కారును అడ్డగించి దాడికి యత్నించారని ట్రాఫిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓడినట్టేనని, ధన బలం గెలిచినట్టుగా సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ అసహనం వ్యక్తం చేశారు. తండయార్పేట పోలింగ్ బూత్లో పరిశీలనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగం చేపట్టిన, తీసుకున్న చర్యలను అభినందించారు. అయితే, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని, ధన బలం గెలుస్తున్నదంటూ పరోక్షంగా ఓటర్ల తీరును విమర్శించే యత్నం చేశారు. -
అట్టహాసంగా జయ నామినేషన్
చెన్నై ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. నెచ్చెలి శశికళ వెంటరాగా నామినేషన్ ప్రక్రియను ముగించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గత ఎన్నికల్లో (2011) శ్రీరంగం నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలుపొందిన జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్షపడిన కారణంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. శ్రీరంగం నియోజకవర్గంలో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో అమ్మ స్థానంలో వలర్మతి ఎన్నికయ్యారు. ఆస్తుల కేసు నుంచి గత నెల 11వ తేదీన వెలువడిన తీర్పులో జయ నిర్దోషిగా బైటపడడంతో 23వ తేదీన ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారం చేపట్టారు. అయితే ఆరునెలల్లోగా అసెంబ్లీ సభ్యురాలిగా గెలవాల్సి ఉన్నందున చెన్నైలోని ఆర్కేనగర్ నియోజకవర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. అర్కేనగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయగా ఉప ఎన్నిక వచ్చింది. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా తొలిరోజున ఐదు మంది నామినేషన్లు వేశారు. రెండోరోజైన 4వ తేదీన ఒక్క నామినేషన్ కూడా పడలేదు. జయహో: అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ముందుగా ప్రకటించినట్లుగానే పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పోయెస్గార్డెన్ నుంచి తండయార్పేటకు బయలుదేరారు. బీచ్రోడ్డు, ప్యారిస్, రాయపురం మీదుగా సాగుతున్న జయకు దారిపొడవునా అభిమానుల ఘన స్వాగతం పలికారు. అనేక కూడళ్లలో కారుపై పూల వర్షం కురిపించారు. బ్యాండు మేళాలు, అనేక వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ అమ్మ కాన్వాయ్ సాగింది. పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు తరలివచ్చి రోడ్లపై నృత్యాలు చేశారు. ఆర్కేనగర్ అభ్యర్థిగా అమ్మ తొలిసారిగా అడుగుపెట్టిన వేళ జయ జయ ధ్వానాలతో మార్మోగి పోయింది. అమ్మ రాకపోకలు సాగించే మార్గం పోలీసుల భారీ బందోబస్తు నిండిపోయింది. 1.30గంటల సమయంలో తండయార్పేట కార్పొరేషన్ నాల్గవ మండల కార్యాలయానికి చేరుకున్న జయకు మంత్రులు ఘనస్వాగతం పలికారు. శశికళతో కలిసి లోనికి వెళ్లిన జయలలిత ఎన్నికల అధికారి శౌరిరాజన్కు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సుమారు పది నిమిషాల అనంతరం జయ తిరుగు ప్రయాణమయ్యారు. మూడో రోజు పది నామినేషన్లు: ఆర్కేనగర్లో పోటీకి శుక్రవారం జయ సహా మొత్తం పది మంది నామినేషన్లు వేశారు. రాందాస్ (భారత మక్కల్ ఇయక్కం), మనోహరన్ (తృణమూల్ కాంగ్రెస్), వెంకటేశన్, వసంతకుమార్ (హిందూ సత్యసేన), పీ కుమారస్వామి, ఈ. మధుసూధన్ (అన్నాడీఎంకే ప్రత్యామ్నాయ అభ్యర్థి), జే మోహన్రాజ్, అబ్దుల్ వహీద్, మారిముత్తు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 15 నామినేషన్లు వచ్చాయి. జయ, మధుసూధన్ మినహా మిగిలిన వారిని స్వతంత్య్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీజేపీ ఊగిసలాట: ఆర్కేనగర్లో పోటీకి పెట్టడంపై కూటమి పార్టీల నిర్ణయంపై ఆధారపడిన భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఊగిసలాటగా మారింది. డీఎండీకే అధినేత విజయకాంత్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ ఇటీవల సమావేశమైనారు. డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, తమాకా పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించినందున విపక్షాల ఓట్లు కొల్లగొట్టవచ్చని విజయకాంత్ భావించి పోటీకి సుముఖత వ్యక్తం చేశారు. ఇంతలో పోటీకి దిగుతున్న సీపీఐ ప్రకటించడంతో కెప్టెన్ వెనక్కుతగ్గారు. విజయకాంత్ ఎటూతేల్చక పోవడంతో బీజేపీలో డోలాయమాన పరిస్థితి కొనసాగుతోంది. కాగా, ప్రధాన అభ్యర్థులు రంగంలో లేకపోయినా అమ్మకు భారీ మెజారిటీ కట్టబెట్టాలని అన్నాడీఎంకే పట్టుదలతో ఉంది. మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో 50 మంది ప్రముఖ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించగా, వీరితోపాటూ విద్యుత్శాఖా మంత్రి నత్తం విశ్వనాథం సైతం ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement