-
హౌసింగ్కు మళ్లీ డిమాండ్
న్యూఢిల్లీ: హౌసింగ్ మార్కెట్పట్ల ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి చూపుతున్నట్లు ఫిక్కీ–అనరాక్ చేపట్టిన సర్వే తెలియజేసింది. సర్వేలో 36 శాతంమంది పెట్టుబడి ఆలోచనతోనే ఇళ్ల కొనుగోలు కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఫిక్కీ–అనరాక్ కన్జూమర్ సెంటిమెంట్ సర్వే 2023 ద్వితీయార్ధం’ పేరుతో నిర్వహించిన రియల్టీ సదస్సులో సర్వేను విడుదల చేశారు. సర్వే ప్రకారం కొనుగోలుదారులు భారీ గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రాజెక్టులలో ఫ్లాట్ల కొనుగోలుకీ ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్–19 సవాళ్లు, వినిమయ ఆదాయం పుంజుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ సంప్రదాయానికి తెరలేవడం వంటి అంశాలు విశాలమైన గృహాలకు డిమాండ్ను పెంచుతున్నట్లు ఫిక్కీ రియల్టీ కమిటీ చైర్మన్ రాజ్ మెండా పేర్కొన్నారు. వెరసి భారీ ఇళ్లు, విలాసవంత గృహాలకు దేశవ్యాప్తంగా గిరాకీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా అద్దె ఇళ్లకు బదులుగా సొంత గృహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ధరలు పెరిగినా.. ఇటీవల ధరలు పెరిగినప్పటికీ సర్వేలో పాల్గోన్న 50 శాతంమంది మూడు పడకగదుల(3బీహెచ్కే) గృహాలకు, 38 శాతంమంది 2బీహెచ్కే ఇళ్లకు ఆసక్తి ప్రదర్శించినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. 2020 ద్వితీయార్ధంతో పోలిస్తే 2023 ద్వితీయార్ధంలో పెట్టుబడి యోచనతో ఇళ్ల కొనుగోలుకి ఆసక్తి చూపినవారు 26 శాతం నుంచి 36 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. వెరసి రియల్ ఎస్టేట్ లాభదాయక పెట్టుబడి అవకాశంగా భావిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్ భారీ లాభాలకు అవకాశాలు కలి్పంచనున్నట్లు అత్యధిక శాతంమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నట్లు వివరించింది. దీనికితోడు భారీ సంస్థలు, లిస్టెడ్ కంపెనీల నుంచి కొత్త ప్రాజెక్టులు పెరగడంకూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితంగా గృహ కొనుగోలుదారులకు విశ్వాసం పెరుగుతున్నదని, ఇది హౌసింగ్ మార్కెట్ బలపడేందుకు దోహదం చేస్తున్నదని అభిప్రాయపడింది. -
కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్ ఎస్టేట్లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు. మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి. మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్ వేయండి. స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి. -
రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి.. ఎక్కడంటే..
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో దక్షిణాసియాలో అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన ‘ఎక్స్కాన్-2023’ను బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వృద్ధిని సాధించాలని మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వాహనాల నుంచి వచ్చే కార్బన్ను తగ్గించి కార్బన్ న్యూట్రల్ దేశం కోసం కృషిచేయాలని కోరారు. దాంతోపాటు ఉద్యోగాల కల్పన జరుగుతోందని చెప్పారు. ‘బిల్డింగ్ ఇండియా టుమారో’ పేరిట అయిదు రోజులపాటు జరగనున్న ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 1200 మంది ప్రదర్శనకారులు హాజరయ్యారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతీయ నిర్మాణ సామగ్రి తయారీదారుల సంఘం ఈ ఈవెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లతో దేశంలో నిర్మాణ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. దాదాపు రూ.10 వేల కోట్లను విశాఖకు కేటాయించనుంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతి, పోటీతత్వానికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ పెట్టుబడులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వినూత్న పరికరాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. నిర్మాణ సామగ్రి పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26% వృద్ధి సాధించింది. ఎక్స్కాన్ 2023లో భాగంగా హైడ్రోజన్, డీజిల్ ఇంజిన్లను సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..! -
మహిళల ఓటు రియల్ ఎస్టేట్కే
న్యూఢిల్లీ: దేశంలో మెజారిటీ మహిళలు సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము రియల్టీలో పెట్టుబడులు పెడతామని 65 శాతం మంది మహిళలు ఓ సర్వేలో భాగంగా చెప్పారు. 20 శాతం మంది తాము స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించగా, 8 శాతం మంది బంగారానికి ఓటు చేశారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ ఈ సర్వేని నిర్వహించింది. 5,500 మంది వినియోగదారుల అభిప్రాయాలను అనరాక్ సర్వే తెలుసుకుంది. ఇందులో సగం మంది మహిళలు పాల్గొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తామని 7 శాతం మంది చెప్పారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన వారిలో 83 శాతం మంది రూ.45 లక్షలకు పైన ధర కలిగిన వాటిని తీసుకుంటామని తెలిపారు. ‘‘ఇంటిని కొనుగోలు చేయాలనుకునే మహిళల్లో 33 శాతం మంది రూ.45–90 లక్షల శ్రేణిలో ఉన్న వాటికి అనుకూలంగా ఉన్నారు. 27 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్లో చూస్తున్నారు. ఇక 20 శాతం మంది రూ.1.5 కోట్లకుపైన ఉన్న విలాసవంతమైన ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.45 లక్షల్లోపు ధరలోని అందుబాటు ధరల ఇళ్లు చాలా తక్కువ మంది ఎంపికగా ఉన్నాయి’’అని అనరాక్ వెల్లడించింది. గతంలో మహిళలు ఇళ్లను 77 శాతం మేర నివాసం కోసమే తీసుకోగా, తాజాగా అది 82 శాతానికి చేరింది. మిగిలిన వారు పెట్టుబడుల కోణంలో తీసుకుంటున్నారు. పలు ప్రయోజనాలు.. మహిళలు తమ పేరిట ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చని అనరాక్ సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరిట యాజమాన్య హక్కులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. 2015లో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ప్రయోజనాలు పొందాలంటే ప్రాపర్టీ మహిళల పేరిట నమోదు చేయడం లేదంటే సహ యజమానిగా ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించింది. మహిళలకు స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడాన్ని కూడా పేర్కొంది. బ్యాంకులు మహిళలకు తక్కువ రేట్లపై గృహ రుణాలను ఇస్తున్నట్టు తెలిపింది. -
చైనా సర్కార్కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు
ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. ఎందుకంటే చైనా స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 29 శాతం. దీనికి కారణాలు లేకపోలేదు. చైనాలో కోటికి పైగా జనాభా ఉండే నగరాలు పదికి పైనే ఉన్నాయి. 1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ వేగం అందుకుంది. మామూలు వేగం కాదు. రాకెట్ వేగంతో పట్టణాలు,నగరాలు విస్తరించారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలు పెట్టింది అప్పుడే. ఇదీ చదవండి: China: రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా) 50ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో పట్టణ జనాభా 64 శాతం మేరకు పెరిగిపోయింది. అంటే గ్రామీణ చైనాలో కేవలం 36 శాతం మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాలవైపు మొగ్గు చూపడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారపు జోరు కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరుతోంది. ఆదాయంలో సింహభాగం రియల్ ఎస్టేట్ పైనే ఆధార పడుతోంది చైనా. రియల్ బూమ్ యాభై ఏళ్లల్లో ఏటేటా పెరిగిపోతూ చైనా ఆర్ధిక వ్యవస్థను ఓ పెద్ద బుడగలా పెంచేసింది. ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క సారిగా కుదుపునకు లోను కావడంతో చైనా భవిష్యత్ ఏంటా అని ఆర్ధిక రంగ నిపుణులు సైతం కంగారు పడుతున్నారు. నిజానికి ఇటువంటి సంక్షోభం ఏ ఇతర దేశంలో చోటు చేసుకున్నా అది ఆ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం ఖాయం. (చైనా డొల్లతనం..దాచేస్తే దాచని సత్యం!) ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? పైకి అంతెత్తున కనిపిస్తున్న చైనాలో పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని చాలా మందే హెచ్చరిస్తున్నారు. గంభీరంగా కనిపించే డ్రాగన్ పాలకులు లోలోన తీవ్ర కలవరానికి గురవుతున్నారని చెబుతున్నారు. అయితే పాలకులు ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగల సత్తా ఉన్నారని ఆ దేశ ఆర్ధిక వేత్తలు బీరాలు పలుకుతున్నారు. ఎవర్ గ్రాండే, ఫాంటాసియాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎవర్ గ్రాండే ఆస్తులపై ప్రభుత్వం ఓ కన్నేసింది. దెయ్యాల నగరాలు.. ఔను చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాల నగరాలే. అంటే నిజంగా దయ్యాలు ఉంటాయని కాదు కానీ.. ఆ నగరాల్లో ఎవరూ ఉండరని అర్థం. చైనాలోని ఈ దెయ్యాల నగరాలే ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. చైనాలో చాలా నగరాల్లో లక్షలాది సంఖ్యలో ఇళ్లు నిర్మించి ఉన్నాయి. చిత్రం ఏంటంటే చాలా నగరాల్లో నిర్మించిన ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసే వారు కేవలం పెట్టుబడుల కోసమే వాటిని కొంటున్నారు. అంతే కానీ ఇల్లు కొని గృహప్రవేశాలు చేసి అందులో కాపురం ఉండడానికి ఎంత మాత్రం కాదు. ఇలా అందరూ పెట్టుబడులకోసం కొని పెట్టుకున్న ఇళ్లతో నగరాలు వెల వెల బోతూ కనిపిస్తాయి చైనాలో. ఇలాంటి నగరాలనే ఘోస్ట్ సిటీస్ అంటారు. అవే దెయ్యాల నగరాలన్నమాట. చైనాలోని దెయ్యాల నగరాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యాల్లో కనీసం 20 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చన్నమాట.జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపడ ఇళ్లు చైనాలో ఖాళీగా అఘోరిస్తున్నాయి. 2021 లో చైనాలో ఇళ్ల నిర్మాణాల్లో 14 శాతం తగ్గుదలనమోదయ్యింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వరుస సంక్షోభాల కారణంగానే ఎవ్వరి దగ్గరా డబ్బులు లేవు. అందుకే కోట్లాది ఇళ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. వేలాది బిలియన్ల డాలర్లమేరకు పెట్టుబడి పెట్టిన వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడం..రియల్ వ్యాపారులనే కాదు చైనా ప్రభుత్వాన్నీ కంగారు పెడుతోంది. యావత్ ప్రపంచాన్ని శాసించేయాలని సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో రగిలిపోతోన్న చైనాలో అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement